పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

రంగారాయ చరిత్రము


క.

 అని నిష్ఠురోక్తు లాడుచు
ననిలో మఱికోటలోన నరయుచుఁ దత్త
జ్జనవిసరమరణదీక్షా
జనితాశ్చర్యంబు మది విషాదముఁ గొలుపన్.

238


తే.

యుద్ధరంగంబునం బడియున్నవీరు
జీవశేషుని వెంగళరావు నరసి
చాల మన్నించెఁ దనకృపాచ్ఛాదనమున
నతనియగ్రజతనయసంయుతము గాఁగ .

239


శా.

మూసాబూసి కృపాప్రసాదమున కామోదించి యావెంగళ
క్ష్మాసంక్రందనుఁ డన్న లేకొమరుతో శారీరశస్త్రవ్రణా
యాసంబుం బెడబాసి సర్వధరణీశాభ్యర్చితఖ్యాతిచే
భాసిల్లెం దనమే ల్సహింపనిరిపుప్రాణాలి జాలిం బడన్.

240


తే.

 విజయరామరాజు వెంగళరావుతో
ననియె నీదు బంధుహితజనంబు
చనిన పిదప నీవు సంత్యక్తనుండవై
చనక బ్రతికి తేల యనెడు నంత.

241


క.

 నీవిభవమెల్లఁ గనుఁగొన
జీవించినవార మిట్టిచేష్టకు నీకుం
గావలయు పనులు దై వము
గావించు నటంచుఁ బలికెఁ గనలి యతండున్.

242


శా.

ఆరాజన్యుని రాకపోకడల తూర్యస్వాన మాలించి దు
ర్వారక్రూరతరాఘపుంజ మితఁ డౌరా యంచు నీనేలపైఁ
బారేచీమలు మింటిత్రోవ నరిగేపక్షుల్మొద ల్గాగ సం
సారు ల్దూరనివారు వానవెలిగాఁ జన్వారు లే రుర్వినిన్.

243