వాడుకరి:రహ్మానుద్దీన్\Test5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గుత్తా

ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు


ప్రచురించిన వారు ఇందూ జ్ఞాన చేదిక (Regd.No. : 168/2004)

త్రైత శకము - 34 ప్రథమ ముద్రణ : సం ॥ 2012 ప్రతులు : 1000

వెల: 30/-
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యోగీశ్వరుల వారి సంచలనాత్మక రచనలు
ఇందూ జ్ఞానవేదిక ప్రచురణలు

  1. త్రైత సిద్ధాంత భగవద్గీత.
  2. గీతా పరిచయము (తెలుగు,ఇంగ్లీషు
  3. ధర్మము-అధర్మము.
  4. ఇందుత్వమును కాపాడుదాం.
  5. యజ్ఞములు (నిజమా-అబద్దమా?
  6. దయ్యాల-భూతాల యదార్థసంఘటనలు.
  7. సత్యాన్వేషి కథ.
  8. మంత్రము-మహిమ (నిజమా-అబద్దమా
  9. శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా.
  10. ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.
  11. కలియుగము (ఎప్పటికీ యుగాంతము కాదు
  12. జనన మరణ సిద్ధాంతము.
  13. మరణ రహస్యము.
  14. పునర్జన్మ రహస్యము.
  15. త్రైతాకార రహస్యము (త్రైతాకార బెర్ముడా
  16. కథల జ్ఞానము.
  17. సామెతల జ్ఞానము.
  18. పొడుపు కథల జ్ఞానము.
  19. తత్త్వముల జ్ఞానము.
  20. తిట్ల జ్ఞానము-దీవెనల అజ్ఞానము.
  21. గీతం-గీత (పాటల జ్ఞానము
  22. తత్త్వార్థ బొమ్మల జ్ఞానము.
  23. దేవాలయ రహస్యములు.
  24. ఇందూ సాంప్రదాయములు.
  25. మన పండుగలు (ఎలా చేయాలో తెలుసా?
  26. జ్యోతిష్యశాస్త్రము (శాస్త్రమా-అశాస్త్రమా?
  27. వాస్తు శాస్త్రము (సత్యమా-అసత్యమా
  28. తల్లి తండ్రి.
  29. గురు ప్రార్థనామంజరి.
  30. త్రైతారాధన.
  31. సమాధి.
  32. ప్రబోధ.
  33. సుబోధ.
  34. ప్రసిద్ధి బోధ.
  35. సుప్రసిద్ధి బోధ.
  36. సిలువ దేవుడా?
  37. మతాతీత దేవుని మార్గము.
  38. దేవుని గుర్తు 963, మాయ గుర్తు 666.
  39. మతము-పథము.
  40. ప్రబోధానందం నాటికలు.
  41. ఇందువు క్రైస్తవుడా?
  42. త్రిత్వమా? ద్విత్వమా?
  43. నిగూఢ తత్త్వార్థ బోధిని.
  44. ఆత్మలింగార్థము.
  45. నాస్తికులు-ఆస్తికులు.
  46. హేతువాదము-ప్రతివాదము.
  47. గుత్తా.
  48. ప్రబోధ తరంగాలు.
  49. త్రైత సిద్ధాంతము.
  50. రూపము మారిన గీత.
  51. ఉపనిషత్‌లలో లోపాలు.
  52. బైబిల్‌లో (ఇందు
  53. ఖురాన్‌లో (ఇందు
  54. ద్రావిడ బ్రాహ్మణ.
  55. తీర్పు.
  56. కర్మ పత్రము.
  57. ప్రవక్తలు ఎవరు?
  58. ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత.
  59. ధర్మశాస్త్రము ఏది?
  60. మత మార్పిడి దైవద్రోహము.
  61. త్రైతశక పంచాంగము.
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యోగీశ్వరుల వారి సంచలనాత్మక ప్రసంగాలు
DVD, VCD's

