సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము
సంగ్రహ
ఆంధ్ర విజ్ఞాన కోశము
ప్రకాశకులవి.
మూల్యము రు 20 లు
ముద్రణము
అజంతా ప్రింటర్సు,
మహాకాళివీథి
సికిందరాబాదు.
ప్రతులకు :
కార్యదర్శి,
సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశ సమితి
విద్యానగరు - హైదరాబాదు-7.
టెలిఫోను నెం. 5023.
పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/6
విజ్ఞానకోశ లక్ష్యములను, కార్యవిధానమును మొదటి సంపుటము విశేషము లను సమితి కార్యదర్శిగారు తమ విపుల పీఠికలో చక్కగా వివరించి యున్నారు. సంపుటములో 328 పుట లాంధ్రదేశ ప్రశస్తి కంకితమగుట నాదృష్టిని ముఖ్యముగా నాకర్షించిన విషయము. ప్రాచీనార్వాచీన విజ్ఞాన జలములను ఆంధ్రులు నిరంత రము చేదుకొనుట కుపకరించు తరుగని మోటబావిగ ఈ కోశము వర్ధిల్లవలె నని కోరుచు ఆంధ్రావళి దీనిని హార్దికముగా నాదరించి ఆర్థికముగా పోషింపగలరని ఆశించుచున్నాను.
హైదరాబాద్
బెజవాడ గోపాలరెడ్డి
విలంబి, అధిక శ్రావణ బహుళ ౭ గురువారం
అధ్యక్షుడు,
7 ఆగష్టు 1958
సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ సమితి.
నివేదన వాక్యములు
భారతీ శుభ గభస్తి చయంబుల తేజరిల్లు నో ఆంధ్ర మహాజనులారా:
సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ ప్రథమ సంపుటమును తమ కరకిసలయ రంజితముగ సమర్పించుచు సమితి పక్షమున మేముచేయు నివేదినమును ఆలింపుడు. మేము తెచ్చిన ఉలుపాను సాదరముగ స్పృశించి సావధానము వెంట, సానుభూతితో పరికింపుడు. కానుకలు రెండు విధములు. కానుకను స్వీకరించు వ్యక్తి మహత్త్వమున కది అనురూపముగ ఉండవలెను. లేదా సమర్పించువాని సామర్థ్యమును బట్టియు అది వలయితము కావచ్చును. శ్రీకృష్ణునకు కుచేలుడు అటుకులు మాత్రమే మూటగట్టి తేగలిగినాడు. మనసు చలువయే ప్రధానము కాని వస్తువు విలువ కాదుగదా !
"కానుక యే సమర్పింప దలచినచో సృజనాత్మకమైన పద్య కావ్యమో, గద్య కావ్యమో, నవలయో, నాటకమో, ప్రహసనమో, ఏకాంకికయో, కథానికయో, గల్పికయో, స్కెచ్చియో, ఏదేనొక యపూర్వ కథానిబంధనముగ వ్రాసికొని రాలేదేమి ? నీరసమై వ్యుత్పత్తిమాత్ర పర్యవసాయియై, చాలవరకు సంకలనాత్మకమైన ఈ ప్రయత్నమేమి ? దీని ప్రయోజనమేమి?" అని మీరు పెదవి విరువబోకుడు, ప్రతి భాషయందును సృజనాత్మక సాహిత్యమును, ప్రయోజనాత్మక సాహిత్యమును రెండును ప్రాణాధారములే. జీవితపు పరమ ప్రయోజనమైన నిస్స్వార్థానందమును సమకూర్చునది సృజనాత్మకమైన సాహిత్యము. అది ఆధేయము. ఆధారము లేక అధేయము నిలుచుట యరుదు. నిస్స్వారానందమునకు ఆధారమేమి? సుసమృద్ధమై, సుసంపుష్టమైన జీవితము, మానుషానందమును నిరూపించుచు ఉపనిషన్మహర్షు లేమనుచున్నారు ? “యువా స్యాత్సాధు యువాధ్యాయ ః । ఆశిష్ట్లా ద్రడిష్ఠా బలిష్ఠః | తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణాస్యాత్ సఏకో మానుష ఆనందః" మానుషానందమునకు మానదండ మెవడు? రూపసియైన యువకుడు, అధ్యయనపరుడు, కార్యములందు చురుకైనవాడు, మనోదార్థ్యముగలవాడు, బలిష్ఠుడు అయిన ఎవని కొరకు ఈ భూమి అంతయు విత్తపూర్ణమై యుండునో అట్టి యువజనుడు మానుషానందమునకు గజముబద్ద. ఏవం విధమైన ఆనందమునకు ఆధేయముగా ఒక వ్యక్తినిగాని, ఒక జాతిని కాని చేయు సాహిత్యమేది? ప్రయోజనాత్మక సాహిత్యమే అని మనవిచేయ సాహనించుచున్నాము. సృజనాత్మకమైన నాకృతియందు దీనినిగూడ నేను వ్యంగ్య మర్యాదగా సాధించుచునే యున్నానుగదా, అని యొక కవికుమారుడు సవాలు చేయవచ్చును. నాయనా! నిజమే. అంతవరకును సాహిత్యము యొక్క ప్రయోజనాత్మక ఆవశ్యకమును నీవు గుర్తించుచున్నావుగదా! సుకుమార బుద్ధులకు కావ్యము, జనసామాన్యమునకు అది చాలదు. వారికి విశదముగను, సుస్పష్టముగను, అసందిగ్ధముగను తెలియచెప్ప వలెను.ప్రయోజనాత్మక సాహిత్యమే ఇచ్చట మనకు ఆశ్రయణీయము, కవులకును మాకును గతిభేదమే కాని గమ్య భేదము లేదు.
ప్రయోజనాత్మక సాహిత్యమునందు "విజ్ఞాన సర్వస్వము" మూర్ధన్యమైనది. ఆంగ్లమునందు Encyclopaedia అను పదముచే నిది చెప్పబడుచున్నది. Enkyklios (చక్రరూపమైన) paideia (విద్య) అను గ్రీకుభాషాపదముల కూడికచే నిది యేర్పడినదని తెలియవచ్చుచున్నది. అనగా విద్యాచక్రము లేక జ్ఞాన చక్రము అని దీని యర్థము, కళాశాస్త్రములు, విజ్ఞానశాస్త్రములు - వీటి ఆవృత్తియే విజ్ఞానవలయము. దీనికే మనవారు విజ్ఞాన సర్వస్వమని చక్కగా పేరిడినారు. దీనినే కొందరు 'కోశ' శబ్దాంతముగా పఠించుచున్నారు. మహారాష్ట్రభాష యందలి ఈతెగ గ్రంథము 'జ్ఞానకోశము' అని వ్యవహరింపబడినది. విజ్ఞాన సర్వస్వమును ఒక విధముగా కోశమే. నిఘంటు రూపములో నుండుటచే కూడ దీనికి పేరు వచ్చియుండవచ్చును. నిఘంటువునందు పదములు వాచ్యార్థ ములు, పర్యాయ పదములు మాత్రము కూర్పబడును. ఉదాహరణమునకు వాయువు అనగా గాలి యను అర్థ మీయబడును. నిఘంటువు పని ఇంతటితో ముగిసినది. విజ్ఞానకోశము యొక్క పని ఇక్కడనుండి యారంభించును. వాయువు లేక గాలి అను పదార్థమెట్టిది? దాని స్వరూపమేమి? అది ఘనపదార్థమా? ద్రవపదార్థమా? మరొక పదార్థమా? అది ఏక పదార్థమా? లేక ద్రవ్యాంతర సంయోగముచే నేర్పడినదా ? దాని గుణము లెవ్వి? శబ్ద గుణకత్వము, గంధవాహిత్వము. దీనిని ద్రవ్యాంతరముగా మార్చనగునా ? దీనిని సర్వనాశము చేయవచ్చునా? ద్రవ్యాంతరరూప స్వీకృతిని మాత్రము పొందింపగలమా ? ఇత్యాది అసంఖ్యాక ప్రశ్నములకు విజ్ఞాన కోశమే సమాధానమీయగలదు. ఈ ప్రమేయమున నిఘంటువు మూకీ భావము వహించుచున్నది.
ప్రజల జీవితమును సుఖవంతముగను ఆనందతుందిలముగను చేయుటకు, వారికి జ్ఞానచక్ర పరిచయము కావించుట అవసరమని తేలుచున్నది. ఎట్టి విజ్ఞానమును మన ప్రజలకందించవలెను ? పూర్వ విజ్ఞానమా? ఆధునిక విజ్ఞానమా? పూర్వ విజ్ఞానము విస్తారముగా తర్కమూలము, దార్శనికము అని భావింపవలసి యున్నది. అణిమాది సిద్ధులు కలవనియు, పూర్వ మహర్షుల కవి కరతలామలకములై యుండెననియు, పురాణములలో చదువుదుము.కళాపూర్ణోదయము లోని మణిస్తంభు డను సిద్ధుడు దూరశ్రవణము, దూరదర్శనము, కామ గమనము మొదలగు అపూర్వ శక్తులను సాధించే నని కవి వర్ణించెను. వీటిలో మొదటిశక్తి ఇప్పటి 'టెలివిపన్' వంటి దనుకొందము. ఈ శక్తుల నాత డెట్లు సాధించెను? తపస్సుచే సాధించె నని సులభముగ సమాధానము చెప్పుదురు. ఈ సమాధానముచే ఆధునిక దృష్టికి, హేతువాదరత బుద్ధికి, సంతృప్తి కలుగుట లేదు. మీకు ఆస్తికబుద్ధి లోపించుట వలన తపోమహత్త్వమును నమ్మలేకున్నారు, మీరు హతాళులు, అని పెద్దలు గదమాయింతురు. ఎట్లయినను ఫలితము శూన్యము. పోనిండు. కృచ్ఛ చాంద్రాయణాదుల చేతను, పవన పర్ణాంబు భక్షణముచేతను కొన్ని సిద్ధులను సాధించగలమే యనుకొండు. ఆ శక్తులు సాధకులకు మాత్రమే పరిమితములై యుండును. కాని ఇతరులకు సంక్రమింపచేయుటకు వీలు కానివి. పూర్ణోదయ సిద్ధుడు దూరమునుండియే మణికంధరుని నైతిక పతనము మున్నగునవి వీక్షించి నవ్వుకొనగల్గెను కాని, తహతహ పడుచున్న కలభాషిణికి ఆ దృశ్యములను చతుర్గోచరము చేయించగలిగెనా? లేదు. నేటి కాలమందన్ననో, ప్రపంచపు మారుమూలలలో దృశ్యములను, శబ్దములను ఎప్పటికప్పుడు నిరుపేదకూడ చూచి, వినగలుగు చున్నాడు. పూర్వ విజ్ఞానమునకును, ఆధునిక విజ్ఞానమునకును భేదము సుస్పష్టమగుటలేదా? భారతీయ ప్రాచీన విజ్ఞానమును మనము అవిశ్వాసముతో చూడనక్కరలేదు. పరిహసించుట మరియు అవివేకము. కాని దాని సంబంధమైన పరంపరాజ్ఞానము, ప్రయోగ కౌశల్యము, ఆనుభవ సుఖము దూరదూరగతములై పోయినవి. నోటిలో లేని పటిక బెల్లమును చప్పరించి మాత్రము లాభమేమి ? మహత్త్వపూర్ణమై యుండునని విశ్వసించుచు, ఒక నమస్కారముచేసి మనదారి మనము చూచుకొనవలసి యున్నది, దానిని పునః ప్రతిష్ఠింపగోరుట కుందేటి కొమ్ము సాధించుటకై తిరుగుట వంటిదే యగునేమో?
ఇక మిగిలినది ఆధునిక విజ్ఞానము. ఇది యంతయు తెల్లవాని మాయ అన్నను ఇది మనలను వదలుట లేదు. దీని సంబంధమైన పరంపరాజ్ఞానము, ప్రయోగ కౌశల్యము, అనుభవ సుఖము మనకు ప్రత్యక్ష ప్రతీతిలో ఉన్నవి. దీనిని కాదనుట యెట్లు ? ఉపాసింపకుండుట యెట్లు ? కావున ఆధునిక విజ్ఞానమే సర్వదా ప్రతిపాద్య మగుచున్నది. పూర్వ విజ్ఞానము విశ్వాసముపై నాధారపడి యున్నది. ఆధునిక విజ్ఞానము ప్రయోగమూలమై యున్నది, ప్రయోగసాధనములు, కౌశలము అలవడినచో ఎల్లవారును దీనిని పరీక్షింపవచ్చును. హేతువాదము, సంభావ్యత దీనికి పునాది రాళ్లు. పూర్వయుగము విశ్వాసయుగము. ప్రస్తుత యుగము వివేచనా యుగము. వివేచనకు ప్రయోగము మూలము. కావున విజ్ఞానసర్వస్వములో కళాశాస్త్రములతోపాటు విజ్ఞానశాస్త్రములు కూడ ప్రాధాన్యము వహింపదగి యున్నవి.
