పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృ తీ యా శ్వా స ము.

149


డ్గముఖాఘాతముల న్శిరశ్చరణవక్షకంఠము ల్వస్సి తు
త్తుమురై రయ్యివాగువార లపు డాదోదొమ్మియుద్ధంబునన్.

199


సీ.

 ఈటె లీటెలఁ జుట్టి యెగచి కఠారము
      ల్పెఱకి పేరురముల విరియఁ గ్రుమ్మి
తరువారు తరవారు నొఱసి మిణుంగురు
      ల్గురియంగ జబ్బల కుఱికి నరికి
బల్లెము ల్బల్లేలఁ బాపి చంకిలి డాసి
      యలుగక డంబావ నంటఁ గ్రుచ్చి
కత్తి కత్తి నగల్చి తుత్తునెలై రాల
      విసరి యొండొరువులఁ గసి మసంగి


తే.

 గుండియ ల్వీల నేజాల కొలఁది గ్రుద్ది
ప్రేవు లురులంగ సాదుల జావఁ బొడిచి
పోటుదోటోనిబిరుసునఁ బోరి రిట్టు
లుభయసైనికయోధు లాయోధనమున.

200


చ.

 కణఁగి పరస్పరంబు సెలకట్టకపోరుడు ఘోరయుద్ధ మా
ఫణిపతికి న్వచస్పతికి భారతికి న్వశిపోవ దెంతయున్
గణుతి యొనర్ప నైన నది గన్గొనఁ జొప్పడు తొంటి రామరా
వణులరణంబుకన్నఁ గురుపాండవయుద్ధముకన్న మిన్ననై.

201


వ.

 మఱియు నవ్వీరపుంగవుం డగు వెంగళరాయధరాపురంద
రుని బలంబులు భుజాస్ఫాలనంబులు సలుపుచుం బలంబున
నావిష్కృతక్రోధరసాధీనులయి ముష్కరతురుష్కధాను
ష్కానీకినీనికాయంబుఁ బొదివి హతప్రత్యాహతంబులు
గాఁ బోరిపోరి యితరేతరకరవాలధారానిపాతంబును బర
స్పరకఠారికావిపాటనంబును నన్యోన్యకుంతనికృంతనంబును