పుట:Aandhrakavula-charitramu.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

428

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

ఈ కవి తాను గవిత్వమును జెప్పఁబూనుటకును, నూతనమార్గమున భోజుని కధలను జెప్పఁబూనుటకును, కారణముల నీ క్రింది పద్యములలో మనోహరముగాఁ దెలిపి యున్నాఁడు.

           సీ. సకలవిద్యలయందుఁ జర్చింప గవిత యు
                        త్కృష్ణమం, డ్రది నిత్యకీర్తికొఱకు
              నర్థాప్తికొఱకు నావ్యవహారలక్షణం
                        బెఱిఁగెడుకొఱకు ననేకవిధము
              లగు నమంగళముల హరియించుకొఱకు ను
                        చితనిత్యసౌఖ్యసంసిద్దికొఱకు
              నొనరఁ గాంతాసమ్మితోపదేశంబునఁ
                        బ్రీతిమై హిత మాచరించుకొఱకు
            
              నయ్యెఁ గానఁ బెద్దలాచరించెద రంచు
              వేర్పుఁకొలఁదిఁ గృతి యొనర్పఁబూని
              యస్మదీయకృతికి నధిపతిఁ గావింప
              నర్హుఁ డెవ్వడొక్కొ యని తలంచి.

           సీ. నూతనం బయ్యుఁ బురాతనకృతులట్ల
                          సంతతశ్రవ్యమై బరగుననియు
              నాదిరాజసమానుఁ డగు భోజభూపతి
                         చరిత మీ కవితా ప్రసంగ మనియు
              నిందుఁ జెప్పెడి కథలిన్నియు నోలిఁ బ్ర
                         శస్తధర్మోపదేశంబు లనియు
              నఖిల జగన్నాధుఁ డగు నహోబిలనాధుఁ
                         డీ పుణ్యకృతికి నధీశుఁ డనియుఁ

              బృథివి నెల్ల జనులు ప్రియభక్తియుక్తిఁ బా
              టింతు రనియు నూఱడిల్లి యేను
              బరమసౌఖ్య మైన భవదాభిముఖ్యంబు
              నెమ్మిఁ బడసి యధికనిష్ఠతోడ