  1. సంతకము
  2. సాంప్రదాయము
  3. త్రైతశకము
  4. కోడిపుంజు-పాదరసము
  5. యుగము-యోగము
  6. నైజం-సహజం
  7. ఆత్మకు వెంట్రుక గుర్తు
  8. పైత్యం-సైత్యం
  9. శైవము-వైష్ణవము
  10. ఇందూమహాసముద్రము
  11. సృష్ఠి-సృష్ఠికర్త
  12. కాయ-పండు-కాయ
  13. జ్ఞానము-విజ్ఞానము
  14. వార-మాస-వత్సర
  15. సేకూవలి-కూలిసేవా
  16. ధర్మము-అధర్మము
  17. ఏక్‌నిరంజన్‌-అలక్‌నిరంజన్‌
  18. గురువులేని విద్య గ్రుడ్డివిద్య
  19. బట్టతల
  20. భగవంతుడు
  21. ద్రావిడులు-ఆర్యులు
  22. ప్రభువు-ప్రభుత్వం
  23. భూతం-మహాభూతం
  24. ప్రభు-ప్రజ
  25. యాదవ్‌
  26. పుస్తకము-గ్రంథము
  27. వెలుగుబంటు
  28. ప్రకృతి-వికృతి
  29. మాట-మందు
  30. ఏకత-ఏకాగ్రత
  31. హరికాలు-హరచేయి
  32. పుట్టగోసి-మొలత్రాడు
  33. 1 2 3 గురుపౌర్ణమి
  34. చమత్కార ఆత్మ
  35. క్షమించరాని పాపము
  36. మాయకుడు-అమాయకుడు
  37. మరణము-శరీరము
  38. ఎదమీదముద్ర-తల్లి తండ్రి గుర్తు
  39. ద్వితీయుడు-అద్వితీయుడు
  40. బయటి సమాజం-లోపలి సమాజం
  41. సేవా శాతము
  42. ప్రపంచ శ్రద్ధ-పరమాత్మ శ్రద్ధ
  43. శ్రీకృష్ణాష్టమి
  44. దేవునిజ్ఞానము-మాయమహత్యము
  45. తల్లి తండ్రి
  46. తల్లి తండ్రి-గురువు దైవము
  47. సమాధి
  48. మతము-పథము
  49. కలియుగము
  50. దివ్యఖురాన్‌-హదీసు
  51. పుట్టుట-గిట్టుట
  52. తల్లి
  53. గోరు-గురు
  54. కర్మ మర్మము
  55. ఆత్మ
  56. తాత
  57. గురుపౌర్ణమి
  58. ఇందువు-హిందువు
  59. శ్రీకృష్ణజన్మ మధుర
  60. ఆత్మపని
  61. కర్మ లేని కృష్ణుడు-కర్మ ఉన్న కృష్ణుడు
  62. త్రైత సిద్ధాంతము
  63. సహజ మరణం-తాత్కాలిక మరణం
  64. స్త్రీ-పు / లింగము
  65. ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు
  66. దేశం మోసం-దేహం మోహం
  67. యోగీశ్వరుల జన్మదిన సందేశము
  68. జీర్ణ+ఆశయము
  69. మేఘం ఒకభూతం-రోగం ఒకభూతం
  70. దేవునికి మతమున్నదా?
  71. ఇచ్ఛాధీన కార్యములు-అనిచ్ఛాధీన కార్యములు
  72. ఏది ధర్మము
  73. అధర్మ ఆరాధనలు
  74. మూడు పుట్టుకలు-రెండు జాగాలు
  75. పుట్టినరోజు ఎవ్వరికీ రాదు
  76. నిదర్శ-నిరూప
  77. నటించే ఆత్మ
  78. సంచిత కర్మ
  79. గురువు ఎవరు?
  80. శ్రీకృష్ణుడు ఎవరు?
  81. సుఖము-ఆనందము
  82. టక్కుటమారా, ఇంద్రజాల మహేంద్రజాల, గజకర్ణ గోకర్ణ
  83. భయం
  84. దశ-దిశలు
  85. ఆడిరచే ఆత్మ
  86. స్వార్థ రాజకీయం (స్వ+అర్థ రాజకీయం)
  87. మూడు నిర్మాణాలు-ఒక పరిశుభ్రత
  88. ఏది శాస్త్రము?
  89. తెలుగులో మూడు-ఆరు-తొమ్మిది
  90. 6-3=6

భాషలో పాండిత్యమును విడిచి, భావములో
పాండిత్యమును చూచువాడు నైజమైన జ్ఞాని.

