పుట:Aandhrakavula-charitramu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

                దవిలి యప్పు డొక్క నవలక్ష ధనమును
                యజ్ఞకుండలములు నతని కిచ్చె.

            క. పనుచునెడఁ దిక్కమఖి
                యా జనవరుసింహాసనమున సచివా గ్రణియై
                తనరెడు శివదేవయ్యన్
                గనుఁగొని యా రాజు తోడఁ గడఁకం బలికెన్.

            గీ. 'వసుమతీనాధ ! యీతఁ డీశ్వరుఁడు గాని
                మనుజమాత్రుండు గాఁడు పల్మాఱు నితని
                యనుమతంబున నీవు రాజ్యంబు నెమ్మి
                నేలు'మని చెప్పి యా ఘనుఁ డేగుటయును.

            సీ. గణపతిదేవుఁ డా ఘనుననుమతిఁ గాంచి
                         యతిసత్వరమునఁ బ్రయాణభేరి
               వేయించి చతురంగపృతనాసమేతుఁడై
                         తరలి ము న్వెల నాటిధరణిపతుల
               గెలిచి వారలచేత లలి నప్పనముఁగొని
                         వారి నందఱఁ దనవశము చేసి
               కొని చని నెల్లూరు గొబ్బునఁ జొచ్చి
                         య క్కనయు బయ్యనయు నన్ ఖలులఁ దఱిమి

               మనుమసిద్దిరాజుc బునరభిషిక్తుఁగా
               వించి మించి రెండువేలు నైదు
               నూఱు గ్రామములు మనోవృత్తి కతనికి
               నిచ్చి కడమc దాను బుచ్చుకొనియె.

ఈ పుస్తకమునందుఁ గణపతిదేవుఁడు రెండువేలయేనూఱు గ్రామములు మనుమసిద్ధి కిచ్చినట్లు గొప్పగాఁ జెప్పినను, ప్రతాపచరిత్రమునుబట్టి యఱువదెనిమిది గ్రామములను మాత్రమే యాతని కుంచినట్లు స్పష్టమగుచున్నది. దీవినిబట్టి చూడఁగా మన్మసిద్ధి యొక్కయు దిక్కన యొక్కయు