నిద్రాణమైన జాతియందు నవచైతన్యమును నూత్న జీవితమును ప్రబోధించుటలో విజ్ఞానకోశమే అనితర సాధనమని ఫ్రెంచి విజ్ఞాన సర్వస్వచరిత్ర వలన తెలియుచున్నది. రూసో, వాల్టేరు, డిడిరొ మున్నగు ఫ్రెంచి మహాతాత్త్వికుల - విప్లవవాదుల – రచనలచే జ్వలితాంగారకుండ సన్నిభమైనది ఫ్రెంచి ఎన్ సైక్లోపీడియా, పరాసు విప్లవని నాదములు స్వాతంత్య్రము, సమానత్వము, సౌభ్రాతృత్వము -అను మంత్రత్రయ మీ గ్రంథము మూలముననే ఉద్ఘొషింపబడెనని తత్ జ్జ్ఞులు చెప్పుదురు. విజ్ఞాన సర్వస్వ ప్రయోజనమును గూర్చి ఫ్రెంచి విజ్ఞాన సర్వస్వ సంపాదకులలో ప్రముఖుడైన డెనిస్ డిడిరో మహాశయు డిట్లు వ్రాసెను : "ప్రపంచ వీథులలో వికీర్ణమై పడియున్న విజ్ఞానమును రాశిచేసి సమకాలికులకు పరిచయము చేయుటయే విజ్ఞానసర్వస్వపు టాదర్శము. అనంతర తరముల వారికి ఈ జ్ఞానభాండారము నందిచ్చుటయు దీని లక్ష్యమే. ఇట్లు చేయుటవలన పూర్వ పూర్వ తరముల విజ్ఞానము ఉత్తరోత్తరతరములవారికి అందుబాటులోనికి వచ్చుచున్నది. లేకున్నచో అది నష్టమగు ప్రమాదముగలదు. మనసంతతివారు ఈ విజ్ఞానావలోడనముచే జ్ఞానవంతులు, సుఖవంతులు కాగలుగుట మన లక్ష్యము. ఇక మనమును నిరర్థకముగ జీవించి మరణించినవారము కాకుందుము గాక యనియు, లోకము మనలను కృతజ్ఞతతో స్మరించవలె ననియు ఆశించి విజ్ఞాన సర్వస్వరచన సాగింతము.”
అయినచో రూసో, వాల్టేరు, డిడిరోవంటి మహా రచయితలు సంగ్రహాంధ్ర విజ్ఞానకోశమును తమ రచనలచే ప్రకాశింపచేసి రాయని మీరడుగవచ్చును. ఉన్నారు కాని యొక పరమ భేదమును గుర్తించవలెను. శ్రీమామిడిపూడి వేంకటరంగయ్య, పద్మభూషణ, డాక్టరు పి. టి. రాజు, ఉప్పులూరి గణపతిశాస్త్రి, బులుసు అప్పన్న శాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, డాక్టరు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, కురుగంటి సీతారామయ్య. దూపాటి వేంకటరమణాచార్యులు, ఆదిరాజు వీరభద్రరావు మున్నగు పలువురు పలిత కేశులు, ఏకదంతులు, గళిత దంతులు వారివారి అభిమాన విషయములలో దుర్దాంతులు అయినవా రెందరో సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోళములో వ్యాస చంద్రికలను వెదజల్లినారు. "పాశ్చాత్య విజ్ఞాన మదదంతావళములైన రూసో, వాక్టేరు మున్నగువా రెక్కడ? దేవుడని, సత్యమని, శాంతియని, అహింసయని ప్రసన్నా రావములు చేయుచు హరిణశాబక సదృశులైన వేంకట రంగయ్య, గణపతి శాస్త్రివంటి వారెక్కడ? ఔ సమ్యభంగమైనది" అని అట్టహాసము చేయుదురు నేటి యువకులు. మేమందుము గదా, తొందరపడవలదు. వారికిని వీరికిని భేదము గుర్తించుడు. పాశ్చాత్య చింతకులు కృశాను సదృశులు. భారతీయ చింతకులు వరుణసదృశులు. సప్తజిహ్వుని చూచి శిశువులు కూడ దూరదూరముగ ప్రాకిపోవుదురు. శీతల జల పూర్ణ కుంభమును చూచి ఆ శిశువులే అల్లరిచేయుచు ఆలింగనము చేసికొందురు. భారతీయులది పూర్ణకుంభ సంస్కృతి. పాశ్చాత్యులది విద్యుదట నాగరకత. ఏది లేకున్నను లోకము తావన్మాత్ర దరిద్రమగును. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశమునందు పూర్ణకుంభ - విద్ద్యుద్ఘట - సమ్మేళనమును సాధింప యత్నించుచున్నాము. లక్ష్యసాధనమున మావి దుర్బల హస్తములు కావచ్చును. లక్ష్యమునే అభినందింపుడు.
ఈ విచిత్ర సమ్మేళనమును తాటిపండ్లు ఆవగింజలు కలబోసినట్లు - మీరెట్లు సాధింప బూనుకొన్నారని మీరడుగుదురు. 1. ప్రతి శాస్త్రమునందును ప్రాచీన భారతీయులు సాధించిన విజయములు సమీక్షించుటకు తగినట్లు శీర్షికలను ఏర్పాటు చేయుట. 2. ప్రాచీన భారతీయ మహావ్యక్తుల చరిత్రములను యథా సంభవముగ వ్రాయించుట. ఉదా : ఆపస్తంబుడు, అన్నంభట్టు, 3. ఇంతటితో తృప్తిపడక "భారతదేశపు ప్రాచీన విద్యలు -కళలు" అను క్రొత్త విభాగమునే ఈ కోశమునందు చేర్చితిమి. 4. అట్లే ఆయుర్వేదము అను ప్రత్యేక శాఖను గూడ ప్రవేశ పెట్టితిమి. పాశ్చాత్య వైద్యపద్ధతినే కాక ఆయుర్వేద మహత్త్వమును గూడ దీని ముఖమున లోకమునకు ప్రకటింప యత్నించితిమి. వీటిలో మూడవదగు "భారతదేశపు ప్రాచీన విద్యలు - కళలు" అను విభాగము మాకు మిక్కిలి ఆప్యాయమైనది. అయినను ఇందలి శీర్షికలపై వ్యాసములు వ్రాయువారు మిక్కిలి అరుదుగా లభించినారు. ప్రాచీన విద్య లెరిగిన పండితవరేణ్యులు ఈ శాఖను విజయవంతముగా నిర్వహించుటకు తోడ్పడ ప్రార్థితులు. లేనిచో ప్రాచీన భారత విజ్ఞానము ఆర్భాటము కలదేకాని సత్తాలేనిది యని విమర్శకులు మమ్ముల దుయ్యబట్టగలరు. ఈ సంపుటమునందు 'అభ్యవహారము - ఆర్ష పద్ధతి' 'ఆర్షగణితము' 'ఆర్షభూగోళము మొదలగు విద్వత్తాపూర్ణములైన వ్యాసములు వ్రాసిన పండితులు మా కృతజ్ఞతలకు పాత్రులు. ఈ విధముగ ప్రాచీన విజ్ఞానమునకును, ఆధునిక విజ్ఞానమునకును ఈ విజ్ఞానకోశము సేతువుగా నుండగలదని మా ఆశయము. మరియు భారతీయులు శాంతిప్రియులు. అహింసావాదులైనను వీరు నిరస్త్రులు, నిరాయుధులు, నిస్తేజస్కులు కారు, కారాదు, అని చాటుట మా ఆశయము. శ్రీరామచంద్రుని గూర్చి వాల్మీకి చెప్పినట్లు "కస్య బిభ్యతి దేవాశ్చ, జాతరోషస్య సంయుగే" అనునదియే భారతీయులకు సమీచీనమైన ఆదర్శము. దీనిని మనసునం దుంచుకొని సంగ్రామ శాస్త్రమను విభాగము నొకదాని నిందు చేర్చితిమి. కాని దీని నిర్వహణము మాకొక సమస్య యైనది. చిరకాలము పారతంత్య్రము నందు పడియుండుటచే భారతీయులకు - తత్రాపి ఆంధ్రులకు యుద్ధ విజ్ఞానమే కొరవడినది. ఆంగ్ల విజ్ఞాన సర్వస్వమువంటి ఉద్గ్రంథములలో సంగ్రామ శాస్త్రము దక్షతతో చర్చింపబడినది. వాటి ననుకరించుట సాధ్యమే యైనను కేవల గ్రంథ జ్ఞానము అనుభవ జ్ఞానమునకు సాటిరాదు కదా యని సంకోచించుచున్నాము.
సంగ్రహ విజ్ఞానకోశ నిర్మాణమునందు మాకు గల్గిన మరియొక సౌభాగ్యము స్మరింపదగియున్నది. దీని సంపాదకులలో పలువురు, ఉస్మానియా విశ్వవిద్యాలయపు ఆచార్యులుగనో, దాని అనుబంధ సంస్థలతో సంబంధము కలవారుగనో ఉండుట ఏర్పడినది. నిజమునకు ఉస్మానియా విశ్వవిద్యాలయమునకు ఈ యుద్యమముతో ప్రత్యక్ష సంబంధ మేమియును లేదు. కాని సమర్థులైన సారథుల నెందరినో అయాచితముగ ప్రసాదించిన ఉస్మానియా విశ్వవిద్యాలయము పరోక్షమిత్రమనుటలో సందేహములేదు. నిర్వహింపబడునది విజ్ఞానకోశము. నిర్వాహకులు చాలవరకు విశ్వవిజ్ఞాన ప్రతిబింబమైన విశ్వవిద్యాలయమునందలి అధ్యాపకులు. వారి బాధ్యతలను గూర్చి వేరే మనవిచేయనేల? ప్రశంసింపనేల? మరియొక అంశము పేర్కొనదగియున్నది. హైదరాబాదు నగరము పెక్కు భాషలకును సంస్కృతులకును కూడలిగ నుండినది. ఈ భాషాసంస్కృతుల ప్రతినిధుల యొక్క ఆదరసహాయములు సంగ్రహ విజ్ఞానకోశమునకు లభించుట ముదావహము. అందును మన ముసల్మాను సోదరులలొ విజ్ఞులు విద్యాధికులు అయిన పలువురు విజ్ఞానకోశముతో సన్నిహిత సంబంధము కలిగి మాకు చేదోడు వాదోడుగానుండుట సంతోషదాయకము, వీరిలో డాక్టరు వహీదుద్దీను, ప్రొఫెసరు హరూన్ ఖాన్ షేర్వానీ, డాక్టరు యూసుఫ్ హుస్సేన్ ఖాన్, జనాబ్ అబ్దుల్ మజీద్ సిద్ధికి, డాక్టరు అబ్దుల్ మెయిడ్ ఖాన్, డాక్టరు సయీదుద్దీన్ మున్నగు ప్రముఖు లెందరో ఉన్నారనుట మాకు గర్వకారణముగ నున్నది. సోదర భాషా భాషీయులలో కన్నడ శాఖాధ్యక్షులు ఆచార్య డి. కె. భీమసేనరావు, కవిలె భాండార శాఖాధిపతి శ్రీ ఆర్. యం. జోషీ మున్నగువారు పెక్కు మందిగలరు. విజ్ఞాన బాంధవ్యమునకు దగ్గర ఏమి ? దూరమేమి ? కటక్ విశ్వవిద్యాలయాచార్యులు శ్రీ గోపాలచంద్ర మిశ్రా, గౌహతీ విశ్వవిద్యాలయాచార్యులు డాక్టరు మహేశ్వర నియోగ్ అనువారు చక్కని వ్యాసములను వెలయించినారు. ఇట్లెందరిని పేర్కొనగలము? మాది తామరకొలనువంటి సంస్థ. నీటి కొలది తామర సుమ్మీ!
సంగ్రహ విజ్ఞానకోశ నిర్మాణయత్న మెట్లు పొటమరించినది ? ఎందుకు తలయెత్తినది? “కారణంబులు ఉద్బోధకములు" ఏవి అని తెలిసికొనుటకు మీకు కుతూహలము ఉండవచ్చును. లేకున్నను మేము వినిపింతుము లెండు.ప్రోద్యమానుడగు కవికుమారుడు తన కావ్యములు వినుమని నిర్బంధించినట్లు. విజ్ఞానకోశము ఊర్థ్వ మూలము, అధశ్శాఖము అయిన వింత అశ్వత్థ వృక్షమా ! లేక నేలనుండి వేళ్లు తన్నుకొనివచ్చిన వృక్షమా ? ఇది భూజమే గాని ఆ కాళజము కాదని మనవి చేయుచున్నాము. ఎట్లన ప్రభుత్వము ఒక ఉద్యమము అవసరమని భావించి, స్థాపించి, నిరంతర ధనజల సేచనముచే పెంపొందించిన వృక్షము ఊర్ధ్వమూలము. ఒక ఉద్యమము అవసరమని భావించిన ప్రజలచే ఏర్పాటు కావింపబడి, నిర్ధన తాగ్రీష్మమున మలమల మాడుచు. ఏ పుణ్యవంతులో పోసిన ఉద్ధరణి నీళ్లతో తలయెత్తుచు, ఎన్నటికైన వర్షాగమము కాకుండునా యని నీరసపు బలముతో లేచిన వృక్షమే అధోమూలమైన వృక్షము. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశమట్టి అధోమూలమైన వృక్షమని సవినయముగనే చాటుచున్నాము.
“ఏవీ-దీని వేళ్లెచ్చట నున్నవి ?" అందురా - ఓపికతో, ఉపాయముతో త్రవ్వి చూడుడు. లేదా మా గ్రంథమందు ప్రకటింపబడిన వ్యాసము 'ఆంధ్రోద్యమము - (తెలంగాణములో)' అను దానిని చిత్తగింపుడు. అసఫ్ జాహి పరిపాలనము తెలంగాణపు భాషా సంస్కృతులకు సుదీర్ఘ నిదాఘమైనది. ఆసన్న వర్షమైన కాలమున వేసగి మరింత చెల రేగును. ఈ శతాబ్దారంభమున ఆంధ్రభాషను, సంస్కృతిని రక్షించుకొనవలెనను మహత్తరాశయముతో హైదరాబాదు నగరమునందు శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయ మను మట్టి విత్తనమును శ్రీయుతులు రాజా నాయని వేంకట రంగారావు, కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి మున్నగు మహనీయులు నాటిరి. ఐదుగురుకూడి ఒక గింజను మొలవేయుటయా ? తొమ్మండుగురు వడ్రంగులు కలిసి డోలు చేయబోయి సోల చేసినట్లున్నదీ వృత్తాంత మందురేమో. కాని వారి సంకల్ప బలమెట్టిదో ఆసోలయే తవ్వ అయి, మాన అయి, అడ్డ అయి, కుంచ మయి పుట్టి అయి. గరిసె అయి, రోదసీ కుహరమంత కొలపాత్రయైనది. ఇంతలో ఏమూలనుండియో శ్రీ మాడపాటి హనుమంతరావను తోటమాలివచ్చి పూర్వోక్తులైన మహనీయులు వేసిన బీజమును చీమ ఓపికతో పెంచి, పెద్దది చేసెను. అది యొక పెద్ద కథ లెండు. ఈ చిన్న విత్తన మా ధారముగా ఎన్నియో రాజకీయ వృక్షములు, సారస్వత తరువులు తెలంగాణపు ఉద్యానము నలంకరించినవి.