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఇందూ జ్ఞానవేదిక ప్రచురణలు లభించు చిరునామా


ప్రబోధాశ్రమము (శ్రీకృష్ణమందిరము)
చిన్నపొడమల (గ్రా), తాడిపత్రి (మం), అనంతపురం (జిల్లా) A.P.
Cell: 9866512667, 9951675081, 9948191506, Phone : 08558-225966.
ఇందూ జ్ఞానవేదిక
(రాష్ట్రకార్యాలయము) Phone : 040-24146006.
శ్రీదేవికాంప్లెక్స్‌, ప్రభాత్‌నగర్‌, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, హైదరాబాద్‌
9848057951, 9491877239, 9848590172.

పి. నాగయ్య (ప్ర.సభ్యుడు)
ఇ.నెం.76/97/29, కోట్లనగర్‌ ప్రక్కన, వీకర్‌ సెక్షన్‌ కాలనీ, కర్నూలు (జిల్లా).
cell : 9440244598, 9849303902,

బాలం లక్ష్మీనరసింహులు (ప్రెసిడెంట్‌)
కదిరి రోడ్డు, రాజానగర్‌, నీరుగట్టువారి పల్లి, మదనపల్లి, చిత్తూరు జిల్లా.
Cell : 9440825533, 8519938999.

పోటు వెంకటేశ్వర్లు (గురూజీ)
ధన్వంతరి హెల్త్‌ కేర్‌ సెంటర్‌,
 హుజూర్‌నగర్‌, నల్లగొండ (జిల్లా)
Cell  : 9848574803, 9502932941.

పి. ఆదినారాయణ (ప్ర.సభ్యుడు)
భాగ్యనగర్‌ ముద్దిరెడ్డి పల్లి (గ్రా॥), హిందూపురం (తా), అనంతపురం (జిల్లా).
cell : 9440745800, 7259851861.

కె.లక్ష్మినారాయణాచారి (ప్రెసిడెంట్‌)
బ్యాటరీషాప్‌, నియర్‌ ఎస్‌.ఐ.యు చర్చి, మార్కెట్‌స్ట్రీట్‌, ధర్మవరం, అనంతపురం (జి)
Cell :9440556968, 9290012413,

అనమల మహేశ్వర్‌ (ప్రెసిడెంట్‌)
చవటపాల్యం (గ్రా), గూడూరు (మం), నెల్లూరు జిల్లా.
Cell  : 9494631664, 9490809181, 8106065300.

డా॥యం. వెంకటేశ్వర రావు (ప్రెసిడెంట్‌)
డోర్‌ నెం. 24-4-178, గోవింద నిలయం,
శాంతినగర్‌, నెల్లూరు జిల్లా-524003.,
Cell  : 9440615064, 9246770277.

టి. వీరనారాయణ రెడ్డి (ప్ర.సభ్యుడు)
బట్టేపాడు గ్రా॥ ఆత్మకూరు మం॥, నెల్లూరు (జిల్లా).,
Cell : 9494618322, 8374923363

బి. ఆదిశేషయ్య (టీచర్‌) (ప్రెసిడెంట్‌)
రామానుజం స్కూల్‌ దగ్గర, ఉప్పరవీధి, గుత్తి, అనంతపురం (జిల్లా)
Cell  : 9491362448, 7382986963.

ఎన్‌.బి. నాయక్‌ (ప్ర.సభ్యుడు)
పెదమడక, అగనంపూడి,విశాఖపట్నం (జిల్లా)
Cell: 7396492239, 9248315309

డా॥బి. ధర్మలింగాచారి (ప్ర.సభ్యుడు)
శ్రీ కనక మహాలక్ష్మి క్లినిక్‌,
(S కోట), విజయనగరము (జిల్లా).
Cell: 08966-275208, 9704911737

వి. శంకర రావు (ప్ర.సభ్యుడు)
అశోక్‌నగర్‌, కొత్తపేటవాటర్‌ ట్యాంక్‌, విజయనగరము (జిల్లా).
Cell : 9703534224, 9491785963.

