పుట:Aandhrakavula-charitramu.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

618

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

     
     ఉ. శ్రీవిభు సెజ్జ మేదినికిఁ జెల్వగు పుట్టము దివ్యనవ్యర
         త్నావళిమన్కిపట్టు దివిజారులదుర్గము వాహినీపతుల్
         భావముగట్టురావు బడబాజ్వలనంబున (వంటయిల్లు) నాఁ
         గా విలసిల్లు నా వనధిగాఢమహత్వము చెప్ప గొప్పగున్.

     చ. వరయశుఁ డింకఁ గల్గు గురువంశమునన్ జనమేజయుండు నాఁ
         బరఁగి బరీక్షితాత్మజుఁడు పాయక యాతఁడు సర్పయాగ ము
         ద్ధురమతిఁ జేయునప్పు డతిదుస్సహతద్దహనార్చులందు సో
         దరహితపుత్రపౌత్రసహితంబుగ మ్రగ్గుఁడు మీర లందఱున్.

     ఉ. అశ్వముజాడ గానక భయంపడి యా సగరాత్మనందనుల్
         నిశ్వసనాహుతిన్ వదననీరజము ల్గమలంగ మొత్తమై
         యాశ్వనురూపయానమున నక్కడ కక్కడ కేఁగి యేఁగి యీ
         విశ్వవసుంధరాస్థితి గవేషణ చేసిరి పెక్కు భంగులన్.

     ఉ. తన్మదిరాక్షవిభ్రమము దక్కక కన్నులఁ గ్రోలఁ జొచ్చెఁ బ్రే
         మన్మరుచే బిట్టడరి మానస మాకుల మయ్యె నిట్లు గ
         న్నున్మనసున్ వశంబులయి నూల్కొనమిన్ బహిరంతరంబులన్
         దన్మఱచెం గరం బజుఁడు దందడి వేడ్కలు సందడింపఁగన్.

పయి పద్యములు శివలీలావిలాసములోనివి. ఈ క్రింది పద్యముల వీర మాహేశ్వరములోని వని యుదాహరింపఁబడినవి

     సీ. పులుఁగురాయఁడు తమ్మికొలకలచెలికాని
                            బండిబోయనితోడిపాలివాఁడు
        పన్నగశ్రీలకుఁ బాలిండ్ల పనవాస
                            మగడింప నోపిన మగలమగఁడు
        దంభోళి కోకయీఁకఁతాఁకు కానిక చేసి
                            యమృతంబుఁ దెచ్చిన యవఘళండు