పుట:Aandhrakavula-charitramu.pdf/689

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

662

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

           పినవీరభద్రుఁడు పిన్నప్రాయమునంద
                          యఖిలశాస్త్రంబులు నభ్యసించి
           కాళిదాసాదిసత్కవులకు హెచ్చుగా
                          బహుకావ్యవిరచన ప్రౌఢిఁ గాంచె

           వాణి యిల్లాలుగాఁ గవిశ్రేణి కెల్ల
           బృథుతరాశ్చర్యకరమైన బిరుదు పూనె
           తుహినగిరిరాజరామసేతువులనడుమ
           నితని కెనయైన కవివరుం డెందుఁ గలఁడు

పూర్వోదాహృతపద్యములోఁ జెప్పఁబడిన యవతారదర్పణము, నారదీయము, మాఘమాహాత్మ్యము, మానసోల్లాససారము, అను నాలుగు పుస్తకములును గాక పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి 'పురుషార్థసుధానిధి' యను వేఱొక పుస్తకమును గూడ రచించిన ట్టాంధ్రసాహిత్యపరిషత్తువారి పుస్తక భాండాగారములో నున్న యుదాహరణ గ్రంధమునం దుదాహరింపఁబడిన యీ క్రింది పద్యములవలనఁ దెలియవచ్చుచున్నది.

      సీ. కాళకర్పూరనీకాశగా భావింపఁ
                        గవితానిరూఢి ప్రఖ్యాతి నెసఁగు
         యావకారుణదేహయష్టిగాఁ జింతింప
                        మదకుంభియానల మరులుగొలుపు
         నీలజీమూతసన్నిభగా విలోకింప
                        సకలమాయా ప్రపంచంబు నడచు
         కనకచంపకదామగౌరిగా శీలింప
                        నంహస్సమూహంబు సంహరించు

    
         శంభుదేవి విశాలాక్షి సదనుకంప
         యోగిజన సేవ్య యోగపయోదశంప
         శ్రీకరకటాక్షలేశరక్షితనిలింప
         ముజ్జగంబును మొలపించు మూలదుంప.