పుట:2015.370800.Shatakasanputamu.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈ మానసబోధశతకమును తాడేపల్లి పానకాలరాయండను కని రచించెను. కవి కాలము కులము గోత్రాదికము లెఱుంగుటకుఁ దగిన యాధారము లీశతకమునందుఁ గనఁబడవు. చిత్తబోధశతకమునఁ గల విప్రుఁడనను విశేషమువలనఁ గవి బ్రాహ్మణు డని నిశ్చయింప వీలుచిక్కినది. పానకాలు కవి పైరెండుశతకములే గాక పార్థసారథిశతకము రామశతకము లక్ష్మీదేవిశతకము నృసింహస్వామిశతకము రుక్మిణీపతిశతకము నేైత్రదర్పణమను వైద్యశాస్త్రము రచించెను, నేత్రదర్పణములోనిదగు

"సీ. శ్రీవత్సగోత్రుఁ డంచితపటుశాస్త్ర సం
                    ఖ్యావనీదేవకులాగ్రగణ్యుఁ
     డగు తాడేపల్లి...
     పానకాల్రాయుఁ డనువాఁడ...”

అను పద్యమువలన నిక్కవి శ్రీ వత్సగోత్రుడనియు నాఱువేలనియోగియనియుఁ దెలియును. నేత్రదర్పణములోని

"సీ.గీ.. నీటుగానెన్నఁదగుఁ గొండవీటిసీమ. ...