పుట:2015.329863.Vallabaipatel.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

23

కలకత్తా, నాగపూరు కాంగ్రెసులలో నసహాయోద్యమ మంగీకరింపఁబడినది. అసహాయోద్యమానుగుణముగఁ దన బారిస్టరువృత్తిని మాని తన పిల్లల నున్నత విద్యకై విదేశములకుఁ బంపించుట విరమించుకొని గుజరాతులోఁ బటే లసహాయోద్యమ ప్రచారము ప్రారంభించెను. ప్రభుత్వమువారి దండన విధాన మతి కఠోరముగా నుండెను. ప్రజలు దీనిని లెక్కసేయక యధికోత్సాహముతో నిందుఁ బాల్గొనజొచ్చిరి. గాంధిజీ వల్లభాయులు గుజరాతులో సత్యాగ్రహము ప్రారంభింప నహర్నిశలు కృషి చేయసాగిరి. బార్డోలీ, ఆనంద్ తాలూకాలు సత్యాగ్రహమునకై సర్వవిధముల నాయత్తము చేయఁబడినవి. బార్డోలీ నామము భరతఖండ మంతట విఖ్యాతిఁగాంచినది. చౌరాచౌరి హత్యాకాండ కారణముగా సత్యాగ్రహ మాపివేయఁబడెను. గాంధిజీ యరెస్టు చేయఁబడెను. దీని యనంతరము గుజరాతు భారమంతయు వల్లభాయి భుజస్కంధముల పైఁబడెను. ఆయన గుజరాతు కేకైక నాయకుఁడు. ఆ దినములలో నాయన గుజరాతు విద్యాపీఠమునకై బర్మాకుఁ గూడ వెడలి దాదాపు పదిలక్షల రూపాయలు వసూలు చేసెను.

నాగపూరు సత్యాగ్రహము

1923 ఏప్రిలు 13 న జబల్‌పూరులో జాతీయవారము జరిపినారు. ఆ సందర్భములోఁ కాంగ్రెసు యువకులు మ్యునిసిపలు భవనముపై జాతీయ పతాకమును బ్రతిష్ఠించిరి. పోలీసువారు దానిని లాగివేసి చించి పాఱవేసిరి. ఒక యూరపియను