Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొండ వేంకటప్పయ్య

వికీసోర్స్ నుండి

కొండ వేంకటప్పయ్య :
కీ. శే. దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులుగారు ఆంధ్రజన మణిహారమున నాయకమణియై వరలెను. పంతులుగారి వినయసంపత్తి, మానవ సేవాసక్తి, స్వతంత్ర కార్యాచరణశక్తి, దేశ సేవానురక్తి, ధైర్యోత్సాహ స్వార్థత్యా గౌదార్యములు మున్నగు నుత్తమ గుణములు వారు న్యాయవాది శిరోమణిగా, రాజకీయతంత్రవిశార దుడుగా, ఆంధ్రోద్యమ జనకుడుగా, దేశభక్తాగ్రేసరు డుగా రూపొందుటకు ప్రకృష్టోపకారకములయ్యెను. గుంటూరు పట్టణమునందు ఒక బ్రాహ్మణ వంశము నందు కొండ అప్పయ్య అను మహాశయుడు ఉదయమం దెను. అతడు వాసిరెడ్డి వారి సంస్థానమున రాజోద్యో గిగా నుండెను. అతని కొడుకు కోటయ్య. ఆతనికి పిత్ర ముగా 15 ఎకరముల భూమి సంక్రమించెను. దాని పై రు. 80 ల ఆదాయము మాత్రమే లభించుచుండుటచే, ఆత డొక వైశ్యు నొద్ద ఉద్యోగిగ పనిచేయుచు తిమ్మ రాజు గోపాలరావుగారి కూతురు బుచ్చమ్మ యను నామెను పెండిలియాడెను. ఆమె పరమసాధ్వి. సూర్యా రాధనతత్పర. రవిని జూచి గాని కుడువ నొల్లనిది. కాల క్రమమున బుచ్చమాంబా కోటయార్యుల నోములపంటలై వేంకటప్పయ్య, సూర్యనారాయణ, ఆదినారాయణ అను ముగ్గురు కుమారు లుదయించిరి. వారిలో వెంకటప్పయ్య

గారి శుభ జనన దినము 1866 సంవత్సరము ఫిబ్రవరి 2వ శుక్ర వారము. బుచ్చమ్మ తన 30వ యేటనే పరమ పదించెను. ఉపనీతులై యున్న వేంకటప్పయ్యగారే తల్లి గారి పరలోక క్రియలను నిర్వర్తించిరి.

పువ్వు పుట్టగ నే పరిమళించు నన్నట్లు వేంకటప్పయ్య గారు విద్యాభ్యాసదశ నుండియే తమ ప్రతిభను ప్రదర్శింప దొడగిరి. వారు తొలుదొల్త ఒక మౌల్విగారి పాఠశాలలో ఉరుదు భాష నభ్యసించిరి. పిదప ఒక ఆంగ్లేయ పాఠ శాలలో ఆంగ్ల భాషాభ్యాసము నారంభించిరి. 1883 సం. డి సెంబరు మాసమున రాజమహేంద్రవరములో మెట్రిక్యు లేషను పరీక్షయందు కృతార్థులైరి. అంతకు పూర్వము ననే పంతులుగారు ఒక పాఠశాలా వార్షికోత్సవ సందర్భ మున తమ వినోదకర సంభాషణ కౌశల్యముచే సభ్యు లను హర్షాశ్చర్య మగ్నుల నొనర్చిరి. ప్రతి కథ్యయందును ఉన్నత శ్రేణిలో కృతార్థత నొందుచు నిరంతర విద్యార్థి వేతనమును, పుస్తకరూప బహుమానములను పొందు చుండిరి. రాజమహేంద్రవరమున నున్నప్పుడు వారికి కీ. శే. కందుకూరి వీరేశలింగముగారి దర్శనలాభము చేకూరెను. ఆంధ్ర భాషాధ్యాపకులగు కొండుభట్ల సుబ్ర హ్మణ్య శాస్త్రిగారి ప్రోత్సాహముచే, తెలుగు నాట కములలో ప్రముఖమైన స్త్రీ పాత్రను సమర్థతతో నటించి ప్రేక్షకుల ప్రశంసలను చూరగొనిరి.

