పుట:2015.372978.Andhra-Kavithva.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ

68


నిచో జాతియాన్నత్యము స్తంభించి జాతీశ క్తి ఘనీభవించిపోవు ననియు వీరి రాజకీయమతము. ఈ రాజకీయమతముఁ బురస్కరించు కోనియే వీరు కావ్యసృష్టి స్వభావమును నిరూపింపఁజూచిరి.

భారతీయకావ్యధర్మము. కావ్యము మానవాత్మ, ప్రకృత్యాత్మ, ( పరమాత్మలకుఁ గలసంబంధమును వర్ణించును. )

"ఆర్య' పత్రి కలయందు 'భవిష్యత్కవిత్వ' మసువిషయ మునుగూర్చి వ్రాయుచు భారత కావ్యధర్మమును వీరిట్లు నిరూ పించిరి... "కావ్య మాత్మానుభవప్రకటన మేకొని బుద్ధివి శేష సూచకము గాదు. కావ్యము మానవాత్మకును, బ్రకృత్యాత్మ కును, బరమాత్త కును గల యనిర్వాచ్యము నగమ్యగోచర మును నగుసంబంధమును వ్యక్తీకరింపఁ జూచును. . వేదమత మునఁ బర బ్రహ్మ వాజాత్ర మున లోకముల నెట్లు సృజిం చెనో, యడ్లే కవియును గావ్యమువలనఁ గొద్దిగఁగాని, గొప్పగఁగాని, శకలములుగఁ గాని, యఖండముగఁగాని, జీవములతోడను, వస్తువుల తోడను, ననుభవములతోడను గూడుకొనిన మనో ౽ంతర్గర్బిత ప్రపంచమును సృష్టించును. సృష్టియెల్లను గొప్ప, మాయ, అందలి బాహ్య విషయములు మాత్రమే విచారణసుల భము లగును. కావ్యసృష్టియు నిట్లే. కవి తనమంత్ర ప్రభా, వము నెఱుఁగనిమాంత్రికుఁడు. కావ్య నిర్మాణశక్తియు నాత్మాను భవమే కాని బుద్ధి చాతుర్యము గాదు. కవి యాత్మశక్తిపరి పూర్ణుఁడై మనస్సు ద్వారా 'శావ్య నిర్మాణమునకుఁ గడంగి యా "ధ్యాత్మి తానుభవమువలననే తన కావ్యశోభకు సంతసించుచు మనలో లగూడ సంతసముఁ బురిగొల్పును.