ఎ. నాగేంద్ర (ప్రెసిడెంట్‌)
కమ్మపాలెం వీధి, క్రొత్త చెరువు (గ్రా, మం)
అనంతపురం జిల్లా. Cell : 9493622669,
9959316410, 9949995090.

రౌతు శ్రీనివాసరావు (ప్రెసిడెంట్‌)
ఏటుకూడు రోడ్‌, దర్గామాన్యం, గుంటూరు (జి)
Cell : 9948014366, 9052870853

డి. బాలాజీ (వైస్‌ ప్రెసిడెంట్‌)
బంగారు పాళ్యం (గ్రా), చిత్తూరు జిల్లా.
Cell: 9985483241, 7396077408.

వై. రేణుక దేవి (ఇ.సభ్యులు)
పద్మావతినగర్‌, తిరుపతి.
Cell : 9491773455, 9032903955.

వి.సి.వర్మ (గురూజీ) ఆనందాశ్రమము
మజ్జివలస (గ్రా, పోస్టు), భీమిలి (మం), విశాఖపట్నం (జిల్లా) ` 531162.
Cell: 9441567394, 9502172711.

ఇందూ జ్ఞానవేదిక శాఖ
మద్దిగట్ల (గ్రా), పెద్దమందడి (మం),
మహబూబ్‌నగర్‌ (జిల్లా).
Cell : 8790558815, 9440655409,9701261165.

ఎన్‌.వి. రామకృష్ణ (ప్ర.సభ్యుడు)
మెయిన్‌ రోడ్డు, బొద్దాం (గ్రా),
రాజాం (మం), శ్రీకాకుళం (జిల్లా).

టి. ఉదయకుమార్‌ (ప్రెసిడెంట్‌)
మోటుపల్లివారి వీధి, బుధవారము మార్కెట్‌, భీమవరం-1, పశ్చిమగోదావరి.
Cell: 9948275984, 7386433834.




ఎన్‌.వి. రామకృష్ణ (ప్ర.సభ్యుడు)
మెయిన్‌ రోడ్డు, బొద్దాం (గ్రా),
రాజాం (మం), శ్రీకాకుళం (జిల్లా).
Cell : 9494248963, 9959779187.

టి.వి. రమణ (ప్రెసిడెంట్‌)
ముదిగుబ్బ (గ్రా, మం), కదిరి (తా),
అనంతపురం జిల్లా-515511.
Cell : 9440980036, 8185020272.

వి. రామక్రిష్ణన్‌ (వైస్‌ ప్రెసిడెంట్‌)
నిరంజన్‌ టైమ్స్‌, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదురుగా,
నేతాజిరోడ్డు కుప్పం, చిత్తూరు జిల్లా
Cell : 9652755110.