తమ సహపాఠియగు చంద్రశేఖరమను నాతనికి చికిత్స

చేయించిన సందర్భమున కుగ్లరు దొరసానితో వారికి పరిచయ మేర్పడెను. ఆమెయొక్క సంఘసేవ, దైవభక్తి మున్న గుగుణములచే ఆకృష్టులైన పంతులుగారు క్రైస్తవ మతాభిమానులు కాసాగిరి. క్రైస్తవమత ప్రవిష్టులయి యుందురు; కాని శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారి చే బోధితులై క్రైస్తవమత స్వీకరణోద్యమమునుండి విముఖులై 8. ఉన్నత విద్యాభ్యాసము: పంతులుగారికి క్రైస్తవ మతమునందు జనించిన అభిరుచి పెంపొందు అవకాశము లేకుండ తండ్రిగారు వారిని ఎఫ్. ఏ. తరగతిని రాజ మహేంద్రవరములో చదువునట్లు ఏర్పాటు కావించిరి. కాని ఎఫ్. ఏ. రెండవ సంవత్సరపు చదువు సాగించుటకు పంతులుగారు మద రాసులో క్రైస్తవ కళాశాలలో ప్రవే శించి, మితవ్యయ మొనర్చుచు, కుగ్లరు దొరసానిగారు తమకు పంపదొడగిన విద్యార్థి వేతనమును సహపాఠియగు చంద్ర శేఖరమున కొసగుచు, అఖండమైన ఔదార్యమును ప్రకటించిరి. అచటి విద్యార్థిదశయందే వారు తెనుగున కవిత్వము వ్రాయదొడగిరి. బి. ఏ. పరీక్షలో కృతార్థులు కాకముందే వారు లింగమగుంట కోదండ రామయ్య గారి కన్యారత్నము, వేంకట సుబ్బమ్మగారిని ధర్మపత్నిగా స్వీకరించుట తటస్థించెను.

బి. ఏ. తరగతిలో చదువుచున్న కాలముననే వేంక టప్పయ్యగారు కళాశాల విద్యార్థి సంఘ చర్చలలో అగ్ర గణ్యులుగ పేరొందిరి. ఉపన్యాసకరణమున లబ్ధవర్ణులై 8. షేక్స్పియరు నాటక ప్రదర్శనావసరములలో తాము స్వీక రించిన పాత్రకు అనుగుణముగ ఉచ్చారణ మొనర్చుచు, హావభావాదిక ముల ప్రదర్శిం చుచు, నిరుపమానమైన ప్రజ్ఞా కాలమును ఆవిష్కరించిరి. అత్తరి వారు అలవరచుకొనిన సుగుణగణమే ఉత్తరకాలమున ఉ త్తమన్యాయవాదిగ నిర్మించుకొనిన కీర్తిసౌధ మునకు పునాదియై వరలెను. ఒక నాడు ప్రొఫెసరు లాయిడ్ అనునాతడు బైబిల్ పాఠము చెప్పుచు హిందూమతమును దూరిన కార వారు ణముగా విద్యార్థుల చే గొప్పస మై జరుపబడెను. ఆ సమ్మెయందు అత్యుత్సాహ ధైర్యములతో ప్రధాననాయకత్వమును వహిం చిన వారు పంతులుగా రే.

1887 సంవత్సరము డిసెంబరులో అచట జరిగిన భారత కాంగ్రెసు తృతీయ సమావేశ సందర్భమున పంతులుగారు ఐచ్ఛికభటులుగా స్వీయకృత్య నిర్వహణమున అత్యంత సామర్థ్యమును వ్యక్తీకరించిరి. పై సందర్భములలో పంతులుగారు అల వరచుకొనిన గుణములే, నిరుపమానమైన వారి భావి దేశ నాయకత్వమునకు రాచబాట పై చినవి.

బి.యల్. పరీmఫలితములు తెలియకమున్నే పంతులు గారు సబ్ రిజిస్ట్రారుగా నియమింపబడిరి. కాని వారు దానిని స్వీకరింపక, న్యాయశాస్త్ర పట్టభద్రులయిన వెంటనే బందరులో తమ న్యాయవాద వృత్తికి విఘ్నే శ్వరపూజ గావించిరి. పంతులుగారి హస్తము పరుస వేదియై వారు పట్టిన దెల్ల బంగారమగు చుండెను. ప్రప్రథ మమున వారొక ఖూనీ కేసునందు ముద్దాయి పక్షమున ప్రచండముగ వాదించి గడించిన అఖండ విజయమే పిదప న్యాయవాదిగా వారికి చేకూరిన కీర్తి ప్రతిష్ఠలకు జయ పతాక యయ్యెను. చిత్రము - 8

