పుట:2015.372978.Andhra-Kavithva.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం పోక్యం కోస్యమ్.

67


నాళయములపట్లను, కాలస్వభావానుగతములగు మార్పుల పట్లను నిరాదరులై యున్నారు. కాని, _ వీరి ప్రధానసిద్ధాంతము కొంతవఱకు సమర్థనీయమని యొప్పుకొనక తప్పదు.

2. అరవిందఘోషం. ఆధ్యాత్మికళ క్తియే భారంతీయుల సర్వస్వము భారతధర్మస్వరూపము. ,

అరవిందఘోషుగారు మొట్ట మొదట రాజకీయవిషయ ములఁ గూర్చి విశేషముగ వ్రాయుచు పానీని భారతధర్మము 'ననుసరించి సమన్వయముఁ జేయఁజూచిరి, భారత దేశ మభివృద్ధి "నందవ లేననిన యుగయుగములనుండి వచ్చుచున్న భారతధర్మము మూలసూత్రములకు భంగము లేకుండ ననుష్టింపఁబడవలయు సనియు, భారతశక్తి స్వతంత్రశక్తిగఁ బ్రజ్జ్వరిల్లి కాలమహా శతో సరిసమానముగఁ జేతులఁ జేతులు గలిపి కొనుచు స్నేహభావముతో సంచరింపవలయుననియు వీరు బోధించుచున్నారు. ఈభావమును బురస్కరించుకొనియే స్వదేశీ వ్రతమును, స్వరా జ్యూదర్శమును, స్వధర్మనిరతీయు వారు ప్రజలకుఁ బత్రికా ముఖమున నిరంతరము నుపదేశించుచుండిరి. వారియుప దేశ బీజ ములు భారతభూమిని దిట్టముగఁ నాటుకొని మన ప్రస్తుతాభి వృద్దికిఁ గారణభూతము లయినవి. వీరికి దాస్యము గిట్టదు. స్వాతంత్ర్యరక్తి మెండు. కాని పరులతోడి విరోధమునుగూడ సాధ్యమయినంతవజకు నవసరము లేదు. ఆనఁగా భారత దేశ మునకుఁ బర దేశముల సంసర్గము మేలుగ నున్నంతవఱకుఁ గూడుననియు, గాలశక్తిసంచారమును నిరోధింపఁ జూడరా దనియు, స్వదేశ స్థితిగతులకును, స్వధర్మమునకును, ననుకూలము లగు మార్పులు జరుగుచునే యుండవలయుననియు, నట్లు జరుగ