పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

45


దుగులింగావనిభర్త రాజమణి సంతోషిల్లఁగా వచ్చె నొ
క్కగజోత్తంసము నెక్కు చొక్క మగు నుత్కంఠాతిరేకమ్మునన్.

162


శా.

ధన్యాటోపులు మందపాటికులరత్నంబుల్ మహారాజమూ
ర్ధన్యుల్ శ్రీ రఘునాధ రాజబలభద్రక్ష్మావరుల్ మున్ను సౌ
జన్యక్రీడలఁ బాఱుదెంచి శిబికాచంచద్గతు ల్మీఱ రా
జన్యగ్రామణి కిచ్చి రుత్సవముఁ దత్స్వాంతంబు కాంతంబుగన్.

163


చ.

 నలువది వేల కాల్బలము నాలుగువేలతురంగమంబులున్
నలువదియేఁబదేనుఁగు లనంతములైన శతఘ్నికాచయం
బులు నొకవేయులొట్టియ లపూర్వవిభావిభవంబుఁ దెల్పుచుం
గొలువ ఫరాసుఱేనిఁ గనుగోఁ జనుదెంచెను రా జతిత్వరన్.

164


వ.

 ఇట్లు మిన్ను మెఱసి యనన్యసామాన్యసామ్రాజ్యదురంధ
రుం డగు నారాజపురందరుండు గంధబంధురసింధురస్కం
ధం బధివసించి విచిత్రముక్తాతపత్రప్రముఖరాజలక్షణలక్షి
తుండై సపరివారంబుగా నరుగుదెంచునప్పుడు.

165


తే.

 దుర్నిమిత్తంబు లొకకొన్నిఁ దోచె నెదుట
దాన భావ్యర్థసూచకం బౌ నటంచు
నెఱిఁగి యెఱుఁగక వర్తించి రెందఱేని
కారణము దీర్పఁబోల దెవ్వారికైన.

166


శా.

ఆసన్నాహవిజృంభితస్ఫురణచే నారాజచంద్రుండు కై
లాసక్ష్మాధరతుంగశృంగగతలీలాకందరం బంచితో
ల్లాసప్రౌఢిమ డిగ్గు సింగముక్రియన్ లావణ్య మింపొదఁ గ్రీ
డాసన్నాహసముజ్వలద్గజమువేడ్కం డిగ్గి యల్లల్లనన్.

167