న్యాయవాద వృత్తి నవలంబించిన మూడు సంవత్సర ములకు పిదప వెంకటప్పయ్యగారు కృష్ణాజిల్లా కాంగ్రె సుకు సభ్యులుగను, కార్యదర్శి గను పనిచేయుచుండిరి. 1896లో కృష్ణానది వరదలు కారణముగా అవనిగడ్డ తాలూకా గ్రామములు నీటిలో మునిగి పోయెను. ఐన నేమి ! పంతులుగారు అకుంఠిత ధైర్య స్థైర్య సమయస్ఫూర్తులతో వలసిన ద్రవ్యమును భూరివిరాళ రూపమున ప్రోగుచేసి, బాధిత గ్రామజనులకు పడవల పై నెత్తిం చిన సరకులను స్వయముగా సరఫరా చేయించి తమ దయా మయత్వమును, అప్రతిహతో త్సాహమును, కర్తవ్యదీక్షను, మానవ సేవాతత్పరతను ఆవిష రించిరి. అట్లే ఒకతూరి రాయల సీమలో కరువు సంభవించగా, అచటికి వారు స్వయముగా వెళ్ళి పర్యటించి, చవుక బియ్యపు దుకాణములను ఏర్పాటు గావించి, నూతులు, వలు త్రవ్వించు నిర్మాణ కార్యకలాపములందు పరిశ్ర మించి తమ ప్రజాహితైక తత్పరతను వెల్లడించిరి.

కృష్ణాజిల్లానుండి గుంటూరుజిల్లా కొత్తగా ఏర్పడిన పిదప పంతులుగారు గుంటూరునందే న్యాయవాదిగా ప్రవే శించి అచటి న్యాయవాదుల సమాజములో విరాజమాను లైరి. గుంటూరుజిల్లా కాంగ్రెసు అధ్యక్ష పదవి నలంకరించి బాలురకును, బాలికలకును పాఠశాలలందు ఉచిత విద్యను, మధ్యాహ్న భోజనమును ప్రభుత్వమువారు ఒనగూర్ప వలయునను ఆశయమును ఉద్ఘాటించిరి. పిదప గుంటూరు పురపాలక సంఘ సభ్యులై ప్రభుత్వమువారు చూపిన ఆ పణల కన్నింటికిని తగురీతి సమాధానములను వ్రాసి, పురపాలక సంఘము రద్దుకాకుండ వారించిరి. వెంకటప్పయ్యగారు చేపట్టని కార్యముగాని. చేపట్టి విజయము గాంచని కార్యముగాని లేదనుట అతియోశ క్తి కాజాలదు. వారి సంఘ సంస్కరణోద్యమ దీక్షకు వారి ఆధ్వర్యమున బందరు నందు జయప్రదముగ జరిగిన ప్రథమ వితంతూద్వాహము తార్కాణము. వారు కృష్ణాపత్రి కను స్థాపించి స్వయముగా జయప్రదముగా దానిని నడిపిరి. లంచము గై కొన్న ఒక మేజిస్ట్రేటుపై ధర్మరక్ష ణార్థము హైకోర్టు వరకు కేసును నడిపి, అందు విజయ మును సాధించిరి. స్త్రీ విద్యా వ్యాప్తి విషయమున పంతు లుగా రొనర్చిన కృషి ప్రశంసా పాత్ర మైనది. శారదా ని కేతనమును స్థాపించు తలంపున వారు వేనవేల రూపా యీలను చందాగా వేయించి, ఆ జాబితాను, ఆ యుద్యమ నిర్వహణమును ఉన్నవ లక్ష్మీనారాయణ గారికి ఒప్పగిం చిరి. ఆ సంస్థ స్థాపింప బడిన తోడనే, వారు దాని అధ్యక్ష పదవి నధిష్ఠించిరి. తత్పురోభివృద్ధి న పేక్షించి 200 ఎకర ముల భూమిని తమ ధర్మపత్ని చేత భూదానముచేయించిరి. ఆంధ్రోద్యమము : పంతులవారి స్వార్థత్యాగము సాటి లేనిది. మహాత్మగాంధీ శంఖారావ మొనర్చుటకు 15 సంవ త్సరములకు పూర్వమే (1915) వారు న్యాయవాద వృత్తిని త్యజించి దేశహితైక కార్యవ్యగ్రులైరి. ఆకా మున ప్రభుత్వము వారి కట్టడి మిక్కిలి కఠినముగ నున్నను లెక్కింపక, వారు 1907 లో తెనాలిలో జరిగిన స్వదేళో ద్యమ సభకు అగ్రాసనాధిపత్యమును నిర్భయముగ వహిం చిరి. విదేశీయ వస్త్ర బహిష్కార మందును, స్వదేశీయ వస్తుపరిగ్రహణ మందును వారు ప్రజలను ప్రోత్సహించిరి.

