పుట:Aandhrakavula-charitramu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బద్దెనకవి

ఆంధ్రచోడులలోనివాఁ డై_న యీ బద్దెనృపాలుఁడు నీతితిశాస్త్రముక్తావళి యను గ్రంథమును జేసెను. ఈ గ్రంధమును బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు 1910 వ సంవత్సరమునందు పెద్ద పీఠికతోఁ బ్రచురించిరి. ఈ బద్దెననృపతి కృష్ణానదీతీరమునందున్న దక్షిణ షట్సహస్రదేశమును పాలించిన యొక చిన్న సామంతరాజు. శ్రీరామకృష్ణకవిగారీ బద్దెనకవిని గూర్చి "కృష్ణవేణానదీతీరదక్షిణషట్సహస్ర విషయాధీశ్వర వీరమాహేశ్వర కీర్తి సుధాకర గుణరత్నాకర వేంగి చాళుక్య మూల స్తంభ రిపుదళిత కుంభికుంభ బలయాంగనాగృహతోరణ నన్నన గంధవారణనామాది ప్రశస్తిసహితం శ్రీమహామండలేశ్వరబద్దచోళనరేంద్ర" మను శాసనము నుదాహరించి, దానినిబట్టి యతఁడు క్రీస్తుశకము 10౩౦ వ సంవత్సరములో నుండవచ్చు నని యూహించి, ఆ శాసనము "చెన్నపట్టణపు లైబ్రరీలోని చరిత్రముల లోనిది గావున నమ్మఁదగినది కా" దని దానిని నిరాకరించి, ఇట్టి బిరుదులు గలవాఁడు కేవలసామంతరా జగునా ? యని సందేహించిరి. ఇట్లు సంశయపడవలసిన పని లేదు. మనలోని సంస్థానాధిపతుల కనేకులకుఁ దమకు గల గ్రామములకంటె బిరుదనామములే యెక్కువగా నుండును. ఉన్న రాజ్యము చిన్నదే యయినను బిరుదావళి మాత్రము పెద్దదిగానున్న రాజు లనేకులు గలరు. ఈ కవికాలవిషయమున రామకృష్ణకవిగారు చేసిన యూహ సరియైనది కాదు.ఈ కవి కాలము నించుమించుగాఁ దెలిసికొన దగిన యాధార మొకటి కవియొక్క నీతిశాస్త్రముక్తావళియందే కానవచ్చుచున్నది.

          సీ. 'రాజనీతియు నసద్రాజలక్షణమును
                     మంత్రిమార్గంబు దుర్మంత్రివిధము
               నధికారవిధియుఁ గార్యవిచారము నుపాయ
                     గతియును రాజ్యరక్షాక్రమంబు