పుట:Aandhrakavula-charitramu.pdf/613

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

586

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

రక్కడనుండి యా నదీతీరమున నున్న మంథెనకుఁ బోవుదురు.

పోతనామాత్యుఁడు తన కవిత్వారంభదశలో గోలకొండ సీమలోని రాచకొండ దుర్గాధీశ్వరుడైన (రేచర్ల) రావు సింగభూపాలునీ ప్రేరణముచేత రచియించిన భోగినీదండకము కూడ నీ మహాకవి యోరుగల్లు ప్రాంతములవాఁడని దృఢీకరించుచున్నది. ఇతఁడీ దండకమును 1430-వ సంవత్సరప్రాంతమున నిరువదియైదేండ్లలోపలి వయస్సులోఁ జేసియున్నట్టు కనఁబడుచున్నది. పోతన 1405-వ సంవత్సర ప్రాంతమున జనన మొంది 1460-1470 సంవత్సరముల వఱకును జీవించి యుండును. ఈతని కాలమును నిర్ణయిం చుటకు వేంకటగిరిసంస్థానమునకు మూలపురుషుఁడైన భేతాళనాయనికి బదవతరమువాఁడయి 1423 మొదలుకొని 1443 వ సంవత్సరము వఱకును కర్ణాటరాజ్యపరిపాలనము చేసిన ప్రౌఢదేవరాయల కాలములో నుండిన సింగభూపాలునికథ మాత్రమే కాక పోతనామాత్యుని మునిమనుమలగు కేసనమల్లనకవులచేత రచియింపఁబడిన “దాక్షాయణీవివాహము' కూడ కొంత తోడుపడుచున్నది. ఈ "దాక్షాయణీవివాహము" గురుజాల మల్లన సోమయాజి కంకితము చేయఁబడినది. కవులు కృతిపతియైన మల్లనసోమయాజి తమ్ముఁ బిలిపించినట్లీ క్రింది పద్యమునఁ జెప్పుకొని యున్నారు.

      సీ. శ్రీరామలింగాంఘ్రి సేవావరప్రౌఢిఁ
                      గవితాచమత్కృతుల్గాంచువారి
          నప్పలమ్మయును వీరంబయుఁ ను బ్రౌఢస
                      రస్వతిని గన్నప్రజ్ఞపారి
          కౌండిన్యగోత్ర విఖ్యాతి బమ్మెరభవ్య
                       వంశాఢ్యులై సిరి వఱలువారి
          నివటూరి ముక్తి నాగేశసద్గురుభక్తి
                        నాదిమశైవులైనట్టివారి

          కేసకవిమల్లకవినామకీర్తి పరుల
          మమ్ముఁ బిలిపించి మన్నించి మదిఁ దలంచి