పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

రంగారాయచరిత్రము


క్రియను బరాఙ్ముఖంబునకు గేవలశాత్రవు లెత్తి వచ్చినన్.

235


తే.

మాననీయతఁ గాంచి యస్మద్విరోధి
జవనయవనాశ్వికులతోడ సంభ్రమించి
యెత్తి వచ్చినయపుడు మే మొత్తిగిలుట
రావువంశంబు దుష్కీర్తితావుఁ గనుట.

236


ఉ.

 కావున విూర లెంతనయ గౌరవభాషణము ల్రచించినన్
భావ మొకింతయు న్విముఖభావము గాంచదు మాకు శౌర్యసం
భావితకీర్తియౌ వెలమపట్టికి ధర్మము గానిరీతి యే
లా వచియించు టర్ధకృతలంపట మొప్పెద నెంతయేనియున్.

237


మ.

ధృతి నర్పింతుఁ బదార్థ మెంతయిన నిర్దేశించినం బైనసం
గతము ల్పౌరుషహానికృత్యములు దుర్గం బిచ్చి పొమ్మంట నౌ
బతు జాలించుమటంట వీనికి నొడం బా టొందుట ల్లేవు మా
మతిలోఁ గీర్తిధనాఢ్యు లెందు బిరుదు ల్మాయింతురే యుర్వరన్.

238


క.

బిరు దుడిగిపోవుకన్నను
మరణంబే మేలు మాకు మఱియు విచారం
బరయఁగ లే దిది తుదివ
త్సర మనికొనియెదను దీన సందియమేలా.

239


క.

ఋభులోకవిభునియంతటి
శుభలక్షణలక్షితునకు సొలిగెనె నహుష
ప్రభవాపత్ప్రథ యిప్పటి
కభిమానం బెడలుకంటె హైన్యము గలదే.

240


తే.

అర్థ మెంతైన నిచ్చెద మంతమీఁద
నొడఁబడఁడయేని ప్రాణము ల్విడుచువార