పుట:Aandhrakavula-charitramu.pdf/687

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

660

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

   
            గావించినాఁడవు ఘనబుద్దీ మానసో
                        ల్లాససారము సముల్లసితశయ్య

            భారతీతీర్థయతిసార్వభౌమగురుకృ
            పాతిశయలబ్దకవితావిభూతి గలిగి
            గౌరవము గాంచినాఁడవు కవులచేత
            విపులచోటూక్తినిర్ణిద్ర ! వీరభద్ర !

ఈ పద్యమును జూచియే కాఁబోలును నిన్నూఱేండ్లకుఁ దరువాత సీమంతినీ కళ్యాణ మను సోమవార వ్రతకథను రచియించిన యీతనివంశపువాఁడగు సోమనామాత్యుఁడు పినవీరభద్రుని పుస్తకములను గూర్చి తన కావ్యములో నీ క్రింది పద్యమును జెప్పెను.

        సీ. అవతార దర్పణం బన్న కావ్యముఁ జేసె
                             నారూఢి నారదీయంబు బలికె
           మహనీయమగు మాఘమాహాత్మ్యము రచించె
                             శాకుంతలముఁ జెప్పె సరసఫణితి
           నొక్కరాతిరియందు నొనరించె మధురవా
                             క్ప్రౌఢిచే జైమిని భారతంబు
           లలితమౌ మానసోల్లాససారంబన్న
                             కబ్బంబు భాషించె నబ్బురముగ

           మఱియు బహురూపకావ్యనిర్మాణానిపుణుఁ
           డగుచు నుతిఁగాంచె సకలదిగంతరములఁ
           గుకవిజనగర్వతిమిరసంకోచకృత్ప్ర
           భాతరవి యైన పినవీరభద్రసుకవి

ఇందులోని యొక్క రాత్రిలో జైమినిభారతము రచియించె ననుట మొదలయినవి వాడుకలోనున్న కట్టుకథల ననుసరించి వ్రాయఁబడి యుండును. ఈ కవియే తన పుస్తకమునందుఁ బినవీరభద్రుని తండ్రియైన గాదిరాజు చిరకాలము సంతానము లేనివాఁ డయి కడపట వీరభద్ర ప్రసాదము వలన