రాణి ఔస్కువరు
ఈమె పంజాబుదేశములోని పటియాల సంస్థానమును 18 వ శతాబ్దాంతమునను 19 వ శతాబ్దారంభమునను నేలుచుండిన రాజాసాహెబు సింహునిభార్య. ఈమె తనపతి రాజ్యపాలన కర్హుఁడు కానందువలనఁ గొన్నిదినములును, అతని పిదపఁ గొమారుఁ డల్పవయస్కు డయినందువలనఁ గొన్ని దినములును పటియాల సంస్థానమును జక్కఁగా బాలించి కీర్తిఁ గాంచెను! రా జీమె సొంతవ్యయమునకై యీమెకుఁ గొంత భూమినిచ్చెను. గొప్ప రాజ్యభారమును వహింప సమర్థతగు నామె యా యల్పభూభాగముతోఁ దృప్తినొందియుండక మనమున రాజ్యమునంతను దానేల నిచ్చ గలిగియుండెను. రాజు విచారశూన్యుఁడును, రాజ్యపాలన యందసమర్థుఁడును, దుస్సాంగత్యము గలవాఁడుగాను నుండినందున సంస్థానము మిగుల హీనస్థితికివచ్చెను. రైతులు రాజును లెక్కింపక పన్నుల నెగఁగొట్టుచుండిరి. ఉద్యోగస్థులందఱు తమతమ యర్హకార్యములఁజేయక, తమపైవారిని ధిక్కరింపఁదొడఁగిరి! రాజ్య మిట్లధికదుర్దశకు వచ్చుటనెఱిఁగి రాజు తాను దానిఁ జక్కఁబఱుపలేనని తెలిసికొని తనసవతి తల్లియగు ఖేమ్కువరు తనకై రాజ్యముచేయునట్లు నియమింపఁ దలఁచెను. కానియామె సవతితల్లి యగుటవలన, నామె హితమును రాజుహితమును నొక్కటి కాదనియును, ఆమెచేతికి రాజ్యతంత్రము నిచ్చినచో రాజునకు