పుట:Aandhrakavula-charitramu.pdf/659

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

632

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

      1. శ్లో. భార్యాం చంద్రమతీం ప్రాహ దుస్స్వప్న పరిపీడితః
            మయి నిద్రాముపగతే దుస్స్వప్న స్సమజాయత.
                                                  [స్కాందపురాణము]

      2. శ్లో. తతో రామ మహేష్వా సో నిశితేన వరాసినా,
             జఘాన తచ్చిర స్తీవ్రం పశ్యతాం త్రిదివౌకసాం.
             పున రాదాయ తం ఖడ్గం తచ్ఛిరః చేత్తు ముద్యతః,
             తస్యశ్మిరసి తత్ఖడ్గః పపాత సుమదామవత్,
             తత్రాంతరే సర్వ దేవా హాహేతి ప్రియవాదినః.
             తత్రాగత్య ముదావిష్టా స్తత్కరం జగృహుస్తతః.
                                                 [స్కాందపురాణము]

ఈ రెండు కధలలో మార్కండేయపురాణములోనిది యుత్తరహిందూస్థానములోను, పశ్చిమ హిందూస్థా నములోను వ్యాపించి యున్నది. స్కాందపురాణములోనిది దక్షిణహిందూస్దానములో వ్యాపించి యున్నది. ఈ స్కాందపురాణములోని హరిశ్చంద్రకథనే మొట్ట మొదట గౌరనకవి ద్విపదకావ్యముగాఁ దెనిగించెను. తరువాత శంకరకవి, శరభకవి, మల్లారెడ్డి మొదలైనవారు దీనిని పద్యకావ్యములనుగా జేసిరి. గౌరనకవి ద్విపదకావ్యము మృదుమధురపదసంఘటిత మయి లోకోక్తి స్వభావోక్తి సంయుతమయి ప్రౌఢమయి హృదయంగమముగా నున్నది. ఈతని భాషాంతరీకరణకౌశలమును తదితరకవులకు నీతనికిం గల తారతమ్యమును దెలుపుటకయి రెండు, మూఁడుదాహరణముల నిచ్చుచున్నాను.

1. ద్వి. ఓజ దధ్యాజ్యశాల్యోదనమాంస
       భోజనంబులు పరిపూర్తిగా మెసఁగి
       మత్తులై వర్తిల్లు మానవేశ్వరులు
       సత్తుగా బొంకుట సత్య మెయ్యెడను;
       జనపతుఁ లే యూరు ? సత్య మే యూరు ?
       వినఁగూడ దీ మాట విడువుము చాలు. [గౌరనమంత్రి]