పుట:Aandhrakavula-charitramu.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

426

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

       శా. జానొందన్ శకవర్షముల్ బుుతుశరజ్వాలేందులై యొప్ప న
           య్యానందాబ్దమునందు మాఘమునఁ గృష్ణైకాదశీభౌమయు
           క్తానామామృత వేళ నీకృతి యనంతాఖ్యుండు సమ్యగ్రస
           శ్రీనిండం ధ్రువపట్టణాధిపున కిచ్చెన్ భక్తిపూర్వంబుగన్.

కాఁబట్టి యీ కవి పదునేనవ శతాబ్దారంభమునం దుండినవాఁడు. 1434-వ సంవత్సరమునం దుండిన యీ కవియెుక్క ముత్తాత యగు బయ్యన యీతని కన్న నూటయేఁబది సంవత్సరములకంటె నధికపూర్వఁ డగుట పొసఁగక పోవుటచేతను, ఆ బయ్యన్న కవిత్వము చెప్పి తిక్కన సోమయాజిచే మెప్పొంది యుండుటచేతను, తిక్కనసోమయాజి హూణశకము 1290-వ సంవత్సర ప్రాంతమువఱకును జీవించి యున్నట్లించుమించుగా నిర్ధారణ మగుచున్నది. తిక్కనసోమయాజి నన్నయభట్టారకునికాలము లోనివాఁడు కాఁడని చూపుట కింతకంటెఁ ప్రబలసాక్ష్య మేమి కావలెను? బయ్యన మొదలుకొని కవివంశమును దెలుపు భోజరాజీయములోని పద్యములను నడుమ నడుమఁఁ గల వర్ణనాంశముల విడుచుచు నిం దుదాహరించుచున్నాను.

      చ. శరధిసుత న్వరించు జలజాతవిలోచనుమాడ్కి శీతభూ
          ధరజఁ బరిగ్రహించు హిమధామకళాధరుపోల్కి సద్గుణా
          భరణఁ బవిత్రమూర్తిఁ గులపాలిక నాcదగు ప్రోలమాంబికం
          బరిణయమయ్యె నెయ్యమున బయ్యచమూపతి వైభవోన్నతిన్.

      చ. గుణయుతు లవ్వధూవరులకు న్జనియించిరి త్రేత రామల
          క్ష్మణులయి పుట్టి ద్వాపరయుగంబు తుదిం దగ రామకృష్ణులై
          గణనకు నెక్కి - యీ కలియుగంబున నిట్లుదయించె లోకర
          క్షణుఁడగు విష్ణు దేవుఁ డన గంగనమంత్రియు ముమ్మడన్నయున్.

      చ. కడిమి గిరీటి దానమునఁ గర్ణుడుఁ భోగమున న్సురేంద్రుఁడె
          క్కుడు విభవంబునన్ హరి యకుంఠితబుద్ధిఁ బురందరేభ్యుఁడున్
          గడువగు ధీరతన్ సురనగప్రవరుం డనఁ బ్రోలమాంబ ము
          మ్మడి బెడఁగొందు రూపమహిమ న్మరుముమ్మడియై జగంబునన్.