పుట:Aandhrakavula-charitramu.pdf/688

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

661

పి ల్ల ల మ ఱ్ఱి పి న వీ ర న్న

నిరువురు కవల బిడ్డలను గాంచి, వారికి వీరభద్రనామములు పెట్టెననియు, వారిలోఁ బెదవీరభద్రుఁడు కర్ణాటరాజుల మంత్రి యయ్యె ననియు బిన వీరభద్రుఁడు కవి యయ్యెననియు నీ క్రిందిపద్యములలోఁ జెప్పెను.
 
        క. ఆ గాదిరాజువనిత మ
           హాగుణవతి పరమసాధ్వి యన విశ్రుతమౌ
           నాగాంబ రూపలీలా
           భోగాడ్యులఁ గవలవారిఁ బుత్రులఁ గాంచెన్.


        సీ. అతిలాలితాకారు లాకుమారులు పెద
                           వీరభద్రుఁడు పినవీరభద్రుఁ
           డన్ననామములచే నధిక ప్రసిద్దులై
                           యభివృద్ధి గాంచి రనంతరమునఁ
           బెదవీరభద్రుడు పృథ్వి ధీనుత కార్య
                           దక్షుఁడై కర్ణాటధరణి కరిగి
           వాసిగా రాయసింహాసనమున నుండి
                           యధికులౌ రాయదాయాదులకును

           మఱియు డెబ్బదివేల సామంతులకును
           దానె యధికారియై మహాస్థానులందు
           సకలమంత్రి వరేణ్యులు సన్నుతింప
           భూనుతంబైన కీర్తివిస్ఫూర్తిఁ గనియె


       సీ. మహనీయపిల్లలమఱ్ఱివంశభవుండు
                      గాదిరాజసుతుండు ఘనయశుండు
           వీరేశ్వరుని యవతారమై యిలలోన
                      జను లెన్నఁదగిన సౌజన్యశాలి