Jump to content

పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

33


మొదలైన బిరుదులు ముఖ్యమౌ తెల్లజెం
       డా నవుబత్తును ఢక్క యాది
గలిగిన రాజచిహ్న లొసంగఁబడె నుత్త
       రపుసరకారులం దపుడు పోరి
సందడి యడగ దాజనపతి కూడవ
       చ్చినయట్టి లింగప్ప యనుసుతునకుఁ


తే.

దనకు సమకొన్న యారాజ్యమును నొసంగి
తండ్రితాతలనాటిదై తనకు వేంక
టగిరి రాజ్యమ్మునకును దిరుగ జనియెను
బెద్దరాయ వసుంధరావిభువరుండు.

116


శా.

శ్రీమల్లింగపరాయమానవపతిశ్రేష్ఠుండుసర్వప్రజా
క్షేమాపాదకరాజ్యరక్షణపరస్వీయాంతరంగాడ్యుఁ డై
రాముం బోలుచుఁ దండ్రిగారివెనుకన్ రాజ్యంబు పాలించె ది
గ్భామాకాయదుకూలతావిభవశుంభత్కీర్తిసంపన్నుఁ డై.

117


చ.

అపుడు శ్రిగాకుళాఖ్యపురమందు వసించు నబాబు గారు త
ద్విపులపరాక్రమాతిశయవిశ్రుతలింగపరాయనాముఁడౌ
నృపమణిరంగవా కను వనీస్థలికి న్మృగయార్ధ మేగి శ
త్రుపటలబద్ధు నాత్మసుతు దోర్విభవంబున వారిఁ గొట్టితే
నపరిమితప్రమోదభరితాంతరుఁడై కడుసన్నుతింపుచున్.

118


శా.

గారా మొప్పఁగ నప్పు డీతనినిరాఘాటప్రతాపాఢ్యతా
ధీరత్వాదిగుణప్రపంచము నిజాంధీగోచరం బౌనటుల్
దా రాగంబున వ్రాయఁ జూచి యతఁ డుత్సాహంబుచే నిచ్చెరం
గారావన్ ఘనపౌరుషాఖ్యఁగులజక్ష్మాపాలచిహ్నంబుగన్.

119


ఉ.

అంతియెకాక యొక్కనిశనాయనగ్రామము లెన్నితోరణా