గుంటూరులో వింజమూరి భావనాచార్యుల వారి ఇంట ఆంధ్రోద్యమము ఆరంభ మయ్యెను. ఆ సమా వేశ మందు పంతులుగా రే అధ్యక్షులయిరి. ఆంధ్రోద్యమమును

గూర్చి ఆంధ్రము నందును, ఆంగ్లము నందును గ్రంథము లను రచించిరి. గుంటూరు జిల్లా కాంగ్రెసు సంఘము ఏర్పడి నప్పుడు దానికి పంతులుగారే అధ్యక్షులయిరి. 1913 లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు పంతులుగారు ఆహ్వాన సంఘాధ్యక్షులుగా నుండిరి. ఆంధ్ర రాష్ట్ర తీర్మానము వాయిదా పడగా, ఉద్యమ ప్రచారమున కొక స్థాయీసంఘము నేర్పరచి, దానికి పంతులుగారు కార్యదర్శియై కార్యకలాపములను నిర్వ హించిరి. డా. భోగరాజు పట్టాభి సీతారామయ్యగారితో పాటు 1918లో రాయలసీమలో ఆంధ్రోద్యమ ప్రచార మొనర్చిరి. పెద్దిభొట్ల వీరయ్య, అయ్యదేవర కాళేశ్వర రావు, అయ్యంకి వెంకట రమణయ్యగార్ల కృషికి ఫలిత ముగా విజయవాడలో (1914) జరిగిన రెండవ ఆంధ్ర మహాసభలో పంతులుగారు ప్రచారసంఘపు పర్యట నానుభవములను నివేదించిరి. 'మహానంది' విద్యార్థి మహా సభలో ఆంధ్రరాష్ట్ర నిర్మాణమును గూర్చి వివరించిరి. మూడవ, నాలుగవ ఆంధ్ర మహాసభలు విశాఖపట్టణము (1915), కాకినాడ (1916)లలో జరిగెను. పంతులుగారు స్థాయీసంఘము యొక్క కార్యదర్శిగా, ప్రచార సంచా రక నివేదికలను సమర్పించిరి. నెల్లూరులో జరిగిన 5వ ఆంధ్రరాష్ట్ర మహాసభకు పంతులుగారే అధ్యక్షత వహిం చిరి. అందు ఆంధ్రరాష్ట్ర స్థాపనకు అనుకూలముగా తీర్మానము గావింపబడెను. 6వ ఆంధ్రరాష్ట్ర మహాసభ పంతులుగారి కృషి ఫలితముగా కడపలో జరి గెను. రాజకీయ జీవితము : మద్రాసులో విద్యార్థిగా నున్న ప్పుడు అక్కడ జరిగిన అఖిలభారత కాంగ్రెసు మహా సభలో ఐచ్ఛిక భటుడుగా పంతులుగారు ప్రారంభించిన రాజకీయ జీవితము అఖిలభారత కాంగ్రెసు అధ్యక్షు పదవికి దారి తీసినది. వారు జెయిలు కేగినపుడు మాత్రము కీ. శే. టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారి స్థానమున రాష్ట్ర కాంగ్రెసు అధ్యములుగా నుండిరి. ఈ పదవిని పంతులుగారు బుద్ధిపూర్వకముగా వదలుకొనిరి నాగపూరు కాంగ్రెసు సభలో (1920) కార్యవర్గ సభ్యు డుగా పంతులుగారు ఎన్నుకొనబడిరి. బెల్గాములో (1924) జరిగిన కాంగ్రెసు సభవరకును తమ సభ్యత్వమును అక్యంత సమర్థతతో నిర్వహించిరి. వారు గాంధిజీ చెప్పిన ప్రతి A మాటకు తలయూపువారు కారు. తనకు అసమ్మత మైన విషయమును ధైర్యముతో వ్యక్త పరచెడివారు.

