పుట:Aandhrakavula-charitramu.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

546

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

మాన్నెపోతాన్న వేమకుమారగిరీశ్వరాదుల ...................సంబంధ బాంధవ్యంబున వసుంధరాభారధౌరంధర్యంబు నంది.................... అల్లాడ భూవల్లంభుఁడు రాజమహేంద్రంబు రాజధానిగా సింహాద్రి పర్యంతంబు............విశ్వవిశ్వంభరాభువనమండలంబుఁ దదనంతరంబ.

      గీ. రాజరఘురాము లల్లాడరమణసుతులు
         ధాత్రిఁ బాలింతు రాచంద్రతారకముగ
         వేమభూవల్లభుండును వీరవిభుఁడు
         నన్నదమ్ములు హలియును హరియుఁ బోలె.

     ఉ. తమ్ముని వీరభద్రవసుధాధిపు విక్రమవీరభద్రునిన్
         నమ్మదలీల రాజ్యభరణస్థితిఁ బట్టముగట్టి బహుద
         ర్పమ్మున వేమభూవరుఁడు వ్రాసె జగద్విజయప్రశస్తివ
         ర్ణమ్ములు దిగ్ధురంధరసురద్విపకుంభవిషాణమండలిన్."

అను భీమపురాణములోని గద్యపద్యములవలన నల్లాడభూపతి కొండవీటిరెడ్డి రాజులతోడి సంబంధబాంధవ్యమువలన రాజ్యలాభమును బొందినట్లగపడుచున్నది, గాని యీ బాంధవ్య మెట్టిదోమాత్ర మీ పురాణమువలన బోధపడదు. కొండవీటిరెడ్డిరాజులతోడి బాంధవ్యమువలన రాజమహేంద్రవరరాజ్యము కాటయ వేమారెడ్డికి లభించిన విధము కొంతకాలముక్రిందట చింతామణిలోఁ బ్రకటింపబడిన యీ క్రింది మల్లాంబిక (కాటయ వేముని భార్య) యొక్క తొ త్తరమూడి దానశాసనమువలనఁ దేటపడుచున్నది.

    శ్లో. తత్ర పంటకులం నామ ! ప్రసూతం బహుశాఖిని,
        తరావివ ఫలం రమ్యం వృత్తం సరస ముజ్జ్వలం,
        తత్రాసీ ద్వేమభూపాలః కులే విబుధరంజకః,
        పయోధావివ సంతానో రాజరత్నోద్భవాకరే.
        శ్రీ మాన్వేమమహీపతి స్స విదధే పాతాళగంగాతటే
        శ్రీశైలే జగనొబ్బగండ బిరుదస్సోపానవీధీం శుభాం.