సమగ్ర విజ్ఞానసర్వస్వ ప్రచురణమునకు ఆంధ్రదేశము నోచుకొనక పోయెనే అను చింత తెలంగాణపు సారస్వత వ్యవసాయకులను పెక్కు దినములనుండి వెన్నంటు చుండెను. కీ.శే. కొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులు గారు ఆంధ్ర విజ్ఞానసర్వస్వమును ఆరంభింపగాచూచి, తమ భాషలో అట్టి యుద్యమము లేకపోయెనే యని మథనపడి మహారాష్ట్ర విద్వాంసు అయిన కేత్కరుగారు మహారాష్ట్ర జ్ఞానకోశము నారంభించి, 23 సంపుటములుగల యుద్ధంథమును ప్రకటించి పెట్టిరి. ఆంధ్రమునందు విజ్ఞాన సర్వస్వ ప్రచురణము నాటికిని నేటికిని సమగ్రతను చెంద కుండుట ఏ సాహిత్యకునకు మా రణముగ నుండదు? కుందేలు - తాబేలు కథ ఆవృత్తి యగు చున్నదా? విడి జమీందారు .త్య విరి సమః అని ఆధునిక విజ్ఞానమునకు సరియగు వద్దమగునా, కాదా, యను 'భూపాలు డొక్కడు తానుద్దేశించిన విజ్ఞానసర్వస్వ గ్రంథమును సమా ప్తికి కొని పెట్టుదన్నకు సూ ప్రశ్నలు ఓరకు పేద యం దంతి ఆంధ్రు లేల సృజింప మహా లెంత ప్రగల్బులో సమాఎణిలో నుంచబడిన నిర్వృత్తవస్తువు. సమగ్రమైన విజ్ఞానసర్వస్వమును యూ 3గ సమాధానము చెప్పవలయు నన్న వ్యష్టికృషియందు ఆంధ్రు చెందిన విన్సె'. ప్రగల్బులని చెప్పదగియున్నది. తెలంగాణమునందు సాహిత్యజాగృతి యేర్పడినప్పటినుండియూ రా ..ధ్యయుగ విసి. 1 శ్రీ శ్రీమును నిర్వర్తించి చూపవలె నను యోగ్యతృష్ణ సాహితీపరులను థ మండలి యొక్క ఆదర్శములను కొనసాగించుటకై ఆంధ్ర చంద్రికా గ్రంథమండలి కొంత కృను ప్రారం సారస్వత పరిషత్తు కృషి ఇప్పటికిని సాగుచునే యున్నది. ఉద్యమములను, సంస్థలను, ఉపాయుల సముచ్చట, ఓర్పుతో నిర్వహించుట తెలంగాణీయులకు శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులు, రాజట్ట మొదటి వేంకటరామరెడ్డి మహాశయుల వంటి వారు నేర్పిన విద్య. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమును తెలంగాణము సిద్ధము చేయవలయునను ప్రయత్నములు క్రీ. శ. 1945 ప్రాంతమున త్వర పెట్టుచుండెను. విజ్ఞ శేషమ జరిగియుండెను. ప్రణాళిక పై 'న్ హాక చర్చింపబడుచుండెను. కాని కాల మింకను అనుకూలింపలేదు.
పోలీసుచర్య అనంత! పుప్పడిన గొప్ప సాహిత్య ప్రభాతమునందు దాశరథి, కాళోజీ ప్రభృతి కవి శకుంతారావముల నడుమ విష్ణు మస్వ నిర్మాణముపై కొందరికి తిరిగి అభిలాష తలయెత్తెను. ఈ సన్ని వేశమును గూర్చి మేము ఇదివరలో ప్రకటించిన కొన్ని వాక్యములనే తిరిగి ఉద్ధరించుచున్నాము. “1958 వ సంవత్సరమునందు, ఒక నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయ గణితశాస్త్ర శాఖాచార్యుడయిన డాక్టరు బేతనభట్ల విశ్వనాథముగారు తెలుగుశాఖకు చెందిన శ్రీ లక్ష్మీరంజనంగారి దగ్గరకు హఠాత్తుగా వచ్చి యిట్లు ప్రసంగించిరి:-
విశ్వ : వెనుక మనము విడిచి పెట్టిన విజ్ఞానసర్వస్వ నిర్మాణ తంతువులను మరల చేపట్టవలెను.
లక్ష్మీ: అమ్మయ్యో, అంతభారమును వహించుటకు మనకు శక్తిచాలదు. అదియునుగాక తెలుగు భాషాసమితి
- వారు విజ్ఞానసర్వస్వమును వ్రాయించుచున్నారని వినుచున్నాముగదా !
సంయుక్త రాష్ట్రప్రజలు 'Encyclopaedia Americana' అను పేర 30 సంపుటములు వ్యాపించిన ప్రశస్త మహా గ్రంథమును ఆంగ్లభాషలో నిర్మించిరి. ఈ విజ్ఞాన రాశితో పోల్చినప్పుడు మద్రాసు తెలుగుభాషాసమితి వారును, హైదరాబాదు సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశ సమితివారును సేకరింపగల జ్ఞానసంచయము - ఇసుకలో పిల్లలు కట్టుకొను పిచ్చిక గూడును మించదేమో యను వెరపు జనించును. ఇంక పునరుక్తి, చర్విత చర్వణము అను భయ మేల?
విజ్ఞానసర్వస్వములు మొదటి దశయందు వ్యక్తి ప్రజ్ఞాధీనములుగనే యుండినట్లు తెలియుచున్నది. అవి సమష్టికృషి ఫలితములుగా లేవు. ఒక వైజ్ఞానికుడు వివిధ శాస్త్రములపై వ్రాసిన వేర్వేరు లఘు గ్రంథముల సంపుటి విజ్ఞాన సర్వస్వనామమున పరగుచుండెను. అట్టివి ముఖ్యముగ అద్యయన గ్రంథములుగ ఉపయోగపడు చుండెనేకాని పరామర్శ (Reference) గ్రంథములుగ ఉద్దేశింపబడినట్లు కానిపించదు. ప్రపంచమునందు మొట్టమొదటి విజ్ఞానసర్వస్వ గ్రంథము ప్రాచీన గ్రీకు దేశమున వెలువడే నని తలచుచున్నారు. అరిస్టాటిలు (క్రీ. పూ.384-323) దీని కర్తయని కొందరును, స్ప్యూసిప్పకు అను నాతడు కర్తయని కొందరును భావించుచున్నారు. వీరిద్దరును మహాతత్త్వ చింతకుడైన ప్లేటోకు శిష్యులని తెలియుచున్నది. ప్రాచీన రోము దేశమున మార్కస్ టెరెన్షియస్ వారో (క్రీ. పూ. 166- 27) అను నాతడొక విజ్ఞానసర్వస్వమును కూర్చెను. ఈతడు ప్రసిద్ధ విజేతయైన జూలియస్ సీజరునకు సమకాలికుడు. దీనియందు కావ్యశాస్త్రము, గణితము, జోతిశ్శాస్త్రము, వైద్యము సంగీతము, వాస్తుశాస్త్రము మున్నగునవి చర్చింపబడెను. వర్తమానకాలపు విజ్ఞానసర్వస్వములను పోలిన గ్రంథమును మొట్టమొదట కూర్చినవాడు 'ప్లినీ' యనువాడు. ఈతని 'నాచురల్ హిస్టరీ' అను గ్రంథము 37 సంపుటములుగా నున్నది. ఇప్పటి విజ్ఞానసర్వస్వముల వలెనే ఇది బహుకర్తృకమైన రచనా విశేషము. దీనిలో భూగోళశాస్త్రము, మానవజాతి శాస్త్రము, జంతుశాస్త్రము, వృక్షశాస్త్రము, వృక్షాయుర్వేదము, ఖనిజ శాస్త్రము వంటి వివిధ విషయములు సమకూర్చబడెను. ఇందు అసంఖ్యాక విషయములపై అసంఖ్యాకు లయిన రచయితలు కృతులు రచియించిరి.
మధ్య యుగములందును యూరపు ఖండమున విజ్ఞానసర్వస్వ నిర్మాణము సాగెను. ఫ్రాన్సు దేశపు పాదిరీ బ్యూవే నగరమునకు చెందిన విన్సెంటు అనునాతడు (క్రీ శ. 1190- 1264) 'స్పెక్యులమ్ మాజస్' అను గొప్ప గ్రంథమును సమకూర్చెను. మధ్యయుగ విజ్ఞానమున కిది అద్దమువంటి గ్రంథమని చాల కాలము ప్రశస్తి వహించెను. జర్మనీ దేశమునందు క్రీ. శ. 1680 ప్రాంతమున ప్రకటింపబడిన లాటిను భాషాగ్రంథము విజ్ఞానసర్వస్వ నిర్మాణములో నూతన దశను ప్రారంభించెను. పూర్వ గ్రంథములు, ఆయా శాస్త్రములు వర్గీకరింపబడి, వానిపై వ్రాయబడిన లఘు కృతుల సముచ్చకంగులుగ నుండెనని చెప్పనైనది. ఆల్ స్టెడ్ అను ఈ జర్మను పండితుడు కూర్చిన గ్రంథమునకు మొట్టమొదటి దని 'ఎన్ సైక్లో పీడియా' అను పేరు వాడబడెనట. ఇది అకారాది క్రమమున కూర్పబడుట విశేషము. ఈ కాలమున ఆంగ్లభాషలో కూడ అకారాది వర్ణక్రమమున విజ్ఞానసర్వస్వ రచన సాగ మొదలిడెను. జాన్ హారికను నాతడు (క్రీ. శ. 1667-1719) “An universal English Dictionary of Arts and Sciences" (s -ప్రకృతిశాస్త్రములను గూర్చిన ఆంగ్ల విశ్వకోశము) అను గ్రంథమును ప్రకటించెను. సమకాలికులైన పంతు రాములు పలువురు దీనిలో రచన సాగించుట విశేషము. సుప్రసిద్ధ వైజ్ఞానికుడు సర్ ఐజాక్ న్యూటను మహాశయుడు 'ఆమ్లములు' అను సంశముపై దీనిలో వ్యాసము వ్రాసెనట. మరియు ఆధార గ్రంథముల పట్టిక ఇచ్చారు ఈ సంకలనమందలి విశిష్టత. జగద్విఖ్యాతమైన ఫ్రెంచి విజ్ఞాన సర్వస్వమును గూర్చి ఇదివరకే కొంత ముచ్చటింపవైనది. విశ్వకోశ నిర్మాణ చరిత్రయందు ఇది యొక ఉజ్జ్వల ఘట్టమని భావింపబడుచున్నది. విప్లవాత్మక చింతకులైన ఆ కాలపు ఫ్రెంచి తాత్త్వికు లందరును దీనిలో రచన సాగించిరి. ఇది ప్రభుత్వాగ్రహమునకు గురియై, వెలుతురు చూచుట సందేహాస్పదమయ్యెను. 35 సంపుటములు ఈ మహాగ్రంథము 1751 లో ఆరంభింపబడి 1780 నాటికి సమాప్తి చెందెను.
భారతీయులకు చిరపరిచితమైన ఆంగ్ల విజ్ఞాన సర్వస్వము 'Encyclopaedia Britannica' ఒక నాటిలో కాని, ఒక తరములో కాని నిర్మింపబడిన ఉద్గ్రంథము కాదు. దీనికిముందే ఆంగ్లమునందు విజ్ఞానసర్వస్వరచన సాగెను. మధ్యయుగములో విలియమ్ కాక్ స్టను అనునాతడు (క్రీ.శ.1481 ప్రాంతము) "ప్రపంచము అద్దము" అను గ్రంథమును కూర్చెను. క్రీ.శ. 1728 ప్రాంతమున చేంబర్సు అను పండితుడు మరియొక ఆ విజ్ఞానసర్వస్వమును సేకరించెను. ఇదియే ఫ్రెంచి విజ్ఞానకోశమునకు మార్గదర్శక మైనదని చెప్పుచున్నా ఇప్పుడు మనకు పరిచితమగు ఆంగ్ల విజ్ఞానసర్వస్వము 1768 లో ఆరంభింపబడి 1771 లో మొదటిను ప్రకటింపబడెనట! మొదటి ముద్రణములో అందు మూడు సంపుటములు, 2670 పుటలు మాత్ర ముండెన ఇప్పుడు మనము చూచుచున్నది ఆంగ్ల విజ్ఞానసర్వస్వము యొక్క పదునాల్గవ ముద్రణము. సుదీర్ఘము పాండిత్య స్ఫోరకములు అగు వ్యాసముల రచనాపద్ధతికి స్వస్తిచెప్పి సర్వజన సుబోధకమైన సులభ సంగ్ర వ్యాసరచనా పద్ధతి ఈ పదునాల్గవ ముద్రణమునందు అవలంబింపబడెనని చెప్పుచున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రములందును 1829 వ సంవత్సర ప్రాంతమునుండి విజ్ఞానసర్వస్వ ప్రకటనము సాగెను. వీని పరిణామము ఇప్పుడు మనము చూచు సుందరతరమును, వైశద్యగుణ భూషితమును అగు “ఎన్సైక్లోపీడియా అమెరికా అను గ్రంథరాజము. జర్మనీ దేశస్థులు విద్వత్తునందును పరిశ్రమ సహిష్ణుతయందును యూరపు ఖండము దగ్రేసరులు కదా ! సువిస్తృతములైన గొప్ప విజ్ఞానసర్వస్వములు మౌళికము లైనవి ఎన్నియో జర్మను భాష యందు కలవని తెలియ వచ్చుచున్నది. ఇటలీ భాషయందును, స్పానిషు భాషయందును కూడ సమగ్ర విజ్ఞానకొశములు కలవట, రష్యన్ భాషయందు సోవియట్ ప్రభుత్వ ఆధ్వర్యవమున 32 సంపుటముల విజ్ఞాన సర్వస్వము ప్రకటితమైనది. - భారతదేశమునందలి ముఖ్యభాషలలో విజ్ఞాన సర్వస్వ ప్రచురణోద్యనుము సాగి కొన్ని భాషల విజయము సాధింపబడినట్లు తెలియుచున్నది. ముఖ్యముగ ఆంధ్రులకు సన్నిహిత భాషయైన మహారాష్ట్ర భాష యందు పలురకముల విజ్ఞాన కోళములు వెలువడినవి. ప్రసిద్ధ మహారాష్ట్ర జ్ఞానకోశము కాక, వ్యాయా జ్ఞానకోశము, సులభ విశ్వకోశము, వ్యావహారిక జ్ఞానకోశము, చరిత్ర కోశము, స్థల నామకోళము, ములా జ్ఞానకోశ్ (బాల విజ్ఞానకోశము) మున్నగునవి నిర్మింపబడినవి. మహారాష్ట్ర సోదరుల విజ్ఞాన ప్రీతికిని, కార్య కును ఇవి స్థిరోదాహరణములు. కన్నడ భాషయందు 'బాల ప్రపంచము' అను పేరుతో మూడు చిన్న సంపుటముల సుందరమైన విజ్ఞానకోశము నిర్మింపబడినది.
