పుట:Aandhrakavula-charitramu.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

427

అ నం తా మా త్యుఁ డు

      క. ఆ ముమ్మడి ప్రెగ్గడ శ్రీ
         రాముఁడు సీతను వరించు క్రమమున సుగుణ
         స్తోమాభిరామ నమితకృ
         పామండిత నెఱమాంబc బరిణయమయ్యెన్.

      క. ఆరమణీరమణులకు బ్ర
         భారమ్యుఁడు తిక్కవిభుఁడుఁ బ్రకటితకాంతి
         స్పారుండు సింగనయు నను
         వారలు పట్టి రిలఁ బుష్పవంతులమాడ్కిన్.

     చ. చిరతరశోభనుం డగు వసిష్ఠ మునీశ్వరుఁడయ్యరుంధతిన్
         బరిణయమై గృహస్థ గుణభాసితుఁడై వెలుగొందుమాడ్కిఁగా
         తరపరిరక్షణానవరతవ్రతశీలుఁడు తిక్కమంత్రి శే
         ఖరుఁడు వివాహమయ్యె గుణగౌరవశోభిని మల్లమాంబికన్.

     మ. అరిషడ్వర్గముఁ దూలదోలి ధరలో నైశ్వర్యషడ్వర్గ మీ
         వరుసన్ సంభవ మొందెనాఁగ సుతషడ్వర్గంబు జన్మించెఁ ద
         త్పురుషస్త్రీతిలకంబులందు ఘనసంతోషంబు తద్బాంధవో
         త్కరముం బొంద సమగ్రసంపద నిజాగారంబునం జెందఁగన్

తిక్కమంత్రికి మల్గమాంబికకును బుత్రుఁ డైన యనంతామాత్యకవి తన కవిత్వము తొంటి పెద్దలకవిత్వమువలె రుచించునో లేదో యని సంశయించుచు నీ క్రిందివద్యముతో నొకవిధమైన సంతుష్టిని వినయపూర్వకముగాఁ దెలిసి యున్నాఁడు.

      చ. వెలయఁగఁ దొంటిపెద్దల కవిత్వమువోలె రుచించు నొక్కొ యేఁ
          బలికెడు నూత్నకావ్యరసభావము లైనను భూమిఁ దల్లిదం
         డ్రులకు నిజాగ్రసూనులపటు ప్రచురోక్తులకంటెఁ జిన్నబి
          డల వెడతొక్కుఁబల్కులు దృఢంబగు ముద్దుల నీనకుండునే?