పుట:Aandhrakavula-charitramu.pdf/612

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

585

బమ్మెర పోతరాజు

        ప్రబలధారాసురత్రాణభద్రజాతి
        కరిఘటా సైన్యదుస్సాధకనకలోహ
        గోపురద్వాఃకవాట ప్రదీపిత మతి
        సాంద్రవిభవంబు రాజమహేంద్రపురము.

అని శ్రీనాధుఁడు పోతనామాత్యుని కాలమునందే కాశీ ఖండములో రాజ మహేంద్రపురమును వర్ణించుచుఁ బయి పద్యములో గోదావరిని గంగ యని చెప్పియున్నాఁడు

 3, సీ. గంభీరపరిఖనాగస్త్రీల కశ్రాంత
                     కేళీవిహారదీర్ఘిక యనంగ
       నుత్తాలసాలమన్యుల కుబ్బి దివిఁబ్రాఁకఁ
                     జేసిన దీర్ఘనిశ్రేణి యనఁగ
       చతురచాతుర్వర్ణ్యసంఘ మర్థులపాలి.
                     రాజితకల్పకారామ మనఁగఁ
       భ్రాంతసుస్థిత యైన భవజూటవాహిని
                     ముక్తిభక్తిప్రదస్ఫూర్తి యనఁగ

       నెప్పుడును నొప్పు రాజమహేంద్రవరము
       ధరణిఁ గల్పించే నే రాజు తనదు పేర
       నట్టి రాజమహేంద్రుని యనుఁగుమనుమఁ
       డెసఁగుఁ జాళుక్యవిశ్వనరేశ్వరుండు.

అని నన్నయకుఁ దరువాతను శ్రీనాధునికిఁ బూర్వమునందును నుండిన విన్నకోట పెద్దన్న కావ్యాలంకారచూడమణిలో రాజమహేంద్రవరవర్ణనమున గోదావరిని “భవజూటవాహిని (గంగ)" యని చెప్పి యున్నాఁడు.
ఆ ప్రాంతములయందు గంగ యని వ్యవహరించబడెడు గోదావరి యేక శిలానగరమునకు నాలుగయిదు దినముల ప్రయాణములో పదియామడల దూరమున నున్నది. ఆ పుణ్యనదీ ప్రవాహాము నందు స్నానముచేయువా