సంగ్రహ విజ్ఞానకోశ నిర్మాణములో మమ్మెదుర్కొన్న మనిషురములను సోద రాంధ్రులకు నివేదిం పుట్టినింటి గుట్టు వెలిబుచ్చినట్లు కాకపోవచ్చును. ఆంధ్రభాషను అది రెండు జనవాహికగ చేయుటకు మనమె పురోగమింపవలసి యున్నదో ఉదాహరించుట మాత్రమే దీని ప్రయ్యెమే... (1) వద్యరచన పైగల మోజు, రచనపై మనవారియం దింకను పర్యాప్తముగా వ్యాప్తి కాలేదని ఆధునిక విజ్ఞాన విషయము గూర్చి వ్రాయవ లెనన్నచో బహుగ్రంథ పరిశీలనము చేసి సమన్వయము సాధించుకొనుటకు శ్రమించవలెను. తిక సోమయాజి వలె “తుదముట్టన్" శ్రమియించుట ఇంకను మనవారు సంపవలసియే యున్నది. (2) వైనిక విషయములపై వ్రాయవలెనను ఉత్సాహము గలవారికి ఆపాటవము చాలుట లేదు. ఈ తర వారును, 'వెనుకటి తరమువారును చాలవరకు ఆంగ్లము నందే వం వ్యాసంగము చేసిన వారు. ఆంధ్రమున భావప్రకటనము చేయుట కంతగా అలవడినవారు కారు. చేయవలెనని ఉత్సాహము కలిగి వీరు సంకోచించు చున్నారు. మైత్రీ నిర్బంధముచే వ్రాయవలన*డి.. చో ఆంగ్లభాషయందే వ్యాసములు పంపుచున్నారు. దీనినే గొప్ప సేవగ మేము భావించుచున్నాము. (3) ఆంగ్ల వ్యాసముల మూలమున అను కార్యక్రమము మేము మొదట ఊహించిన దానికన్న వివులతరమై కాలహరణమునకు మూలమైనది. అనువాది స్వతంత్రరచనవలె ప్రసన్న తావిభూషితమై యుండుట కష్టము, మరియు పారిభాషిక పదజాలము మన భాషయ స్థిరపడలేదు. స్థిరపరచుటకు జరిగిన సుస్థిర ప్రయత్నమును లేదు. ఇవి యన్నియు దీర్ఘకాలిక ప్రణాళిక మీద భూ ఓర్పువంటి ఓర్పుతో నిర్వహించవలసిన పనులు. తెలుగు భాషాసమితివారు 'అకారాదిక్రమమున గాక శాస్త్ర కథనపద్ధతిని అవలంబించుటకు హేతువును పద్మశ్రీ మోటూరి సత్యనారాయణగారు చక్కగా వివరించిరి. భాషలో పారిభాషిక పదజాలము స్థిరపడలేదు. అట్టి అవ్యవస్థిత పదములను శీర్షికగా పెట్టుకొన్నచో నిశ్చయజ్ఞానము కలుగదు. పలువురు పలువిధముల ఈ పదములను వాడుచున్నారు. కావున మేము శాస్త్రకథా కథన పద్ధతికే ప్రాధాన్య మిచ్చి యున్నాము. అకారాది పద్ధతికి రెండవస్థాన మిచ్చియున్నాము" అని సెలవిచ్చియుండిరి. ఈ వాదమునందు గురుతరమైన సత్యము ఇమిడి యుండకపోలేదు. కాని ఎప్పటికైనను మనము దీనిని ఎదుర్కొనవలసి యేయుండును. కావున ఈ గ్రంథమునందు మేము పారిభాషిక పదములను సృష్టించుకొని వాటినే అకారాది క్రమములో కూర్చితిమి. ప్రయుక్తమైన శాస్త్రపదము వెంటనే ఆంగ్లపదమునుకూడ ఒకటి రెండుసార్లు వాడుటకు రచయితలను కోరియుంటిమి. అట్లు చేయుటవలన ఏవిషయము ఉపన్యస్తమగుచున్నదో సుబోధము కాగలదు. మా సంపాదక బృందమునందును పారిభాషిక పదప్రయోగము విషయమై ఏకవాక్యత సాధింపబడలేదు ఆధునిక రసాయన శాస్త్రమువంటి గహన వ్యాప్తిగల శాస్త్రమునందు దేశీయ పదజాలమును ప్రయోగించుట కొంతవరకు మాత్రమే సాధ్యమనియు, లోతు లోతులకు దిగిన కొలదియు రచన సాగక వెనుకకు రావలసినవార మగుదుమనియు మా సంపాదకులు భావించుచున్నారు. అంతర్జాతీయ పదజాలమునే ఆశ్రయించుట కార్యకారియని వీరి తలంపు. ఇందును బలము లేకపోలేదు. రసాయన శాస్త్రమునందలి సంయోగ పదార్థములను గూర్చి చెప్పునప్పుడు సంస్కృతభాష కొంత ఉపయోగించును. కాని కేవలాంధ్రపదములు మరియు కార్యకారులుగ నుండుటలేదు. కావున కొన్ని శాస్త్రముల సందర్భమున అంతర్జాతీయ పదములను తప్పనిసరిగ వాడవలసిన ఆవశ్యక మేర్పడినది ఇచ్చట తెలుగుతనము బలియయిపోలేదా అని ఆక్షేపణకు అనవచ్చును. విషయ ప్రతిపాదనము సులభార్థ బోధకత్వము మా లక్ష్యములు పిడివాదమునకు తావులేదు. ఆధునిక విజ్ఞాన సందర్భమున మన భాష చెందిన వ్యక్తా వ్యక్త పుష్టినిబట్టి రచన సాగించవలసిన వారమైతిమి. ఈ గ్రంథమునందు వాడబడిన అంతర్జాతీయ పదములు ఆంగ్లపదములు వాటికి కల్పింపబడిన పర్యాయపదములు తెలుపుటకై సాంకేతిక పదములు పట్టికనుకూడ చేర్పించినాము, భాషా విషయమున సులభ గ్రాంథికమునే తెలంగాణా రచయితలు అభిమానించినట్లు తోచినది. దీనిని శిష్ట వ్యావహారికమునకు వీలయినంత దగ్గరగ ఉండునట్లు నిర్వహింపవలెనని మా సంపాదకీయ వర్గమువారు ఆదేశించిరి. ఇట్టి ప్రయత్నమే కొనసాగింపబడెను.
ఈ సంపుటమునందు 174 వ్యాసములు కలవు. వీటిలో అనువాదక వ్యాసములు 44 కలవు. రచయితలు 123 మంది, అనువాదకులు 19 మంది, "అ"కారమందలి వ్యాసములు 109. దీని పుటల పరిమితి 422. "ఆ" కారమందలి వ్యాసములు 65. వీటి పుటలపరిమితి 378. విషయ వర్ణనాత్మక పటము లసంఖ్య 223. ఇవిగాక, ప్రముఖ చిత్రములు కొన్ని రంగులలోను, ఆర్టు పేపరుమీదను ముద్రింపబడినవి. 174 వ్యాసములలోను 89 చరిత్ర – సంస్కృతులకు సంబంధించినవి, 73 విజ్ఞాన శాస్త్రాదులకు సంబంధించినవి, 12 ఇతరములు. మొత్తము మీద ఈ సంపుటములో ఆంధ్రులకు, ఆంధ్రభాషకు, ఆంధ్రదేశమునకు సంబంధించిన వ్యాసములసంఖ్య 55 . ఆంధ్ర సంబంధ వ్యాసముల పుటలనంఖ్య 328. . సంగ్రహ విజ్ఞానకోశము యొక్క ఆర్థికపు సమస్యలను కూడ ఊకొట్టుడు. ఈ యుద్యమమును ప్రజా మూలమని కదా మేము వాకొంటిమి. ఎట్లన మా సంపాదకులందరు గౌరవ కార్యకర్తలే. వారి విద్వత్కృషికై ధన్యవాదములను తప్ప సమితి ఎట్టి పారితోషికమును వారికిచ్చుటలేదు. వ్యాస రచయితలకు మాత్రము అచ్చు పుటకు రు. 5 వంతునను, అనువాదకులకు అచ్చువుటకు రు. 2-50 న. పై వంతునను పారితోషికము ఈయనగు చున్నది. దీనిని కూడ స్వీకరించని పెద్దలు కొందరు కలరు. ఈ గ్రంథము ఐదు సంపుటములని మొదట భావించి మొత్తము గ్రంథము వెల నూరు రూప్యములని మదింపబడెను, ప్రణాళికా రచనానంతరము ఇది ఆరు సంపుటముల గ్రంథమగునని చెల్లమాయెను. అయినను ఆరంభమునందే విరాళ రూపమున రు. 100 ఇచ్చు వారికి ఆరు సంపుటములును ఇయ్యవలెనని నిర్ణయించి ప్రకటనము జరిగెను. మొదటి సంపుటమునందు 'అ' నుండి 'కా' వరకు కల వ్యాసములు ప్రకటించుటకు ఉద్దేశించియుంటిమి. కాని వ్యాసములు నిర్దిష్ట పరిమితిని మించి సుదీర్ఘములుగ నుండుటచే "ఆ" వర్ణము పూర్తి కాకుండగనే సంపుటము ముగిసినది. ఈ యనుభవమును బట్టి విజ్ఞానకోశము 6 సంపుటములు మించిపోవునట్లే సూచనలు కాన్పించుచున్నవి. ఒక్కొక్క సంపుటము యొక్క నిర్మాణ వ్యయము రు. 40,000 చొప్పున పూర్తి గ్రంథమునకు దాదాపు రు. 2,50,000 వ్యయము కాగలదని అంచనా వేయబడినది. ప్రతి సంపుటము వెల రు. 20 ఏర్పాటు చేయనైనది.
కార్యకర్తల ఉత్సాహము సంపాదకుల భాషానిరతి మాత్రమే ఈ యుద్యమమునకు మూలధనముగా నుండెను. ఉద్యమ స్థాపకులైన డాక్టరు బి. విశ్వనాథముగారి రు. 100 విరాళములో దీనికి శ్రీకారము చుట్టబడెను. ఉద్యమరేఖ లింకను సుస్పష్టము కానిదినములలోనే, అప్పుడు ఆదిలాబాదు జిల్లా బోధ్ గ్రామములో తహసిల్దారుగా నుండిన మా మిత్రులు శ్రీ వి. బి. నరసారెడ్డిగారు విజ్ఞాన కోశమునకు రు. 100 మొట్టమొదటి మనియార్డరు పంపి చుక్క వ్రాయించుకొనిరి. వెనువెంటనే శ్రీ జి. వి. సుధాకరరావు గారును, శ్రీ ఇ. వి. రామిరెడ్డిగారును రోజు కొనుచు వచ్చి చిన్న దెబ్బలను అందుకొని మురిసిపోయిరి. శ్రీ రాజా వేంకట మురళీ మనోహరరావుగారిచ్చిన రు. 300 లతో సమితి కార్యాలయము ఒక టైపు లేఖినితో ఆరంభింపబడెను. ఇట్టిది చీమ గంగా యాత్రగా సాగజొచ్చెను. ప్రారంభ సంవత్సరము అందే మాకు ఆదిలాబాదు జిల్లానుండియు, వరంగలు జిల్లా నుండియు, సభ్యత్వ రుసుములు కొన్ని వచ్చి కాలు నిలువదొక్కుకొనుటకు తోడ్పడినవి. అప్పటి హైదరాబాదు ప్రభుత్వములో వ్యవసాయశాఖా మంత్రులును సమితికి ఇప్పుడును ఉపాధ్యక్షులును అయిన మర్రి చెన్నా రెడ్డిగారు మాకు గొప్ప చేయూత నిచ్చిరి. అట్లే అప్పటి హైదరాబాదు శాసనసభా సభ్యులు కొందరు మా యుద్యమమును ఆదరించి తమ నైతిక సహాయము మా కొసంగి అండయై నిలిచిరి. శ్రీమతి ఆరుట్ల కమలాదేవి గారును శ్రీయుతులు కే. వి. నారాయణరెడ్డి, కె. పెద వెంకట్రామారావుగార్లును శాసనసభా వర్గమునందు మా కొఱకు చేసిన సేవ ప్రశంసనీయము.
