పుట:Aandhrakavula-charitramu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

తి క్క న సో మ యా జి

       సీ|| వచ్చిన యయ్యార్యవర్యు నెదుర్కొని
                        వినయాసంభ్రమభక్తు లినుమడింప
                  నతిథిపూజ లొనర్చి యతనిచే భారతా
                        ర్ధమును ద్వైతాద్వైత తత్త్వములును
                  విస్మృతచిదచిద్వివేకలక్షణములుఁ
                        బ్రకటధర్మాధర్మపద్దతులును
                  రాజనీతి ప్రకారంబును భారత
                        వీరుల మహిమంబు వినుచునుండి

                  యనుమకొండనివాసు లైనట్టి బౌద్ద
                  జనుల రావించి వారిఁ దిక్కనమనీషి
                  తోడ వాదింపఁజేసినఁ దొడరి వారిఁ
                  జులకఁగా సోమయాజులు గెలుచుటయును.

                వ. అప్పుడు బౌద్ధదేవాలయంబులు గూలం ద్రోయించి గణపతి దేవరాజు సోమయాజుల పటువాక్యశక్తికి మెచ్చి యతనిన్ బహు ప్రకారంబుల బూజించి యెనిమిది గ్రామంబు లొసంగి యతఁడు వచ్చిన కార్యం బడిగిన నా భూవరునకుఁ గవివరుం డిట్లనియె.

             గీ. ఇనకులోద్భవుఁడైనట్టి మనుమసిద్ది
                 రాజు నెల్లూరు పాలించుచోఁ జెలంగి
                 యతనిదాయాదు లతని నుక్కఱఁగఁ బట్టి
                 యునిచి రాజ్యంబుఁ దమ రేలుచున్నవారు

             క. కావున మీ రిపు డచటికి
                 వేవేగం దరలి వచ్చి విడకుండఁగ నా
                 భూవరుల బునరభిషిక్తునిఁ
                 గావింపఁగవలయు ననిన గణపతివిభుఁడున్.
 
             గీ. "అట్ల కాక" యనుచు నా పని కొడఁబడి
                  యత్యుదారగుణసమగ్రుఁడగుచుఁ