పుట:2015.392383.Kavi-Kokila.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24. కవికోకిల గ్రంథావళి [తృతీయాంకము

ప్రథమ స్థలము: విశ్రాంతిభవనము.

[రాముఁ డాసీనుడైయుండఁగాఁ దెఱయెత్తఁబడును]

రాము : ఓరి, యెవఁడురా అక్కడ ?

ద్వారపాలకుఁడు : మహాప్రభో, దాదుఁడను.

రాము : ఓరీ, రాజ్యకార్యవిముక్తులమైన మా కించుకసేపు లోకవ్యవహార వినోదము గావింపవలయునని భద్రునకు మామాటగఁ దెలియఁజేయుము.

ద్వార : ఏలినవారియాజ్ఙ. [నిష్క్రమించును.]

భద్రు : రామభద్రా, జయము జయము !

రాము : భద్రా, విశేషము లేవియైనఁ గలవా ?

భద్రు : [నవ్వుచు] ఒక గొప్ప విశేషముగలదు. పాపదేవత మాత్రము మిమ్మెప్పుడు వేయినోళ్ళ దూషించుచుండును.

                         సకల భోగభాగ్య సౌఖ్యములకుఁ బుణ్య
                         కార్యములకు నునికి గలదు రామ
                         రాజ్యమందు, నాకు రవయేనిఁ దలదాఁప
                         నీడ లేదటంచు నిత్య మగలు

రాము : [చిఱునవ్వుతో] ఓయీ, నీ ప్రియోక్తులు చాలింపుము. లోకు లే మనుకొనుచున్నారు ?

భద్రు : దేవర పవిత్రచారిత్రము లోకమున కాదర్శప్రాయ మైనది.

                         రాముఁడు లోకరక్షకుఁ, డరాతిభయంకరుఁ డుగ్రదైత్యదో
                         స్థ్సేమహరుండు, దుష్టజన శిక్షకుఁ, డార్యజనావనుండు, స