ఈ పుట ఆమోదించబడ్డది


గుత్తా
‘‘గు’’ అనగా రహస్యము అని అర్థము. జగతిలో అత్యంత రహస్యమూ, అన్నిటికంటే పెద్దదీ, ఎవరికీ తెలియనిదీ ఒకే ఒకటి కలదు. అదియే దైవము. ప్రపంచములో ఇంతవరకు ఎవరికీ తెలియని రహస్యము దైవము మాత్రమే. ఎవరికీ తెలియని రహస్యము దైవము అయినప్పుడు దైవమును గురించి ఎవరైనా ఎలా చెప్పగలరు? అని ప్రశ్న రాగలదు. దానికి జవాబుగా ఎవరూ చెప్పలేరనియే చెప్పవచ్చును. దైవమును గురించి ఎవరూ చెప్పలేనప్పుడు, దేవుని గురించి మనుషులకు ఎలా తెలియునని కూడా ప్రశ్న రాగలదు. దానికి జవాబుగా ఒకేమాటను చెప్పవచ్చును. అదేమనగా! దేవున్ని గురించిన జ్ఞానమును దేవుడే తెల్పాలి తప్ప ఏ మనుషులూ చెప్పలేరని ఏకధాటిగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఒక చిక్కు సమస్య వచ్చి పడుతుంది. అదేమనగా! దేవుడు ఎవరికీ తెలియని వాడేకాక, ఆయనకు రూపముగానీ, పేరుగానీ, పనిగానీ ఏమాత్రము లేవు. రూప, నామ, క్రియలులేనపుడు, ఒక క్రియ (పని) అయిన జ్ఞానము తెలియజేయడమును దేవుడు చేయడు కదా! అంతేకాక ఆకారము, పేరు లేనివాడు ఎలా చెప్పగలడు? ఆకారమున్నవాడు చెప్పితేగాని అర్థముకాని మనుషులకు, ఆకారము లేకుండా మాటల రూపముతో చెప్పుటకు వీలుకాదు. ఈ విధముగా పేరులేనివాడు, ఆకారమే లేనివాడు, పనియే చేయనివాడు దైవ జ్ఞానమును తెలుపుటకు అవకాశమే లేదు. అటువంటపుడు దేవునికి తప్ప ఎవరికి తెలియని దేవుని జ్ఞానము, మానవులకు ఎలా తెలియునని ఎవరైనా అడుగవచ్చును. ఇటు చూస్తే నుయ్యి (బావి) అటు చూస్తే గొయ్యి (గుంత) అన్నట్లున్న ఈ ప్రశ్నకు జవాబు చెప్పడము చాలాకష్టము. ఎంత యోచించినా జవాబే దొరకని ఈ ప్రశ్నకు చివరకు దేవుడే జవాబు చెప్పాలి. ఆ విధానము ప్రకారమే మా యోచనకు ఒక జవాబు దొరికింది. అదేమనగా!
ఈ పుట ఆమోదించబడ్డది


దేవుడు దేవునిగా ఎప్పటికీ తన జ్ఞానము చెప్పడు. అయితే దేవుడు దేవునిగా కాకుండా మరొక రకముగా చెప్పుటకు అవకాశమున్నది. మరొక విధానముగా అంటే ఎలాగ అని యోచిస్తే, భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున 15వ శ్లోకమున ‘‘సర్వస్య చాహం హృది సన్ని విష్టో మత్తః స్స్మృతిర్‌ జ్ఞాన మపోహనంచ’’ అన్నట్లు సర్వ మానవుల హృదయముల నున్న దేవుడే అందరికీ జ్ఞప్తిని, జ్ఞానమును, ఊహలను అందిస్తున్నాడు (దేవుడు దేవునిగా కాకుండా ఆత్మగా ఈ పనిని చేయుచున్నాడు.) నా యోచనకు కూడా నా శరీరములో హృదిస్థానములోనున్న ఆత్మయే ఒక ఊహను జవాబుగా అందించింది. అదేమనగా!)

దేవుని జ్ఞానము భూమిమీద అవసరమైనపుడు, దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. కావున దేవుడు స్వయముగా చెప్పకుండా మరొక విధానమును అనుసరించి చెప్పును. ఆ విధానము ప్రకారము దేవుని జ్ఞానమును ఏ మనిషీ చెప్పకుండా దేవుడే చెప్పినప్పటికీ, దేవుడు స్వయముగా చెప్పినట్లు కూడ ఉండదు మరియు మనిషి స్వయముగా చెప్పినట్లు ఉండదు. కనిపించే మనిషే దేవుని జ్ఞానమును చెప్పినప్పటికీ, లోపలనుండి చెప్పినవాడు మనిషికాదు (జీవుడు కాదు). అలాగే లోపలనుండి చెప్పినవాడు దేవుడూ కాదు. ఈ విధానము ప్రకారము ఇటు మనిషి చెప్పినట్లుగానీ, అటు దేవుడు చెప్పినట్లుగానీ కనబడదు. ఇప్పుడు ఇటు మనిషీ చెప్పక, అటు దేవుడూ చెప్పక ఎవరు చెప్పారు అను ప్రశ్న రాగలదు కదా! దానికి సమాధానము ఇలా కలదు. దేవుని జ్ఞానము భూమిమీద ఏ మనిషికీ తెలియదు, కావున మనిషి చెప్పాడనుటకు వీలులేదు. అలాగే దేవుడు ఏ పనినీ చేయడు, కావున మనిషిలోనుండి దేవుడు చెప్పాడనుటకూ వీలులేదు. అందువలన దేవుడు ప్రత్యేకమైన విధానమును ముందే ఏర్పరచి
ఈ పుట ఆమోదించబడ్డది