ఈ తొలిదినములందే వనపర్తి రాజా రామదేవరావు బహద్దరుగారు రు.500 విరాళమునిచ్చి తోడ్పడిరి, సికింద్రాబాదు పురపాలక సంఘమువారు 1955 లో రు 1000 ల విరాళమును మంజూరుచేసి స్థానిక పరిపాలనా సంస్థలకు మార్గదర్శకులైరి. ఈ సంవత్సరాంతమున అప్పటి హైద్రాబాదు ప్రభుత్వము వారు రు. 10,000 లు సహాయముగా ప్రసాదించి సమితికి వెన్నెముక ఏర్పడునట్లు చేసిరి. వెనువెంటనే హైదరాబాదు పురపాలక సంఘమువారు రు. 2000 లును, మరికొంత కాలమునకు నల్లగొండ జిల్లా బోర్డు వారును, మహబూబు నగర్ జిల్లాబోర్డువారును చెరియొక రు.2500ల విరాళము లంపిరి. సామాన్య గృహస్థులు పలువురు సభ్యత్వ రుసుములు పంపుచునే యుండిరి. యాదగిరి నరసింహస్వామి దేవాలయమునుండి రు. 500 ల విరాళము లభించెను. మొదటి సంపుటము ముద్రణమునకై కావలసిన కాగితమునంతను సిర్పూరు కాగిత కర్మాలయాధిపతులు శ్రీ బిర్లా సోదరులు మాకు మూడవవంతు ధరకు మాత్రమే ఇచ్చి గొప్ప ఉపకారము చేసిరి. దీని వలన సమితికి దాదాపు రు. 6000 లు కిఫాయతు ఏర్పడెను.
ఇంతలో ఆంధ్రప్రదేశపు శుభావతరణ మయ్యెను. గౌ. శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు తమ అధ్యక్ష కవచమును ఆంధ్రప్రదేశ ముఖ్య మంత్రులు గౌ. డాక్టరు నీలం సంజీవరెడ్డిగారికి అర్పించి తాము కేరళ రాజ్యపాలకులుగా వెడలిరి. ఇట్టి ప్రజోపయోగమైన కార్యమునకు ప్రభుత్వమే చేయూత ఈయదగునని శ్రీ సంజీవరెడ్డిగారు ఆరంభముననే సంకల్పించి మాకు ధైర్యోత్సాహములు కలిగించిరి. రాజ్యకార్య బాహుళ్యముచే తమకు సమితి కార్యజాతమును నడిపించుటకు సమయము చాలక అప్పుడు ఆర్థిక శాఖామాత్యులుగ నుండిన గౌ. డాక్టరు బెజవాడ గోపాల రెడ్డిగారిని అధ్యక్షులునుగ చేసికొండని ఆదేశించిరి. సాహిత్య పోషణమునందును కళాభిరుచి యందుమ శ్రీ గోపాల రెడ్డిగారు ఆంధ్రదేశమునందు ముఖ్యజ్యోతిగ ఉన్నారనుట అతిశయోక్తి కానేరదు. సమితి ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామాత్యులు గౌ. యస్. బి. పి. పట్టాభిరామారావుగారును, డాక్టరు గోపాలరెడ్డిగారును సంప్రదించుకొని సంగ్రహ విజ్ఞానకోశ సమితికి సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడు ప్రణాళికను రచించిరి. దీనికి ఆంధ్రప్రదేశ ప్రభుత్వామోదము లభించుట ముదావహము. ఈ పథకము ప్రకారము ఆంధ్ర ప్రభుత్వమువారు సమితికి సంవత్సరమునకు రు. 25,000 చొప్పున నాలుగు సంవత్సరములు ధనసహాయము చేయుదురు. దీనికొక షరతు కలదు. సమితివారు ప్రజలనుండియు ప్రజాహిత సంస్థలనుండియు సంవత్సరమునకు రు. 12,500 లు విరాళములు సంపాదించుకొని ప్రభుత్వమునకు చూపవలెను. ఈ ప్రణాళిక క్రింద ఆంధ్రప్రదేశ ప్రభుత్వమువారు తొలిసారిగా రు. 15,000 ధనసహాయము చేయించుటచే మొదటి సంపుటము ముద్రణము జయప్రదముగ సాగినది. ఈలోగడ వ్యాపార సంస్థలును మాకు చక్కగా తోడ్పడినవి. సింగరేణి బొగ్గుగనుల నిర్వాహకులు రు. 1,500 లును, నిజాం చక్కెర కర్మాగారమువారు రు. 500 లును విరాళము లిచ్చిరి.
ఇంతవరకును విజ్ఞానకోశ సమితికి లభించిన ఆర్థిక సహాయము తెలంగాణము నుండియే లభించెను. మొదటి సంపుటమైనను ముద్రణమయిన తరువాత ఆంధ్రప్రాంత సోదరులను సహాయ మభ్యర్థింప వచ్చుననియు అది మాకు కొంగు బంగార మనియు వేచియున్నాము. ఇట్లుండ మా కార్యవర్గ సభ్యులును సింహాచల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ధర్మకర్తలును అగు శ్రీ పి. వి. జి. రాజు గారి సంకల్పముచే స్వామి భాండారమునుండి సమితికి రు. 5,000 లు ధన సహాయము వాగ్దానము చేయబడి యున్నది. అది ఇంతలో రాగలదు. వడ్డికాసుల దైవమగుటచే కాబోలు శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామి వెనుకముం దాడుచున్నాడు. కాని ఆయన తలచు కొన్నచో కొదువ ఏమి? వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారు ఉపేక్ష వహింతురా ! భారత ప్రభుత్వము వారుకూడ మున్ముందు విజ్ఞానకోశ సమితి కార్యక్రమమును గుర్తించి సాదర సహాయము చేయగలరని విశ్వసించుచున్నాము, ఆంధ్ర భాషాభిమానులును, గ్రంథాలయములు, కళాశాలలు, పాఠశాలలు, మున్నగు సంస్థలును ధర్మనిధులు కల పారిశ్రామిక వ్యాపార సంస్థలును సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ సమితికి భూరి విరాళము లిచ్చి తోడ్పడగలరని విన్నవించుచున్నాము.
సమితి సమకూర్ప గలిగిన సాధన సామగ్రియు, ఇతర సౌకర్యములును తక్కువయైనను, భాషాభిమానముతో కృషిచేసి యీ సంపుట ప్రకటనమునకు ముఖ్య కారకులైన మా సంపాదకులకును, వారికి చేదోడువాదోడుగానుండిన శాఖా సంపాదకీయ వర్గసభ్యులకును మా కృతజ్ఞతలు తెల్పుచున్నాము. అల్ప వేతనములపై పనిచేయుచుండియు కార్యసిద్ధినే ఆశించి ప్రశంసనీయమైన కృషి చేసిన కార్యాలయోద్యోగు లందరికిని, ముఖ్యముగ దీనికి మెదడుగా వ్యవహరించిన పెద్దలు శ్రీ ఆదిరాజు వీరభద్రరావు, ఆచార్య గరికపాటి లక్ష్మీ కాంతయ్య గార్లకును మేము కృతజ్ఞులము. ఆరంభము నుండియు నీ యుద్యమమునకు చేయూత నిచ్చియు, ఉచిత విరాళముల నిచ్చియు, గ్రంథ ముద్రణ కార్యమును విజయవంతముగ సాగించిన ముద్రాపకులు శ్రీ అజంతా ప్రింటర్సు వారికి సమితీ ఋణపడి యున్నది. ఇంత పెద్ద యెత్తున ముద్రణకార్యము నిర్వహించుటకు శక్తియు, యుక్తియు, రక్తియు గల అచ్చు కార్యాలయములు తెలంగాణములో కలవని అజంతావారు నిరూపించి కీర్తి సంపాదించుకొన్నారు. సికింద్రాబాదు దుర్గా బ్లాక్ మేకింగు కంపెనీవారు బ్లాకులను సత్వరముగను, ముచ్చటగను సిద్ధముచేసి మాకు తోడ్పడి యున్నారు.
ఎందరో మిత్రులు, హితైషులు వారందరకును మా కృతజ్ఞతా నమోవాకములు. - హెచ్. జి. వెల్సు మహాశయుని "ప్రపంచ విజ్ఞాన సర్వస్వ" భావనతో నీ పీఠికను సమాప్తి చేయుదుము.ఆదర్శప్రాయమైన ప్రపంచ విజ్ఞాన సర్వస్వ మిట్లుండవలెనని ఆతడు భావించెను. “ఈ గ్రంథ మెన్నియో సంపుటముల వరుస నాక్రమించును. విషయములు ఎక్కువగ వెదకుకొన నక్కరలేకయే దీనియందు లభించును. భాష సులభమై, సుగ్రాహ్యమై యుండగలదు. ఆధునిక సాంఘిక వ్యవస్థ యొక్క మూల భావములును, విజ్ఞానమును అన్ని రంగములకు సంబంధించిన ఆకార సూత్రములును ముఖ్యాంశములును, మనము నివసించు విశ్వమునుగూర్చి నిర్దుష్టమయి సాధ్యమైనంతగా వివరణాత్మకమగు జ్ఞానమును, ప్రపంచ దేశముల సామాన్య చరిత్రమును, విజ్ఞానము యొక్క మూలాధారములైన ప్రాతిపదిక సామగ్రియు, పరామర్శ గ్రంథ ముల విశ్వసనీయమైన క్రోడీకరణమును ప్రపంచ విజ్ఞాన సర్వస్వములో చూడగలము.”
“మరియు ఈ విశ్వ విజ్ఞానకోశము భూమండలము నందలి ప్రతి వివేకశాలియైన వ్యక్తికిని మానసిక భూమికగా నుండదగును. ప్రపంచమునందలి విజ్ఞానవేత్తల చేతులలో ఇది తరచు పునర్నవికృత రూపమును పొందుచు, సజీవమై పెరుగుచు, నిత్యప్రవర్థమాన చైతన్యవంతమై యుండును. ప్రతి విశ్వవిద్యాలయమును ప్రతి పరిశోధన సంస్థయు దీనికి బలసంధాయక మార్గముగ నుండవలెను. నూత్న ధీశాలులలో ప్రతియొక్కనికిని ఏతత్రోళ స్థాయి సంపాదకవర్గముతో సంబంధము కల్పింపబడవలెను, ఇట్టి విశ్వ విజ్ఞానకోశము ప్రపంచ సంస్కృతికి మూఢ దీక్షా ప్రతిబంధకములేని బైబిలు గ్రంథము కాగలదు. విద్యారంగమునందు దీని ప్రాముఖ్య మపారము. పాఠశాలల యందును, కళాశాలల యందును విద్యాబోధనమున కిది సహాయకమై, ప్రామాణికమై ప్రాతిపదిక జ్ఞాన విషయముల నిధిగా నుండగలదు. వేద్యాంశముల పరామర్శమునకును, వక్కాణముల పరిశీలనమునకును ఇది మూలాధారము కాగలదు. వేయేల, ఈ నాటి మన బౌద్ధిక సంస్థలు - చెల్లాచెదరై పెడదారి త్రొక్కియున్న ఈ సంస్థలు సాధింపలేని మహత్తర ప్రయోజనమును ఈ ప్రపంచ విజ్ఞాన సర్వస్వము సాధింపగలదు. ప్రపంచము నంతను మానసిక బాంధవ్య సూత్రములచే సంహితపరచుటయే ఆ మహత్తర లక్ష్యము."
ఇదిగో! ఒక దళము విరిసిన షట్చక్రకమలము. దీనిని సాదరముగ పరీక్షింపుడు. “అలినీగరుదనీక మలినీకృతము” చేయుడు,
విలంబ అధిక శ్రావణ బహుళ 8 - గురువారం
బుధవిధేయుడు
7 ఆగస్టు 1958
ఖండవల్లి లక్ష్మీరంజనం
విద్యానగరం, హైదరాబాదు.
కార్యదర్శి
1. అధ్యక్షలు : గౌ, డాక్టరు బెజవాడ గోపాలరెడ్డి మంత్రి, రివెన్యూ - పౌర వ్యయము - భారత ప్రభుత్వము, క్రొత్తఢిల్లీ-
2. ఉపాధ్యక్షలు : డాక్టరు యం. చెన్నారెడ్డి ఎం. ఎల్. ఏ. మాజీ వ్యవసాయశాఖామాత్యులు, హైద రాబాదు,
3. శ్రీ. యస్. బి. పి. పట్టాభిరామారావు విద్యాశాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్.
4. శ్రీ. డి. సదాశివ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాల యోపాధ్యక్షులు, హైదరాబాదు.
5. కార్యదర్శి : శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం ఆంధ్రశాఖాధ్యక్షులు, ఉ. వి.
6. సంయుక్త కార్యదర్శి : డా. బేతనభట్ల విశ్వనాథం గణితశాస్త్రశాఖ, ఉ. వి.
7. సహాయ కార్యదర్శి : డా. బి. రామరాజు పిం.ఁగుశాఖ, ఉ. వి.
8. కోఠాధిపతి : డా. రావాడ సత్యనారాయణ భౌతిక శాస్త్రశాఖాధ్యక్షులు, ఉ. వి.