హోంరూలు సమితి సభ్యులుగా పంతులుగారు డా. అనిబిసెంటుతో ఢిల్లీకి వెళ్ళి మాంటేగు - చెమ్స్ ఫర్డులను దర్శించిరి. ఉన్నవ లక్ష్మీనారాయణగారి నిర్బంధమునకు అసమ్మతిగా వర్తకులచే వారము దినములు జయప్రద ముగా సమ్మెచేయించిరి. ఇది యొక అపూర్వసంఘటనము. ఆబ్కారీ పాటలను పాడవలదని గుంటూరు మేజి స్ట్రేటు గారి ఎదుట వర్తకులకు ప్రబోధించిరి. కాంగ్రెసు ఎన్నిక లను బహిష్కరించిన సందర్భమున పంతులుగారు రాష్ట్ర మంతటను ప్రచార మొనరించిరి. పంతులుగారి సహాయ నిరాకరణ ప్రచారము మూలముననే బులుసు సాంబ మూర్తి వంటి వా రెందరో తమ న్యాయవాద వృత్తులను విసర్జించిరి. పన్నుల నిరాకరణోద్యమమును (1920), బార్డోలీ ఉద్యమమునకు దీటుగా పెదనందిపాడులో జరి పించిరి. ఆ యుద్యమమును విరమింపుడని గాంధిజీ వ్రాసి నను, పంతులుగారు అది బహుదూరము సాగినదనియు, అట్టి దశయందు దానిని ఆపివేయుటయే సంభవించు నెడల, ఆంధ్రదేశము కాంగ్రెసునుండి తొలగవలసి వచ్చుననియు ఖండితముగా చెప్పిరి. వారి ధైర్య సాహసము అట్టివి ! కాంగ్రెసు కార్య నిర్వాహక సభ అమృతసర్ లో జరిగి నపుడు పంతులుగా రచటికి అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులుగా వెళ్ళిరి. నాడు అకాలీల శాసనోల్లంఘ నపు టూరేగింపులో కాంగ్రెసు కార్యవర్గమువారు కూడ పాల్గొనిరి. గాంధీజీ దండిగ్రామములో ఉప్పు సత్యాగ్రహము జరిపినపుడు పంతులుగారు నూరుమంది కాంగ్రెసు కార్యకర్తలచే తమ ఆవరణములో ఉప్పు తయారుచేయించి అమ్మించిరి. అఖిలభారత చరఖాసంఘపు శాశ్వత సభ్యుడుగా. ఆంధ్రరాష్ట్ర చరఖాసంఘపు అధ్యక్షు డుగా, ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సంఘపు అధ్యక్షు డుగా పంతులుగారి సేవ ఎంతయు ప్రశంసాపాత్రము. బాపుజీ ఖద్దరు నిధి కొరకు ఆంధ్రరాష్ట్రమున సంచారము చేసినపుడు పంతులుగారు వారికి కంటి రెప్పవలె వర్తించిరి. వీరు పెక్కుసారులు కారాగారశిక్ష ననుభవించిరి.

శాసన సభ్యత్వము : పంతులుగారు గుంటూరు, కృష్ణా, గోదావరిజిల్లాల ప్రతినిధిగా శాసనసభకు ఎన్నుకొనబడిరి. వీరు శాసనసభలో చాల కృషిసల్పి విషయములను సమ గ్రముగ తెలిసికొని, ఆవశ్యకమగు అంశముల నన్నిటిని పూస గ్రుచ్చినట్లు శ్రుతపరచెడువారు. శాసనసభ యందు ప్రభుత్వ బలమే హెచ్చయ్యెను. అయినను వారు త్రికరణ శుద్ధితో, దేశ సేవా దీక్షతో గ్రంథాలయముల కొరకు ప్రభుత్వ సహాయ మర్థించుచు, ప్రతిపాదించిన బిల్లును ఆమోదించియు, స్త్రీలు విద్యాలయములందు చదువ కయే పరీక్షలలో వ్రాయవచ్చునని ప్రతిపాదించిన బిల్లును మొదట వ్యతి రేకించినను, తుదకు ఆమోదించియు పంతులు గారిని బ్రిటిష్ ప్రభుత్వమువారు గౌరవించిరి. వారు 1936 లో శాసనసభ్యులై గుంటూరు నియోజక వర్గము నకు సేవచేసిరి. కాంగ్రెసులోని అక్రమములను గాంధీ, నెహ్రూ మున్నగు ప్రముఖ నాయకులకు తెలియజేసి, కాంగ్రెసును పరిశుద్ధ మొనర్ప ప్రయత్నించిరి.

అట్టి మహనీయులు, వినయధనులు, ప్రతిభావిలసితులు, మానవ సేవా ధురంధరులు, ధైర్యోత్సాహ, ఉదారాది ప్రశస్త గుణగణ విరాజితులు, దేశ హితైకతత్పరులు, ఆంధ్రోద్యమ జనకులు, 'దేశభక్త' బిరుద శోభితులుఅయిన శ్రీ వెంకటప్పయ్యగారు 1949వ సంవత్సరమున ఆగస్టు 15 వ తేదీయందు దేశ ప్రజలకు స్వాతంత్ర్యదిన సందేశ మొసగి, ఆ పర్వదినముననే దేశీయులను అపారశోక వారిధియందు ముంచి భౌతిక దేహమును త్యజించి నిరు పమ కీర్తి కాయముతో పరమపదమందిరి.