పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

97


మంతయేకాని పౌరుషహాని కొప్పి
వెడలనోపము దీనికి నడల ననుచు.

241


మ.

నయసంధాయకచాతురి న్మెలఁగు శాణా వైతివా యర్దని
ర్ణయ మేర్పా టొనరించి సంధియ యొనర్పం జూడు మీవింక దు
ష్క్రియకుం బూనిన వానిడెంద మది చక్కం జేర్పలే మన్నచోఁ
బుయిలోడం జనదంతమాత్రలకు మాబోం ట్లిందు రాఁజెల్లునే

242


క.

మంచిది మాకర్మము వై
రిం చనకృత మెట్లొ యట్టిరీతిని జరుగుం
గొంచక చనుఁడీ యన మే
లంచు న్హసనల్లిఖాను డరిగెం దిరుగన్.

243


శా.

రాజీవాసనవంశసంభవశిఖారత్నంబు నాఁ బొల్చునా
గోజీరాయఁడు రాజు మేటితురక ల్గూర్చుండఁగా నోలగం
బై జంభాసురుపోల్కి నుండెడు సుబాపజ్జం ప్రవేశించి కే
ళీజైవాతృకుఁ డైనవాఁడు హసనల్లీఖానుఁ డుత్సాహియై.

244


మ.

 ధన మెంతైన నొసంగు వార మని యాథార్థ్యంబుగాఁ గోట యీ
మని నౌబత్తు సడల్ప నోప మని యన్యాయంబుచే నెత్తి వ
చ్చినఁ బ్రాణంబుల కాసఁ జెంద మని నిశ్చింత న్మముం జంపఁ జూ
చినఁ జచ్చే మని పల్కినా రవల మీచిత్తం బనం గ్రుద్ధుఁడై.

245


తే.

తోఁకఁ ద్రొక్కిన యురగంబుతో సమత్వ
మూని హైదరుజంగు దుర్మానగరిమ
రాజు వినుచుండ నంతంత రాజునగ్ని
యట్టుల రవుల్కొనుచుఁ బల్కె నిట్టు లనుచు.

246