పుట:Aandhrakavula-charitramu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

           దలఁకక డాయఁబోయి విదితంబుగఁ గాcచె రథంబు మీఁద ని
           ర్మలమణిమండనద్యుతినిరాకృతహంసుని రాజహంసునిన్ -ఆ 2

       ఉ. ఏపునఁ బోరు సేనలకు నెల్లను మీఱి సముల్లసద్భుజా
           టోపముమై నరాతులఁ బటు ప్రదరంబులఁ బాఱద్రోలి యా
           భూపతి యగ్గమైన రథమున్ రథపుం గదియించి లంఘన
           ప్రాపితతద్రథుండ నయి పట్టి వెసం దెగఁజూచి యార్చితిన్ --ఆ 4.

       చ. కనుగొనునంత నా మనసుఁ గన్నుల మన్మథుఁ డింతిపాలు చే
           సిన మెలఁగఁగలేక గత చేష్టుఁడ నై యిదినిద్రవోవుచో
           మనమున కింతపుట్టెె గరిమం బగు విభ్రము మంగకంబు నొం
           దినతఱి జూచువారలకు ధీరత యెక్కడిదంచు లోలతన్ --ఆ 6.

       ఉ. అల్లుఁడ వీవు రాజ్యమున కంతకు నర్హుడ వీవు భూమికిం
           దల్లివి తండ్రివిన్ బహువిధంబుల దాతవు నీవు మాకులం
           బెల్ల సముద్దరింప నుదయించిన పుణ్యుఁడ వీవు నీకు నే
           నెల్లి మదీయపుత్రిఁ బురమెల్ల నెఱుంగఁగఁ బెండ్లిచేసెదన్ --ఆ 8.

       ఉ. నీ వలవోకఁజూచి తరుణీతిలకంబుమనంబు రూపమున్
           భావగతంబులైన గడుఁ బ్రౌఢత చూపుట గోరి యచ్చుపా
           టై వఱలంగ నున్న తెఱఁ గంతయు వ్రాసితిఁగా తలంచెదన్
           దేవసమాన నా యెఱుక తెల్లమొ బొంకొ నిజంబు చెప్పుమా --ఆ 10

       శా. సైన్యంబు ల్మద మెక్కి బాహుబలముల్ శౌర్యంబులుం జూపి ని
           ర్దైన్యస్ఫూర్తి గడంగి ఫెూరపటుసస్త్ర ప్రౌఢిమన్ నిష్ఠురా
           నన్యోన్యాహవనోత్థితాగ్నికణరౌద్రాకారతన్ లోకసా
           మాన్యాతీతమహో గ్రవిక్రమరణోన్మాదప్రకారంబులై --ఆ. 12

ఈదశకుమారచరిత్రములో భారతాంధ్రీకరణ విషయమేమియు జెప్పఁకుండకపోవుటచేతఁ దిక్కన యీ గ్రంథరచననాటికి భారతము చేయ నారంభించి యుండడు.