9. సభ్యులు శ్రీ పి. వి. జి. రాజు 10. 11. 12. >> 13. 14. 15. " 18. విజయనగరం రాజావారు. డా. వి. యస్. కృష్ణ ఉపాధ్యక్షులు, ఆంధ్ర విశ్వవిద్యాలయము, వాల్తేరు. శ్రీ జటప్రోలణ రాజావారు హైదరాబాదు. పద్మశ్రీ మోటూరి సత్యనారాయణ పార్లమెంటు సభ్యులు మద్రాసు. - శ్రీ కల్వ సూర్యనారాయణ గుప్త వర్తకులు, హైదరాబాదు. బెర్డే జగదీశ్వరయ్య గుప్త వర్తకులు, హైదరాబాదు. డా. యస్. వేంకటేశ్వరరావు ఆనరరీ ఫిజిషియన్, ఉస్మానియా ఆసుపత్రి, హైదరాబాదు. డా. పుట్టపర్తి శ్రీనివాసాచారి డైరెక్టరు, పురావస్తుశాఖ, హైదరాబాదు. 17. సభ్యులు 18. 19. 20. 21. 22. " " వల్లూరి సుబ్బరాజు అగ్రికల్చరల్ ఇంజనీరు, ఇండియన్ ఇన్ స్టిట్యూటు ఆఫ్ టెక్నాలజి, ఖరగ్ పూరు. జి. వి. సుధాకరరావు అధ్యక్షులు, పరిపాలన విధానశాస్త్ర శాఖ, ఉ. వి. కాసుగంటి రాజేశ్వరరావు అడ్వకేటు, హనుమకొండ. శ్రీ కంచెనేపల్లి పెదవెంకట్రామారావు అడ్వకేటు, నల్లగొండ. శ్రీ యం. ఆర్. అప్పారావు, నూజివీడు, కృష్ణాజిల్లా - కె. నరసింహాచారి ఎం, ఎల్. ఏ. సభ్యులు- హైద రాబాదు మునిసిపల్ కార్నొ షను విషయము 1. భాష, సారస్వతము, లిపి 2. చరిత్ర 8. తత్త్వశాస్త్రము 4. భూగోళశాస్త్రము 5. అర్థశాస్త్రము సంపాదకీయ వర్గము శ్రీ మామిడిపూడి వేంకట రంగయ్య, ఎం. ఏ.. అధ్యక్షలు, సంపాదకీయవర్గము సంపాదకులు శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం, ఎం. ఏ.. ఉస్మానియా విశ్వవిద్యాలయము ఖండవల్లి బాలేందు శేఖరం, ఎం. ఏ.. నిజాం కళాశాల, హైదరాబాదు డా. వహీదుద్దీను, త త్త్వశాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము & డా. శ్రీపతి శ్రీదేవి, ఎం. ఏ. పిహెచ్. డి.. ప్రిన్సిపాలు, ప్రభుత్వ మహిళా కళాశాల, హైదరాబాదు శ్రీ వైజ్యనాథ్. ఎం. ఏ.. ప్రొఫెసరు, భూగోళశాస్త్రశాఖ, ఉస్మానియా వి. & శ్రీ బి. యన్ చుతుర్వేది భూగోళశాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము డా. రాంపల్లి విశ్వేశ్వరరావు, ఎం. ఏ., పిహెచ్. డి., జాయంటు డై రెక్టరు, వాణిజ్య పరిశ్రమలశాఖ, ఆంధ్రప్రదేశ్ 6. మానవశాస్త్రము, సాంఘికశాస్త్రము శ్రీ జి. వి. సుధాకరరావు 7. రాజనీతిశాస్త్రము 8. మతములు 9. సంగ్రామశాస్త్రము 10. క్రీడలు 11. వార్తాశాస్త్రము పరిపాలన విధానశాస్త్రశాఖ, ఉస్మానియా వి. హైదరాబాదు ఆచార్య మామిడిపూడి వేంకటరంగయ్య, ఎం. ఏ., మాజీ ప్రొఫెసరు, ఆంధ్ర - బొంబాయి విశ్వవిద్యాలయములు ఆచార్య కురుగంటి సీతారామయ్య, ఎం. ఏ., సంస్కృత అకాడమీ ఉ. వి. శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం, ఉస్మానియా విశ్వవిద్యాలయము శ్రీ బి. అనంతరావు, సికింద్రాబాదు కళాశాల శ్రీ యన్. నరోత్తమరెడ్డి, ఎం. ఏ. సంపాదకులు, గోలకొండ పత్రిక, హైద్రాబాదు 8 12. న్యాయశాస్త్రము 13. వాణిజ్యశాస్త్రము 14. వినోదములు 15. యాత్రలు, అన్వేషణము 18. కళ 17. గానశాస్త్రము 18. చిత్రకశ 19. నృత్యకళ 20. వాస్తు విద్య 21. గణితశాస్త్రము 22. భౌతికశాస్త్రము 23. రసాయనశాస్త్రము 24. వృక్షశాస్త్రము 25. జంతుశాస్త్రము 26. భూగర్భరాస్త్రము 27. ఖగోళ శాస్త్రము శ్రీ వల్లూరి వెంకటేశ్వర్లు, సుప్రీంకోర్టు అడ్వ కేటు, హైద్రాబాదు శ్రీ బి. రాఘవేంద్రరావు, వాణిజ్య శాఖాధ్యకులు, ఉ. వి. శ్రీ కె. వేంకటాచారి, ఆంగ్లోపన్యాసకులు, నిజాం కళాశాల శ్రీ దేవులపల్లి రామానుజరావు, బి. ఏ., ఎల్. ఎల్. బి., హైదరాబాదు డా. పుట్టపర్తి శ్రీనివాసాచారి, డైరెక్టరు. పురావస్తుశాఖ, హైదరాబాదు శ్రీ పుచ్చా వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంగీత పరిశోధక విద్వాంసులు, హైద రాబాదు శ్రీ కె. శేషగిరిరావు. ఉపన్యాసకులు, లలితకళల కళాశాల, హైదరాబా నటరాజ రామకృష్ణ, డై రెక్టరు, నృత్య నికేతనము, హైదరాబాదు డా. పుట్టపర్తి శ్రీనివాసాచారి, హైదరాబాదు శ్రీ రాఘవేంద్రరావు, అధ్యక్షులు, గణితశాస్త్రశాఖ, ఉ. వి. డా. రావాడ సత్యనారాయణ, అధ్యక్షులు, భౌతికశాస్త్ర శాఖ, ఉ. వి. డా. నండూరి వేంకట సుబ్బారావు, అధ్యక్షులు, రసాయన శాస్త్రశాఖ, ఉ, వి. శ్రీ బి. వి. రమణారావు, ఎం. ఎస్. సి. వ్యవసాయ కళాశాల, ఉ. వి. డా. బాపురెడ్డి, వ్యవసాయ పరిశోధన సంస్థ, హైదరాబాదు & వి. జగన్నాథరావు, ఎం.ఎ. లెక్చరర్, సైన్సు కాలేజి, హైదరాబాదు డా. కె. వి. రావు భారతదేశ భూగర్భశాస్త్ర, సర్వేశాఖ, హైద రాబాద్ డా. ఎస్. బాలకృష్ణ & భూగర్భశాస్త్రాచార్యులు, ఉ. వి. డా. బేతనభట్ల విశ్వనాథం గణితశాస్త్రశాఖ, ఉ. వి. 28. వైద్యశాఖ 29. స్థాపత్యము 30. వ్యవసాయశాస్త్రము 31. సంఖ్యాశాస్త్రము 32. మానసికశాస్త్రము 33. విద్యాశాస్త్రము 34. వాతావరణశాస్త్రము 35. వివిధములు 36. ఆంధ్రదేశము - విశేషశీర్షికలు 37. ఆయుర్వేదము 38. ప్రాచీన విద్యలు - కళలు 39. పశువైద్యశాస్త్రము డా. ఎస్. వేంక టేశ్వరరావు ఆనరరీ ఫిజీషియను, ఉస్మానియా ఆసుపత్రి, హైదరాబాదు శ్రీ వల్లూరి సుబ్బరాజు శ్రీ అగ్రికల్చరల్ ఇంజనీరు, టెక్నాలజి - ఖరగ్ పూరు కంభంపాటి భాస్కరము వ్యవసాయ కళాశాల, ఉ. వి. శ్రీ డి. వి. ఎస్. ద్వారక గడితశాస్త్రశాఖ, ఉ. వి. శ్రీ కె. వేదాంతాచారి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బోధనాభ్యసన కళాశాల, ఉ. వి. శ్రీ సత్తిరాజు కృష్ణారావు ప్రభుత్వ బోధ నాభ్యసన కళాశాల, హైదరాబాదు డా. యస్. రాజేశ్వరరావు భౌతికశాస్త్రశాఖ, నిజాం కళాశాల, హైదరాబాదు డా. టి. సత్యనరసింహమూర్తి నిజాంకళాశాల, హైదరాబాదు శ్రీ ఆదిరాజు వీరభద్రరావు - కార్యదర్శి. లక్ష్మణనారాయ పరిశోధక మండలి, హైద్రాబాదు పండిత, శతావధాని శ్రీ వేదాల తిరుమల రామానుజస్వామి, ఆయుర్వేదాచార్య, అధ్యక్షులు, ఆయుర్వేద మహామండలి, హైదరాబాదు శిరోమణి చెలమచర్ల రంగాచార్యులు ఆంధ్రోపన్యాసకులు, ఉ, వి. డా. సి. వేంకటేశ్వరరావు వెటర్నరీ కాలేజి, ఉ. వి.
-
| వ.సం. పొడి అక్షరములు | వ్యాసకర్త | వ్యాసములు |
|---|---|---|
| 1. అ. వై. | శ్రీమతి అల్లాడి వైదేహి, ఎం.ఏ., చరిత్రోపన్యాసకురాలు, మహిళా కళాశాల, హైదరాబాదు (ద.) | అశోకుడు |
| 2. అ. హు. | శ్రీ అఖ్తరు హుస్సేన్, ఎం.ఎస్.సి.బి.ఎస్.ఎల్, (యు.ఎస్.ఎ.) బి.ఎస్.మెక్ (యు.ఎస్. ఎ.) ఉపన్యాసకుడు, ఎలెక్ట్రకల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అంతర్విద్యుత్ప్రతిష్ఠ |
| 3. ఆర్. ఎన్. ఎస్. | శ్రీ ఆర్. ఎన్. శర్మ, ఎం. ఏ., బి.ఎల్. హైదరాబాదు | ఆంధ్ర వాణిజ్య సంఘము |
| 4. ఆర్. న. రావు. | డా. ఆర్. నరసింహారావు, ఎం.ఏ., పి.హెచ్.డి, చరిత్రోపన్యాసకుడు, నిజాం కళాశాల, హైదరాబాదు | 1. అబ్రహాం లింకను 2. అమెరికా సంయుక్తరాష్ట్రములు (చరిత్ర) 3. అమ్మరాజు విజయాదిత్యుడు |
| 5. ఆర్. వా. పి. | శ్రీ ఆర్. వాసుదేవ పిళ్ళె, బి.ఏ., ఎల్.ఎల్.ఎమ్., అడ్వకేటు, ఉపన్యాసకుడు ఇంటర్నేషనల్ లా, లా కళాశాల, హైదరాబాదు | అంతర్జాతీయ న్యాయశాస్త్రము (సార్వజనికము) |
| 6. ఆర్. వేం. స్వా. | శ్రీ ఆర్. వేంకటస్వామి, మేనేజరు, భాగ్యనగర్ డైయర్స్ అండ్ ప్రింటర్స్ ఇండస్ట్రియల్& కో-ఆపరేటిఉవ్ వర్క్సు సెంటరు, హైదరాబాదు (ద.) | అద్దకము-రంగువేత |
| 7. ఆ. వీ. | శ్రీ ఆదిరాజు వీరభద్రరావు, రిటైర్డు తెలుగు పండితుడు, ప్రభుత్వోన్నత పాఠశాల, చాదర్ఘాట్, హైదరాబాదు | 1. అనంతపురము జిల్లా-అనంతపుర పట్టణము 2. అల్లూరి సీతారామరాజు |
| 8. ఉ. గ. శా. | వేదభాష్య విశారద శ్రీ ఉప్పులూరి గణపతిశాస్త్రి, కాకినాడ | 1. అథర్వ వేదము 2. అభ్యవహారము |
| 9. ఉ. రా. | శ్రీ ఉరువుటూరి రాఘవాచార్యులు, బి. ఏ., బి. ఇ. డి. ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠశాల, చంచల్ గూడ, హైదరాబాదు | 1. అబిసీనియా (చ.) 2. అల్బేనియా |
| 10. ఎం. ఎల్. ఎస్. | శ్రీ ఎం. ఎల్. నారాయణరావు, ఎం. ఏ. లెక్చరరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అంకములు |
| 11. ఎం. కు. | శ్రీ మడుపు కులశేఖరరావు, ఎం. ఏ. ఆ౦ధ్రోపన్యాసకుడు, సికింద్రాబాదు కళాశాల, సికింద్రాబాదు | ఆదిలాబాదు |
| 12. ఎం. జి. కృష్ణ | డా. ఎం. జి. కృష్ణ, సైన్టిఫిక్ ఆఫీసరు, సెంట్రలు లేబరేటరీస్, హైదరాబాదు | అగ్గిపుల్లలు |
| 13. ఎన్.వి.బి.ఎస్.డి. | శ్రీ నడింపల్లి వి. బి. ఎస్. దత్తు, ఎం. ఎన్.పి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాదు | ఆంధ్రదేశపు ఖనిజసంపద |
| 14. ఏ. యం. జ. | శ్రీ ఏ. యం. జయరావు, ఉపన్యాసకుడు, ఫిజిక్సు డిపార్టుమెంటు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అయస్కాంతము |
| 15. ఓ. స. మూ. | శ్రీ ఓరుగంటి సత్యనారాయణమూర్తి, ఎం. ఏ. చరిత్ర, ఆర్థిక రాజకీయ శాస్త్రముల శాఖాధ్యక్షుడు, హిందూకాలేజి, గుంటూరు | 1. అధికార పరావృత్తి-అధికార విభజనము 2. అధికారవర్గము |
| 16. క. రా. మా. | శ్రీ కస్తూరి రాజమాణిక్యం, ఎం. ఏ., బి. ఇ. డి. ప్రధానోపాధ్యాయుడు, ఎల్లెందు, ఖమ్మం జిల్లా | 1. అండమాను దీవులు 2. ఆఫ్రికా ఖండపు భాషలు |
| 17. క. ల. శా. | శ్రీ శిరోమణి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి. అసిస్టెంటు డైరెక్టరు, ప్రభుత్వ సమాచార శాఖ, హైదరాబాదు | అలంకారశాస్త్ర చరిత్ర |
| 18 కు. సీ. | శ్రీ కురుగంటి సీతారామ భట్టాచార్యులు, ఎం. ఏ. రిటైర్డ్ సంస్కృతాంధ్రోపన్యాసకులు, నిజాం కళాశాల, హైదరాబాదు | అద్వైతానంద తీర్థులు |
| 19. కె. గో. | శ్రీ కె. గోపాల కృష్ణరావు, ఎం. ఏ. ఆంధ్రోపన్యాసకులు, నిజాం కాలేజి, హైదరాబాదు | ఆంధ్ర విష్ణువు |
