పుట:Aandhrakavula-charitramu.pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

631

గౌ ర న మం త్రి


      1. శ్లో. స్వపత్న్యా శైబ్యయా సార్థం బాలకేనాత్మజేన చ,
            వ్రజతో సర్వతో రుధ్వా పంథానం ప్రాహతం మునిః
                                              [మార్కండేయపురాణము]

        “వ. ఇట్లు వర్షితా శేషవిభూషణుండై తరువల్కలంబులు ధరియించి
             యన్నరేంద్రుఁడు శైబ్యమైన ధర్మపత్నియుం దనయుండును దాను
             నిలు వెడలు సమయంబున నమ్మునికుంజరుం డతని కడ్డంబు వచ్చి”.
                                             [మారనకృతాంధ్రమార్కండేయపురాణము]

      2. శ్లో. శ్రుత్వా రాజా తదావాదీ దేవమస్తు శుచివ్రతే !
             తతః కృత్వా చితాం రాజా చారోప్య తనయం స్వకమ్,
             భార్యయా సహిత శ్చాసౌ బద్ధాంజలిపుట స్తదా
             చింతయన్పరమాత్మాన మీశం నారాయణం హరిమ్.
                                               [మార్కండేయపురాణము]

         క. అనవుఁడు నొడఁబడి విభుఁ డిం
            ధనములు సొదగా నొనర్చి దానిపయిఁ దనూ
            జుని విడి భార్యయుఁ దనపిఱుఁ
            దన నిలువం గేలు మొగిచి తత్పరమతియై
            .... ... .... .... ...... ....

         క. నారయణుఁ బీతాంబరు
            శ్రీరమణీరమణు భక్తచింతామణి దు
            ర్వార విపద్ద్విపకుంభవి
            దారణనిపుణాభిధానదైవతసింహున్.

        సీ. తలఁచుచునున్న యా ధరణీశునొద్దకు
                           ధర్ముండు మొదలుగాఁ దత్క్షణంబ
            ..........................వచ్చి రపుడు.
                                              [మారయకృతమార్కండేయపురాణము]