దాని ప్రకారము చెప్పగలిగాడని చెప్పవచ్చును. ఆ ప్రత్యేక విధానమును వివరించుకొని చూస్తే ఇటు మనిషీకాక, అటు దేవుడూకాక, మనిషికీ దేవునికీ మధ్యలో ఆత్మ ఒకటున్నది. దేవుడు విశ్వములో జీవరాసులను సృష్ఠించినపుడే తనకూ (దేవునికి), జీవునికీ (మనిషికీ) మధ్యలో ఆత్మను ముందే పథకము ప్రకారము సృష్ఠించాడు. చాలామంది జ్ఞానులకు, భక్తులకు జీవుడు దేవుడు అన్న రెండు పదములే ఎక్కువగా తెలుసుగానీ మధ్యలోనున్న ఆత్మను గురించి తెలియదు. ఆత్మ అను పదము అనేక సందర్భములలో పలుకబడుచున్నప్పటికీ, దానిని కొందరు దయ్యముగానో లేక కొందరు దేవుడుగానో అనుకొనుచుందురు. కొందరు అజ్ఞానులు ఆత్మను దయ్యముగా చెప్పుకొంటే, కొందరు జ్ఞానులు ఆత్మను దేవునిగా చెప్పుకొనుచుందురు. ఎవ్వరు ఎలా చెప్పుకొనినా ఆత్మ ఇటు జీవుడూ కాదు, అటు దేవుడూ కాదు.

ఆత్మ ఎప్పుడూ జీవునికి తోడుగా ఉండునట్లు దేవుడు సృష్ఠించాడు. ఒక సజీవ శరీరములో జీవుడు ఉండగా, జీవునికి తోడుగా ఆత్మకూడా ఉన్నది. ఒక శరీరములోనున్న ఆత్మను గురించి ఆధ్యయనము చేయడమునే ఆధ్యాత్మికము అంటారు. ఇప్పుడు ఆత్మను గురించి పూర్తిగా తెలుసు కోవాలంటే పూర్తి ఆధ్యాత్మికము అవుతుంది. ఇప్పుడు అంత అవసరము లేకుండా ప్రస్తుతానికి ఎంత అవసరమో అంతమాత్రమే ఆత్మను గురించి తెలుసుకొందాము. ఇంతవరకు ఆత్మ ఎవరి అంచనాకు దొరకలేదనియే చెప్పవచ్చును. బాగా జ్ఞానము తెలిసిన వ్యక్తి వద్దకు పోయి ఆత్మను గురించి అడిగితే, దానిని అంతరాత్మ అని అంటారనీ, ఆత్మ శరీరము లోపల ఉంటుందని చెప్పాడు. అతను ఆత్మను గురించి తెలిసినట్లు చెప్పినా, ఆయన మాట పూర్తి సత్యమే అన్నట్లు అగుపించినా, వాస్తవానికి ఆత్మ శరీరములోపల
ఈ పుట ఆమోదించబడ్డది