| 20. కే. పు. | శ్రీ కే. పురుషోత్తం, బి.ఏ. (అనర్సు) వేంసూరు | అపేక్ష - సరఫరా |
| 21. కే. వి. యస్. | శ్రీ కే. వి. శ్రీనివాసరావు, ఎక్సెక్యూటివ్ ఇంజనీరు, కాలువల నిర్మాణ శాఖ, తుంగభద్రా ప్రాజెక్టు, మునీరాబాదు | ఆనకట్టలు |
| 22. కే. వి. రె. | శ్రీ కే. విఠలరెడ్డి, ఎం. ఏ.ఉ.వి. హైదరాబాదు | అంగోలా |
| 23. కే. స. | శ్రీ కే. సన్యాసయ్య, బి. కాం. (ఆనర్సు), కామర్సు శాఖాధ్యక్షులు, డల్లియు, జి. బి. కాలేజి, భీమవరం | అంతర్జాతీయ వ్యాపారము (ఒడంబడికలు) |
| 24. కే. న. శా. | శిరోమణి శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, హైదరాబాదు | ఆంధ్ర లక్షణ గ్రంథములు |
| 25. కొం. శే. | కొండపల్లి శేషగిరిరావు, ఉపన్యాసకులు, ప్రభుత్వ ఫైన్ ఆర్ట్సు కథాశాల, హైదరాబాదు | 1. అమృత షేర్గిల్ 2. అలంకరణ కళ |
| 26. కొ. భూ. రా. | శ్రీ కొమరగిరి భూపాలరావు, ఎం. ఏ. తహసీల్ దార్, ఎల్లెందు, ఖమ్మము జిల్లా | 1. అక్కన్న - మాదన్న 2. అబుల్ హసన్ తానాషా 3. ఆనెగొంది |
| 27. కొ. వీ. | డాక్టరు కొత్తపల్లి వీరభద్రరావు, ఎం. ఏ., పి. హెచ్. డి. ప్రాచ్యభాషా శాఖాధ్యక్షులు, మహారాజా కళాశాల, విజయనగరం | ఆనంద గజపతి |
| 28. ఖం. న. శా. | సాహిత్య, వ్యాకరణ శిరోమణి శ్రీ ఖండవల్లి నరసింహశాస్త్రి, పండితులు, వేదాంతవర్ధనీ సంస్కృత కళాశాల, హైదరాబాదు | ఆపస్తంబుడు |
| 29. ఖం. బా. శే. | శ్రీ ఖండవల్లి బాలేందుశేఖరం, ఎం. ఏ. ఆంగ్లోపన్యాసకులు, నిజాంకాలేజి, హైదరాబాదు | 1. అబ్దుల్ రజాకు 2. అరేబియా చరిత్ర 3. అస్సీరియా |
| 30. గం. జో. | ప్రొఫెసర్ గంటి జోగి సోమయాజి. ఎం. ఏ, ఎల్. టి. (విద్వాన్), ఆంధ్ర శాఖాధ్యక్షులు, ఆంధ్ర విశ్వవిద్యాలయము, వాల్తేరు | ఆంధ్ర భాషా చరిత్రము |
| 31. గ. రా. శ. | పండిత శ్రీ గడియారం రామకృష్ణశర్మ, ఆలంపురము | అలంపురము |
| 32. గ. ల. కాం. | విద్వాన్ శ్రీ గరికపాటి లక్ష్మీకాంతయ్య, ఎం. ఏ. రిటైర్డు సంస్కృతాంధ్రోపన్యాసకుడు, నిజాం కాలేజి, హైదరాబాదు (ద.) | అన్నంభట్టు |
| 33. గ. శి. శా. | శ్రీ గరికపాటి శివరామశాస్త్రి, ఎం. ఎస్. పి. లెక్చరరు, ఫిజికల్ లేబొరేటరీస్, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. అచ్చు యంత్రముల నిర్మాతలు 2. అచ్చుయంత్రములు - ముద్రణకళ |
| 34. చ. స. శా. | శిరోమణి, ఉభయభాషా ప్రవీణ శ్రీ చతుర్వేదుల సత్యనారాయణశాస్త్రి, ఎం. ఏ. రిటైర్డు సంస్కృతాంధ్రోపన్యాసకులు, ప్రభుత్వకళాశాల, కాకినాడ | ఆంధ్ర సాహిత్య పరిషత్తు |
| 35. చె. రం. | శిరోమణి శ్రీ చెలమచర్ల రంగాచార్యులు, (విద్వాన్) సంస్కృతాంధ్రోపన్యాసకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. అశ్వశాస్త్రము 2. ఆనందవర్ధనాచార్యులు |
| 36. జి. ఎన్. ఎస్. | శ్రీ జి. నాగభూషణ శర్మ, ఎం. ఏ. చరిత్రాచార్యుడు, డి. ఎ. వి. కాలేజి, షోలాపూరు | 1. ఆక్వినాస్ థామస్ 2. అరిస్టాటిల్ (రాజకీయములు) |
| 37. జి. ల. | శ్రీ. జి. లక్ష్మీనారాయణ, ఎం. ఏ. లెక్చరరు, గణితశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అనువర్తిత గణితశాస్త్రము |
| 38. జి. స. | శ్రీ. జి. సత్యమూర్తి, ఎం. ఎస్, సి. సికిందరాబాదు | 1. అడవులు 2. అమెరికా ఖండము (ఉ. ద) 3. ఆంధ్రప్రదేశము II 4. ఆఫ్రికా |
| 39. జి. జి. కె. ఎస్. | శ్రీ జి. జి. కె. శాస్త్రి, జియాలజిస్టు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కలకత్తా | అభ్రకము |
| 40. జె. జో. | శ్రీ జయంతి జోగారావు, ఎం. ఎస్. సి. లెక్చరరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాదు | అర్హీనియస్ |
| 41. జె. సి. కా. రా. | డా. జయంతి చినకామేశ్వరరావు డి. యన్.సి., ప్రిన్సిపాలు, నాగార్జున కళాశాల, నల్లగొండ | అణుబాంబు |
| 42. జొ. ల. | శ్రీ జో. లక్ష్మీకాంతం, ఎం. ఎస్. సి. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | ఆమ్లజని |
| 43. టి. కె. వి. ఎన్. సు. | శిరోమణి శ్రీ టి. కే. వి. యన్. సుదర్శనాచార్యులు, పండితులు, శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ రిసర్చి ఇన్స్టిట్యూట్, తిరుపతి | 1. అభినవ గుప్తుడు 2. ఆగమశాస్త్రము |
| 44. టి. శే. రా. | డాక్టరు. టి. శేషగిరిరావు, ఫిజిక్సు లెక్చరరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అతి శ్రుతి ధ్వనిశాస్త్రము |
| 45. డా. ఆర్. వి. రా. | డాక్టరు. ఆర్. వి. రావు, ఎం ఏ., పి. హెచ్. డి. జాయంట్ డైరెక్టరు, ఇండస్ట్రీస్ & కామర్సు, హైదరాబాదు | 1. అర్థశాస్త్ర ప్రమేయము 2. ఆంధ్రబ్యాంకు చరిత్ర 3. ఆర్థిక వ్యవసాయ ప్రణాళిక |
| 46. డా. ఎం. అ. ఎం. | డాక్టరు. అబ్దుల్ మోయీదుఖాను అరబ్బీ భాషా శాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అరబ్బీభాషా సాహిత్యములు |
| 47. డా. ఓడెల్ | డాక్టరు డి. ఫారెస్టు ఓడెల్ జర్నలిజము శాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అమెరికన్ సాహిత్యము |
| 48. డా. జి. రా. రెడ్డి | డాక్టరు జి. రామకృష్ణారెడ్డి ఎం.ఏ., పి.హెచ్ డి., ప్రొఫెసరు ఆఫ్ ఎకనామిక్సు, మహారాజా కాలేజి, మైసూరు | 1. అంతర్జాతీయ వాణిజ్యము 2. అర్థశాస్త్ర సిద్ధాంతముల చరిత్ర |
| 49. డా. బా. రె. | డాక్టరు బాపురెడ్డి ప్రొఫెసర్ జూఅలజి, అగ్రికల్చరల్ రిసర్చి ఇన్ స్టిట్యూటు. హిమాయత్ నగరు, హైదరాబాదు | 1. అంతర్గుహాకములు 2. అరిస్టాటిల్ (జం.) |
| 50. డా. పు. శ్రీ. | డాక్టరు పుట్టపర్తి శ్రీనివాసాచారి, ఎం. ఏ., పి. హెచ్ డి. (లండన్) డైరెక్టరు, పురాతత్త్వశాఖ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు | అజంతా |
| 51. డా. మ. ని. | డాక్టరు మహేశ్వర నియోగ్ ఎం. ఏ., డి.ఫిల్, ప్రొఫెసరు, గౌహతి విశ్వవిద్యాలయము, గౌహతి, అస్సాము | అస్సామీ భాషా సాహిత్యములు |
| 52. డా. యస్. బా. | డాక్టరు యస్. బాలకృష్ణ భూగర్భశాస్త్ర శాఖాధ్యక్షుడు, ఉప్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. అంతర్జలము 2. అగ్ని పర్వతములు |
| 53. డా. యూ. హు. | డాక్టరు యూసుఫ్ హుస్సేన్ ఖాన్ ఎం. ఏ., చరిత్ర శాఖాధ్యక్షుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అబుల్ ఫజల్ |
| 54. డా. వ. | డాక్టరు వహీదుద్దీన్, రీడరు, ఫిలాసఫీశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అరిస్టాటిల్ (తత్వ) |
| 55. డా. వి. య. | డాక్టరు వి. యశోదాదేవి, ఎం. ఏ., ఎం. లిట్. డి. లిట్., మదరాసు | 1. అలెగ్జాండరు 2. ఆంధ్రదేశ చరిత్రము III 1823_1675 3. ఆఫ్ఘనిస్థానము |
| 56, డా. ఎస్. వేం. రా. | డాక్టరు ఎస్. వేంకటేశ్వరరావు, ఎం. డి. (ఆంధ్ర) ఆనరరీ ఫిజిషియన్, ఉస్మానియా జనరల్ హాస్పిటలు, హైదరాబాదు | 1. అంటువ్యాధులు (ఎల్లోపతి) 2. అన్నజీవ పరివర్తన వ్యాధులు 3. అవిసెన్నా 4. ఆండ్రియాస్ వెసేలియస్ |
| 57. డా. సి. రా. | డాక్టరు సి. రాధాకృష్ణరావు, ఎం. ఏ.పి. హెచ్. డీ. థియొరెటికల్ రీసెర్చి ప్రొఫెసరు, ట్రైనింగ్ డివిజన్ అధ్యక్షులు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. కలకత్తా | అనువర్తిత సంఖ్యాశాస్త్రము |
| 58. డి. డి. బి. | శ్రీ డి. దినకరబిందు జి, డి. (ఆర్కి టెక్చరు). ఎ. ఆర్. ఐ.బి. ఎ., క్రొత్తఢిల్లీ | 1. ఆకృతి రచన- ఆధునిక నిర్మాణ ద్రవ్యములు 2. ఆకృతి రచనాసూత్రములు 3. ఆధునిక వాస్తు వాదములు |
| 59. డి. వి. కె. | శ్రీ డి. వి. కృష్ణయ్య, ఎం. కాం. (ఆనర్సు) ప్రిన్సిపాలు, ఎస్. ఆ.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీ, విజయవాడ | 1. అంటార్కిటికా 2. అమెరికా సంయు క్తరాష్ట్రములు (భూగో.) 3. అర్జంటైనా 4. ఆంధ్ర ప్రదేశము I 5. ఆంధ్రులు - వాణిజ్యము 6. ఆఫ్ఘనిస్థానము (భూగో) |
| 60. డి.హ. | శ్రీ డి. హనుమంతరావు. రసాయనశాస్త్రశాఖ. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అల్యూమినియం |
| 61. త. స. న. | డాక్టరు తమ్మా సత్య నరసింహమూర్తి, ఎం. ఏ. పి. హెచ్. డి. లెక్చరరు, నిజాంకళాశాల, హైదరాబాదు | ఆర్కెమెడీసు |
| 62. తి.కో.రా. | శ్రీ తిమ్మావఝుల కోదండరామయ్య, బి. ఓ. ఎల్. (ఆనర్సు) తెలుగుశాఖాధ్యక్షులు, శ్రీ త్యాగరాయ కళాశాల, మద్రాసు |
అన్నమాచార్యులు - తాళ్లపాక |
| 68. తి. రా. | శ్రీ తిరుమల రామచంద్ర, సంపాదకుడు, 'పరిశోధన’- మద్రాసు | అడివి బాపిరాజు |
| 64.దం.వే.సు. | శ్రీ దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి, అంధ్రోపన్యాసకులు, కళాశాల, కర్నూలు | అహోబిలము |
| 65. ది. పి. | శ్రీ దిగంబర పిళ్ళె లెక్చరరు, కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు, హైదరాబాదు | అద్దకము |
| 66. ది. రా. | శ్రీ దివాకర్ల రామమూర్తి ఎం.ఏ., తెలుగు శాఖాధ్యక్షులు, ఎ.వి.ఎన్. కాలేజి, విశాఖపట్టణము |
అరసవెల్లి |
| 67. డి.వి.ర. | శ్రీ దూపాటి వేంకట రమణాచార్యులు, శతావధానులు | 1. అనపోతనాయడు 2. అనుమకొండ |
| 68.ది.వెం అ. | డాక్టరు దివాకర్ల వేంకటావధాని , ఎం.ఏ., పి.హెచ్.డి., రీడరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు |
1. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము I (1508 వరకు) 2. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము II (1509-1800) |
