పుట:2015.370800.Shatakasanputamu.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. అట్టిసీమాప్రదేశంబునను దగ్భాగంబుస . . . కృష్ణా
     తీరంబున. ..
కం. పదపడి ముదమలరు తాడెపల్లిధరిత్రిన్.”

అను పద్యములవలన తాడేపల్లి పానకాలుకవి బెజవాడకుఁ జెంతగల తాడేపల్లినివాసి. పానకాలుకవి మానసబోధశతకము వ్రాసి హరికి సమర్పించెను. కాసుల పురుషోత్తముఁడు తానొక మానసబోధశతకము రచించెను. అది ప్రకృత మనుపలభ్యమగుటవలన నీకవి దానిని దొంగలించి మార్చికొనియుండునని శతకకవిచరిత్రకారులు వావిడిచియున్నారు. పానకాలకవి చౌర్య మొనరించెననుటకుఁ దగినన్ని దృష్టాంతములు సంపాదింపక పురుషోత్తమకవి శతకము కానరానంతన నిటుల నెంచుట ప్రమాద మనఁదగును. నూటయిరువది సంవత్సరములనాఁటి రామదాసుచరిత్రములో నీమానసబోధశతకములోని పద్యము లుదహరింపబడుటవలన నీపానకాలుకవి నూటయేబదిసంవత్సరములు కించుక బైకాలమువాఁ డని తోచును. ఇతని గ్రంథములు లక్షణగ్రంథములలో నుదాహరింపఁబడక పోవుటవలన నంతకుఁ బైవాఁడని తెలుపవీలు లేదు.