24. కవికోకిల గ్రంథావళి [తృతీయాంకము
ప్రథమ స్థలము: విశ్రాంతిభవనము.
[రాముఁ డాసీనుడైయుండఁగాఁ దెఱయెత్తఁబడును]
రాము : ఓరి, యెవఁడురా అక్కడ ?
ద్వారపాలకుఁడు : మహాప్రభో, దాదుఁడను.
రాము : ఓరీ, రాజ్యకార్యవిముక్తులమైన మా కించుకసేపు లోకవ్యవహార వినోదము గావింపవలయునని భద్రునకు మామాటగఁ దెలియఁజేయుము.
ద్వార : ఏలినవారియాజ్ఙ. [నిష్క్రమించును.]
భద్రు : రామభద్రా, జయము జయము !
రాము : భద్రా, విశేషము లేవియైనఁ గలవా ?
భద్రు : [నవ్వుచు] ఒక గొప్ప విశేషముగలదు. పాపదేవత మాత్రము మిమ్మెప్పుడు వేయినోళ్ళ దూషించుచుండును.
సకల భోగభాగ్య సౌఖ్యములకుఁ బుణ్య
కార్యములకు నునికి గలదు రామ
రాజ్యమందు, నాకు రవయేనిఁ దలదాఁప
నీడ లేదటంచు నిత్య మగలు
రాము : [చిఱునవ్వుతో] ఓయీ, నీ ప్రియోక్తులు చాలింపుము. లోకు లే మనుకొనుచున్నారు ?
భద్రు : దేవర పవిత్రచారిత్రము లోకమున కాదర్శప్రాయ మైనది.
రాముఁడు లోకరక్షకుఁ, డరాతిభయంకరుఁ డుగ్రదైత్యదో
స్థ్సేమహరుండు, దుష్టజన శిక్షకుఁ, డార్యజనావనుండు, స