ధర్మము ఏది, మర్మము ఎక్కడ?
కర్మరహితమే మోక్షము నరులకు?
ఏమిది?........”
అప్రయత్నంగా ఆమె కళ్ళలో నీరు తిరిగినది. ఆమె మనఃపథాల నౌక ఒకటి ప్రత్యక్షమై నిర్మల నీలాకాశపథాల పక్షివలె తేలిపోతున్నది. ఆ పక్షి వంటి నౌకపై విష్ణువులా బ్రహ్మదత్తప్రభు వామెకు కనిపించినాడు. బ్రహ్మదత్తప్రభువు అలా కనిపించినాడేమి? శ్రీపరమశ్రమణకుని అందంతో సమమైన అందం. అదే కోలమోము, గడ్డం గుంటపడి మామిడిపండులా ఇద్దరికీ! ఆయన నుదురువంటిదే ఈయన నుదురు. ఎప్పుడూ పురుషుల రూపురేఖలనుగూర్చి ఆమె ఆలోచించినదిలేదు. బుద్ధవిగ్రహాలకున్న మోము బ్రహ్మదత్తుని మేము ఆబాలకు నయనపథాల మూర్తించి, నిత్యమైన శిల్పాలలా ఎదుటనే ఉండిపోయినవి.
ఆ బాలిక పద్మాసనాసీనయై యోగినిలా కూర్చుండి, కన్నులరమూతలుపడ
“జ్ఞానదీప శిఖలు వెలుగ
మానవులే దేవులంట
ఆర్హత్వము పొందువారె
అందమైన మోమువారు
నావపైన గురుదేవుడు
నరుల నుద్దరించు మూర్తి
నీలపథము జ్ఞానపథము
నీరపథము జీవయాత్ర!
విద్యలన్ని గరపకుండ
వెడలిపోయె గురుదేవులు."
ఆ పాట ఆమె కెంతో స్వాస్థ్యమిచ్చినది. ఆమె ఆలాగున కన్నులు మూసుకొని భావాంబరమున సంచరింపసాగింది.
★ ★ ★
అడివి బాపిరాజు రచనలు - 6
109
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)