| 69. ది.వెం.శి. | శ్రీ దిగవల్లి వేంకటశివరావు బి.పి., బి.ఎల్., అడ్వొకేట్, విజయవాడ | 1. ఆంధ్రదేశ చరిత్రము IV (1675-1900) 2. ఆంధ్రదేశ చరిత్రము V (1900 - నేటి వరకు) |
| 70. దే. రా. | శ్రీ దేవులపల్లి రామానుజరావు బి.ఏ., ఎల్.ఎల్.బి కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి,హైదరాబాదు |
1. ఆంధ్ర సారస్వత పరిషత్తు 2. ఆంధ్రోద్యమము (తెలం) |
| 71. న.రా. | శ్రీ నటరాజు రామకృష్ణ, బి.ఏ.,డైరెక్టరు-నృత్య డైరెక్టరు నృత్యనికేతనము, హైదరాబాదు |
1. ఆంధ్రులు నృత్యకళ 2. ఆటవిక నృత్యములు |
| 72. ని.వేం. | శ్రీ నిడదవోలు వేంకటరావు ఎం.ఏ..ఆంధ్ర శాఖాధ్యక్షులు, మదరాసు విశ్వవిద్యాలయము, మదరాసు |
ఆంధ్ర లిపి పరిణామము |
| 73. నో. నా. | కళానిధి, సంగీతరత్న శ్రీ నోరి నాగభూషణం, జంత్రగాత్ర గాన విశారద, గవర్నమెంటు స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్సు, హైదరాబాదు | అహోబలుడు |
| 74. నో. రా. శా. | ఆయుర్వేద భూషణ, పండిత శ్రీ నోరి రామశాస్త్రి ఎ. కె.ఎ.సి., విజయవాడ | ఆయుర్వేద గ్రంథములు |
| 75. పం. గో. | శ్రీ పండిత గోపదేవు, హైదరాబాదు | ఆర్యసమాజము |
| 76. ప. దు. | శ్రీ పల్లా దుర్గయ్య ఎం. ఏ.. ఆంధ్రోపన్యాసకులు, నిజాంకాలేజి, హైద్రాబాదు | అల్లసాని పెద్దన |
| 77. పి. ఎల్. ఎన్. శర్మ | శ్రీ పేరి లక్ష్మీనరసింహ శర్మ ఎం. ఎ., ప్రిన్సిపాలు గిరిరాజ కాలేజి, నిజామాబాదు | ఆంధ్ర విశ్వవిద్యాలయము |
| 78. పి. టి. ఆర్. | శ్రీ పి. తిరుమలరెడ్డి, హైదరాబాదు | ఆధునిక పాశ్చాత్య చిత్రకళ |
| 79. పి. టి. రా. | పద్మభూషణ డా. పి. తిరుపతిరాజు, ప్రొఫెసరు ఫిలాసఫీ- పైకాలజీశాఖ రాజస్థాన విశ్వవిద్యాలయము. జోధ్ పూరు | అతి భౌతిక శాస్త్రము |
| 80. పి. బి. వి. యస్. | శ్రీ పి. బి. వేంకటసుబ్రహ్మణ్యం, ఎం. ఏ.. ఎం. లిట్. బి. సి. ఎల్., అడ్వకేట్, హైదరాబాదు | అంతర్జాతీయ న్యాయము (వైయక్తికము) |
| 81. పి. య. రె. | శ్రీమతి పి. యశోదారెడ్డి, ఎం.ఏ., ఆంధ్రోపన్యాసకురాలు, మహిళా కళాశాల, హైదరాబాదు | 1. అనపోతారెడ్డి 2. అన పోతారెడ్డి 3. అనితల్లి 4. అమరావతి |
| 82. పి. వేం. | శ్రీ పి. వేంకటేశ్వరరావు, జియాలజిస్టు, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాదు | ఆర్థిక ఖనిజములు - వాని పేకరణ, సమస్యలు |
| 83. పు. నా. | సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, లైబ్రేరియన్, సాహిత్య అకాడమి, న్యూఢిల్లీ | అపభ్రంశము |
| 84. పు. ప. శా. | శ్రీ పుచ్చా పరబ్రహ్మశాస్త్రి ఎం.ఏ., ఉపాధ్యాయులు, కేశవ మెమోరియల్ స్కూలు, హైదరాబాదు | ఆర్యభటుడు ఆర్షగణితము |
| 85. పెం. స. | శ్రీమతి పెండేల సత్యభామ, పిఠాపురము | అభినయము |
| 86. పె. రా. | శ్రీ పెద్దాడ రామస్వామి ఎం. ఏ., ప్రిన్సిపాలు కావలి కాలేజి, కావలి | ఆంగ్లభాషా సాహిత్యములు |
| 87. పె. లిం. శా. | భాషాప్రవీణ శ్రీ పెరవలి లింగయ్యశాస్త్రి, ప్రధానాంధ్రోపాధ్యాయుడు, ప్రభుత్వోన్నత పాఠశాల, చాదర్ ఘాట్, హైదరాబాదు | అహోబల పండితుడు |
| 88. పో. రా. | శ్రీ పోలవరపు రామచంద్రరావు బి.ఏ. బి. ఎల్., అడ్వకేటు, విజయవాడ | ఆధునిక సంగీతము |
| 89. పో. శ్రీ. రా. | శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు ఎం. ఏ., ఇండియా ప్రభుత్వపు రిసెర్చి స్కాలరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అరిస్టాటిల్ (సాహి) |
| 90. పో. సు. | ప్రొఫెసర్ పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి, ఎం. ఏ., ఎం. లిట్. పి. హెచ్. డి.. ఇంగ్లీషు ప్రొఫెసరు, సాగర్ యూనివర్సిటీ, సాగరు | అప్పయ దీక్షితులు |
| 91. వి. ము. | ప్రొఫెసర్ విశ్వనాథ ముఖర్జీ, ఎఫ్. ఆర్. ఎన్. ఏ., (లండన్) ప్రిన్సిపాల్, కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు, హైదరాబాదు | 1. అవనీంద్రనాథ టాగోరు 2. ఆధునిక భారతీయ చిత్రకళారీతులు |
| 92. బి. యన్. చ. | శ్రీ బి. యన్. చతుర్వేది, ఎం. ఏ., ఎఫ్. ఆ. జీ. ఎన్. (లండన్) సాహిత్యరత్న అలహాబాద్, ప్రొఫెసర్, జాగ్రఫీ డిపార్టుమెంటు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. అరేబియా (భూగో) 2. అలాస్కా 3. ఆర్థిక భూగోళశాస్త్రము |
| 93. బి: యస్. ఎల్. హ. రా. | శ్రీ బి. యస్. ఎల్. హనుమంతరావు ఎమ్, ఏ.. హిస్టరీ లెక్చరర్, హిందూకాలేజి, గుంటూరు | 1. అక్బరు 2. ఆళియ రామరాజు |
| 94. బి. రా. | డా. బి. రామరాజు, ఎం. ఏ., పి. హెచ్. డి. రీడరు, తెలుగుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | ఆంధ్ర జానపద గేయ వాఙ్మయము |
| 95. బి. రా. రా. | శ్రీ బారు రాఘవేంద్రరావు ఎం.ఏ. (కామర్సు) కామర్సు శాఖాధ్యక్షులు, ఉప్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అబిసీనియా (భూగోళము) |
| 96. బి. వి. ఎస్. ఎ. | శ్రీ బి. వి. ఎన్. ఆచార్య శ్రీ రాజరాజేశ్వరీ ఫిల్ముకంపెనీ, మద్రాసు | ఆంధ్ర సినిమా పరిశ్రమ |
| 97. బి. వి. రా. | శ్రీ బి. వి. రామనర్సు ఎం. ఏ.. ప్రిన్సిపాలు, ప్రభుత్వ కళాశాల, వరంగల్లు | అద్దె |
| 98. బి. వేం. శే. | శ్రీ బిదురు వేంకటశేషయ్య బి. ఏ.. ప్రధానాంధ్రోపాధ్యాయుడు, మహబూబు కాలేజి హైస్కూలు, సికిందరాబాదు | అభినయ దర్పణము |
| 99. బు. అ. శా. | తర్కరత్న, న్యాయ వేదాంత విద్యాప్రవీణ శ్రీ పండిత బులుసు అప్పన్నశాస్త్రి భట్న వెల్లి, తూర్పుగోదావరి జిల్లా | ఆద్వైతము |
| 100. బు. వేం. | శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ఎం. ఏ.. ఆంధ్రోపన్యాసకుడు, పి. ఆర్. కాలేజీ, కాకినాడ | అనుభవ మూలవాదము |
| 101. బు. సు. | శ్రీ బుఱ్ఱా సుబ్బారాయుడు బి.ఏ., ఎల్, ఎల్.బి., అడ్వకేటు, హైదరాబాదు | ఆపత్సితి చట్ట నిర్మాణము |
| 102. బే. వి. | డా. బేతనభట్ల విశ్వనాథం, ఎం.ఏ., పి.హెచ్.డి., రీడరు, గణితశాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | ఆయిలర్ |
| 103. భో. ప. | డా. భోగరాజు పట్టాభిసీతారామయ్య, గవర్నరు. మధ్యప్రదేశ్, నాగపూరు | ఆంధ్ర జాతీయ కళాశాల |
| 104. మ. జ. రా. | శ్రీ మహీధర జగన్మోహనరావు. 4147 పై గ్రాంరోడ్డు, రాజమహేంద్రవరము | ఆఫనాసినికితిన్ |
| 105. మ. సూ. శా. | 'అభినవ వాగ నుశాసన' శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రి, ఆంధ్రాచార్యులు (రిటైర్డు), ఆంధ్ర విశ్వవిద్యాలయము, ధవళేశ్వరము | ఆరణ్యకములు |
| 106. మా. వేం. రం. | శ్రీ మామిడిపూడి వేంకటరంగయ్య, ఎం. ఏ., రిటైర్డు ప్రొఫెసరు ఆఫ్ పాలిటిక్సు, బొంబాయి యూనివర్సిటీ, హైదరాబాదు | అంతర్జాతీయ సంస్థలు |
| 107. మొ. కృ. | శ్రీ మొక్కపాటి కృష్ణమూర్తి, చిత్రకారులు, ఏలూరు | ఆంధ్రులు - చిత్రకళ |
| 108. రా. ప్ర. | శ్రీ రామచంద్ర ప్రసాదు, ఎం. ఏ., లెక్చరరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము , హైదరాబాదు | 1. అమెరికను ఇండియనులు 2. ఆదిమజనుల సంస్కృతులు |
| 109. రా. సు. | ప్రొఫెసర్ రాళ్ళబండి సుబ్బారావు, ఎం. ఏ. ఎల్. టీ.. గౌరవ కార్యదర్శి, ఆంధ్ర హిస్టారికల్ రిసర్చి సొసైటీ, రాజమహేంద్రవరము | 1. ఆంధ్రదేశ చరిత్రము II (625-1323) 2. ఆంధ్రేతిహాస పరిశోధకమండలి |
| 110. వ. బ్ర. | శ్రీ వసంతరావు బ్రహ్మాజీరావు, అడ్వకేటు, విజయనగరము. | ఆదిభట్ల నారాయణదాసు |
| 111. వా. రా. బ్ర. | శ్రీ వారణాసి రామబ్రహ్మం, ఎం. ఏ.. లెక్చరరు, కాలేజి, అమలాపురము | అంతర్వేది |
| 112. వి. ఎల్ . కె. | శ్రీ వంగీపురం లక్ష్మీకాంతం, ఎం. ఏ., లెక్చరరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. అంక గణితము 2. అంకములు |
| 113. వి. జ. | శ్రీ వి. జగన్నాథరావు, ఎం. ఎస్. సి,, జూఆలజీ, లెక్చరరు, సైన్సు కాలేజి, హైదరాబాదు | ఆనువంశికము |
| 114. వి. భ. | డా. విశ్వేశ్వరభట్టు, ఎం, ఏ., లెక్చరరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అరవిందుడు |
| 115. వి. వ. న. | వింజమూరి వరాహ నరసింహాచార్యులు, సంగీత విద్వాన్, కాకినాడ | అష్టోత్తర శతతాళములు |
| 116. వే. చం. | శ్రీ వేలూరి చంద్రశేఖరం, బి. ఏ, చిరివాడ | అరవిందుడు |
| 117. వే. తి. వేం. రా. | పండిత శతావధాని శ్రీ వేదాల తిరుమల వేంకటరామానుజస్వామి, ఆయుర్వేదాచార్య, ఆయుద్వేద కళాపరిషత్తు, హైదరాబాద్ | 1. అంటువ్యాధులు (ఆయుర్వేదము) 2. ఆయుర్వేద ధర్మములు |
| 118. వే. శి. శా. | శతావధాని శ్రీ వేలూరి శివరామశాస్త్రి, చిరివాడ | ఆర్ష భూగోళము |
| 119. వై. వి. ఆర్. | శ్రీ వై. విఠలరావు ఎం. ఏ., బి. ఇడి, హిస్టరీ లెక్చరరు, డబ్లియు, జి. బి. కాలేజి, భీమవరము | ఆంధ్రదేశ చరిత్రము 1
(క్రీ. శ. 625 వరకు) |
| 120. శ్రీ. శ్రీదేవి | డా. శ్రీపతి శ్రీదేవి ఎం.ఏ., పి.హెచ్.డి., ప్రిన్సిపాలు, మహిళాకళాశాల, హైదరాబాదు | 1. ఆఖిలేశ్వరవాదము 2. అభ్యసన మనస్తత్వము |
| 121. సి. ఎస్. ఆర్. | శ్రీ సి. శ్రీనివాసరావు, శ్రీ రాజరాజేశ్వరి ఫిల్ము కంపెనీ, మద్రాసు | ఆంధ్ర సినిమా పరిశ్రమ |
| 122. సో. రా. | సోమరాజు రామదాసు, బి. ఏ. ఎం. ఇ- డి., ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్సు, నల్లగొండ | అరిస్టాటిల్ (జీ) |
| 128. హెచ్. కె. షె. | శ్రీ హరూన్ ఖాన్ షెర్వాణి ఎం. ఏ.. (ఆక్సను) ఎఫ్. ఆర్. హెచ్. ఎన్. బార్. ఎట్ లా., రిటైర్డు ప్రిన్సిపలు, నిజాం కాలేజి, హైదరాబాదు | ఆల్బెరూని |
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse