విక్రమార్కచరిత్రము/పుట121

వికీసోర్స్ నుండి

ద్యానైపుణ్యము మీఱ నీగుణవిలాసాకారరేఖాదుల
న్వేనోళ్ళన్ గొనియాడఁగా విని రసోన్మేషంబు సంధిల్లగన్.

20


వ.

పంచశరశరప్రపంచచంచలాయమానమానసమై యుండునంత.

21


తే.

సిద్ధపుర మేలురాజు ప్రసిద్ధబలుఁడు
శకమహీనాథచంద్రుఁ డాచంద్రవదన
నడుగఁ బుత్తెంచి యీకున్న నాగ్రహించి
యేపున విదర్భుమీఁద దండెత్తఁదలఁచె.

22


వ.

కావున.

23


క.

హరువరమున జనియించిన
వరపుత్త్రిక యగుననంగవతి ననురాగ
స్ఫురణమ్మున వరియించుట
కరణీయము నీకు నిపుడు కరుణాభరణా.

24


క.

నావుడు నాకార్యము వసు
ధావల్లభుఁ డెంతయేని తాత్పర్యముతోఁ
గావింప నియ్యకొనుటయు
నావిబుధమునీంద్రముఖ్యుఁ డరిగెను బిదపన్.

25


క.

వేసవివేఁడి సహింపక
వేసఱుజీవులకు నెల్ల విశ్రాంతికర
శ్రీసంపాదనమై
యాసన్నంబయ్యె నంబుదాగమ మంతన్.

26


సీ.

గగనరత్నము కట్టుమొగులతో నుదయించెఁ
        జరమదిక్కునఁ దోఁచెఁ శక్రధనువు
పూర్వాపరవ్యాప్తిఁ బొలుపారె జలరేఖ
        లాలోలగతి వీచె మూలగాలి