నాచి
ఈవిద్వాంసురాలు ఏలేశ్వరోపాధ్యాయుల కూఁతురు. ఏలేశ్వరోపాధ్యాయులు ఆంధ్రబ్రాహ్మణుఁడు; మిక్కిలి విద్వాంసుఁడు; ఈయన నివాసస్థలము ఏలేశ్వరపురము. ఈఏలేశ్వరపురము శ్రీశైలమునకుఁ బశ్చిమముననుండును. ఈయన విద్యార్థులకుఁ జెప్పు సంస్కృతము నిత్యమును విని యీతని యింటివారందఱును సంస్కృత మతి స్వచ్ఛముగా మాటాడుచుండిరఁట. ఈయనయే మన యాంధ్రదేశమునం దంతటను నాడుల భేద మేర్పఱచి యాయా నాడులలోనే వివాహాదికము లగునటుల నిబంధనఁ జేసెనని చెప్పెదరు. ఆవిభాగంబులు నేఁటి వఱకును మనదేశమునఁ బ్రచారములో నున్నవి. ఈయనకుఁ బుత్రసంతతి లేదు. ముగ్గురుబిడ్డలుమాత్ర ముండిరి.
ఏలేశ్వరోపాధ్యాయులు శా. శ. ము యొక్క 7 వ శతాబ్దమునం దుండినటు దెలియుచున్నది. కాని నాచి సహిత మాశతాబ్దములోనిదనియే యూహింపవలసియున్నది. ఈమె యాంధ్రబ్రాహ్మణ స్త్రీయైనను నీమె చరితమును కాంధ్రదేశమునందెచటను నాధారములు దొరకకపోవుట కెంతయు వ్యసనపడుచు మహారాష్ట్రమునందు దొరకిన యాధారమువలన నీమెయల్ప చరిత్రము వ్రాయవలసిన దాని నైతిని. ఈమె బాలవితంతువు కాన తండ్రి యీమెకా దుఃఖము తెలియకుండుటకై యీమెను విద్వాంసురాలినిగా జేయదలచెను. అటులఁ దలఁచి