పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

రంగారాయచరిత్రము


ము రచించె సంస్కృతమునఁ బండితుం డసి
             కవివరుం డనియును గాంచెఁ గీర్తి


తే.

నతఁడు వేంకటగిరివంశమందు నుదయ
మందిన వసుంధరావరులందు దశమ
పూరుషుం డయి జను లెన్నఁ బేరు వడసె
దగదె యాతనివర్ణింప జగతియందు.

113


క.

 అల వేంకటగిరిపురరా
జులలోఁ బదునేనవపురుషుం డగుచు మహిన్
బొలిచెఁ బెదరాయఁ డాతఁడె
వెలసెను నిర్వాణరాయవిభుఁ డనుబేరన్.

114


సీ.

మొగలాయిప్రభులకై పూని షేర్మహమదు
       ఖానుఁ డనెడు పేరు గల్గినట్టి
సరదారుడు మనదేశమును జయింపఁగ
       వచ్చె నాతనితోడ వచ్చినట్టి
యిరువురుప్రభులలో నీతఁ డొక్కరుఁ డయి
       యుండెఁ దత్కాలపుయుద్ధములను
బలుసాయ మొనరించి పాదుషావలన రా
       జామనునట్టి సంస్థానము బ్రతి


తే.

ఫలముగను నొందె రెండవప్రభువు విజయ
నగరరాజ్యము మొదటివాఁడుగ గణింపఁ
బడిన మాధవవర్మ యన్ బుడమిరేఁడు
వీరిలో బెద్దరాయపృథ్వీవరునకు.

115


సీ.

సంస్థానము నొసంగు సమయంబునందె వం
       శక్రమంబుగను రాజాబహదరు