పుట:Aandhrakavula-charitramu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

295

అ ధ ర్వ ణా చా ర్యుఁ డు

పూర్వోక్తములైన ద్వాదశాంధ్ర భాషలలో కలియుగమునందు రెండాంధ్రభాషలు పుట్టినవి. పాపరహితమైన కృష్ణాగోదావరీ మధ్యదేశమునందు దివ్యమయి గోకుల్యపార్శ్వస్థమైన భార్గవక్షేత్రమున గోదావరియొక్క యుత్తరతటమున గంగాముఖ మను ప్రదేశ ముండెను. ఆ ప్రదేశమున మహాయశుఁడై న శాతకర్షి పాలించుచుండిన మహేంద్రపురమునందు విష్ణువర్ధనునిపుత్రుఁడును, సర్వశాస్త్రవినీతజ్ఞఁడును, వేదవేదాంగపారగుఁడును, సర్వభాషా రహస్యజ్ఞుఁడును, శాంతుఁడును, దాంతుఁడును. శాతకర్ణిమహారాజుయొక్కసభాధ్యక్షుఁడును. సమాహితుఁడునైన నందివర్ధన నామధేయుఁ డుండెను.

ఆతనికి శిష్యుఁడయి నియోగియు నాంధ్రభాషారహస్యజ్ఞుఁడు నైన దేవళరాయఁడుండెను. వా రుభయులను రాజాస్థానసభాప్రదీపములుగా వర్ణింపబడుచుండిరి, పండితోత్తములైన వీ రిద్దఱును రాజాజ్ఞను శిరసావహించి కలియుగమున మున్నూటయేcబదియెనిమిది సంవత్సరమునందు స్వయముగా కళింగాంధ్రమును, రౌద్రాంధ్రమును స్థాపించిరి. ఇది కలియుగాబ్దము 5018 అగుటచేత పూర్వోక్తమయిన వృత్తము నడచి యిప్పటికి నాలుగువేల యాఱునూట యఱువది సంవత్సరము లయినది. ఇఁక పూర్వకాలాంధ్ర భాషాకవనరీతిని గూడఁ గొంచెము చిత్తగింపుఁడు. కృతయుగమున సుధాయనుcడు స్థాపించిన భాష కాంధ్ర మని "పేరు గలుగుటకుఁ గారణమును విశ్వేశ్వరభట్టాచార్యులవారు భాషాముకుర మను నాంధ్రగ్రంథమునందిట్లు వ్రాసియున్నారఁట.

           
                 
            సీ. 'ఖేచరకిరణాగ్ని డగ్గిబోడరముచే
                         సత్యభాగుడియిండ్ల భాసముదర
                అగ్నిమిత్రుడంధకత ఝడంగె డుమ్మిలో
                         కడిజిగ్ఝి భాస్కరుం మనన మొంది
                బొరవిన జెరణినిం గడగుడి గెరగించి
                         గుడగనోచి భాబిందు లడగదొడసె
                ఆడుగ నా భామణి నవభవకరమొండ్రు
                        త్సలరించి వరుణకరగాగర్భ బవిడె