పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృ తీ యా శ్వా స ము.

159


వ.

 తదనంతరంబున నారాజకుఁజరుండు దనయభీష్టసిద్ధికిఁ దద్ద
యుం బ్రమోదం బందుచు నిజశిబిరంబునం బటకుటీరం
బులో నోలగం బుండి బొబ్బిలిపురంబునం బట్టాభిషిక్తుండ
నగుదు నని తత్పురాలంకరణంబునకుం దత్సమయసముచిత
మంగళద్రవ్యానయనంబునకు నచటికిం దనదేవుల సమా
కర్షణంబునకుం బ్రయత్నంబునం బొరలుచుండె నంత
మఱునాటిదివసంబున.

244


శా.

 రాజన్యైకవధావధానవిధికై రంగక్షమానేతమున్
రాజీవాప్తసమానతేజు ననివార్యస్థైర్యు ధైర్యాచలున్
రాజాంకోట నమర్చే నేఘనుని ధీరస్వాంతుఁ డాకీర్తు వి
భ్రాజచ్ఛౌర్యుఁడు తాండ్రవంశజుఁడు తద్భారంబు తాఁ బూనుటన్.

245


మ.

 తనజాయాదినిబర్హణజ్వలితవార్తాకర్ణనోత్ధవ్యధా
జనితంబై పెర రేఁచురోషపటిమన్ క్షత్రాగ్రగణ్యైకహిం
సనదీక్షారతియై పరాక్రమము మించం దాండ్ర పాపయ్య చ
య్యన నాత్మీయుల నిర్వురం దనకు సాహాయ్యంబుఁ గావించుచున్.

246


ఉ.

 దేవులపల్లి పెద్దనృపతిప్రవరుండును బుద్ధరాజు వెం
కావనిభృచ్చిఖామణియు హైహయుసన్నిభవిక్రమాఢ్యులై
క్రేవల నేగుదేరఁ దనకేవలశౌర్యరసప్రభావసం
భావనపిక్కటిల్ల రణపార్థుఁడు తాండ్రకులీనుఁ డత్తఱిన్.

247


తే.

 అధికబలుఁ డైన యతనితో నాహవమున
కెదిరి నడచుట కూడని యిచ్చఁ బేర్చి
యొరు లెఱుఁగకుండ గూఢసంచరణకలనఁ
గడఁగి పరిమార్చు టుచితంబుగా యటంచు.

248