దాగియున్న అంతరాత్మకాదు. అది శరీరము మీద బాహ్యముగా ఉండునదే. జీవాత్మ (జీవుడు) మాత్రము శరీరములోపల ఎవరికీ కనిపించక ఉండును. అందువలన అంతరాత్మ అనుమాట జీవాత్మకు వర్తించునుగానీ, ఆత్మకు వర్తించదు. ఇట్లు ఆత్మ విషయములో ఎందరో పొరపాటుపడుచున్నారు. ఎవరు ఏమనుకొనినా జీవాత్మకు తోడుగా ఆత్మ ప్రతి శరీరములో ఉన్నది. ప్రపంచములో ఒకవ్యక్తి ఉన్నాడు అంటే అతనిలో ఒక జీవాత్మ, ఒక ఆత్మ రెండూ జోడు ఆత్మలుగా ఉండునని తెలియవలెను. ఇదే సూత్రము ప్రతి ప్రాణికి వర్తించును. భూమిమీద ప్రతి వ్యక్తిలోనూ, ఏ మతస్థుని శరీరములో అయినా జీవాత్మ ఆత్మలు ఉండును. శరీరమునంతటిని పై వరకు ఆక్రమించి శరీరమును మాట్లాడిరచునది, ఆట్లాడిరచునది, కదిలించి పని చేయించునది ఆత్మకాగా, జీవుడు శరీరములోపల కనిపించని జాగాలో ఉండి బయటనుండి వచ్చు కష్టసుఖములను అనుభవించుచుండును. అయితే ఇంతవరకు అన్ని పనులు చేయునది ఆత్మేనని, జీవాత్మ ఏ పనినీ చేయడములేదనీ ఎవరికీ తెలియదు. జీవుడే అన్ని పనులూ చేస్తున్నాడని అందరూ అనుకోవడము జరుగుచున్నది. ఈ విధముగా విచిత్రముగా ఎవరికీ తెలియకుండా అన్ని పనులు చేయుచున్న ఆత్మను ప్రతి శరీరములో దేవుడు ఉంచాడు.

దేవుడు ఆత్మకంటే పరాయిగా (వేరుగా) ఉన్నాడు. కావున దేవున్ని పరమాత్మ అనవచ్చును. ఆత్మకంటే వేరుగానున్న పరమాత్మ తన జ్ఞానమును ఆత్మచేత మనుషులకు చెప్పించునట్లు ముందే ఏర్పాటు చేసినది. మనుషులకు అవసరమొచ్చినప్పుడు ఆత్మ దేవుని జ్ఞానమును చెప్పుచున్నది. జీవునికి దేవునికి మధ్యలోనున్న ఆత్మ, దేవుని జ్ఞానము చెప్పడము వలన దేవుడు తన జ్ఞానమును స్వయముగా చెప్పినట్లు కాకుండాపోయినది. ఆత్మ మనిషిలో నుండి చెప్పడము వలన పైకి మనిషి చెప్పినట్లు కనిపించినా, చెప్పే మనిషికి
ఈ పుట ఆమోదించబడ్డది


పడదు. అంతా ఆయన ఇష్టము. మనిషి అయిన కృష్ణుని శరీరమునుండి జ్ఞానమును బోధించునపుడు నేనే పరమాత్మనని కూడ దేవుడు తెలియజేశాడు. అది ఒక నిరూపణ నిమిత్తము తన విధానమును తెలియుటకు అలా తెలిపాడు. ద్వాపరయుగములో కృష్ణుని శరీరమునుండి తెలుపబడిన విషయమును బట్టి, దేవుడు మనిషిలో ఆత్మనుండి మాట్లాడగలడని రుజువు కాబడిరది.

దేవుడు తన జ్ఞానమును ఐదువేల సంవత్సరముల పూర్వము ద్వాపర యుగమున శ్రీకృష్ణుని శరీరమునుండి బోధించాడు. తర్వాత కూడా ఒకమారు అదే విధముగా బోధించాడని తెలియుచున్నది. తర్వాత కూడా మరొక మారు బోధించవలసిన అవసరమున్నది. దేవుడు మూడుమార్లు భూమి మీదకు వస్తే ఆయన పూర్తిగా తన ధర్మములను బోధించినట్లగును. రెండు మార్లు తన ధర్మములను జ్ఞానరూపములో తెలిపినప్పటికీ, మానవులు వాటి వివరమును గ్రహించలేరు. కనుక మూడవ మారువచ్చి తాను చెప్పిన వాటికి పూర్తి వివరమును తెలియజేయును.

ఇప్పటి వరకు దేవుని ధర్మములు భూమిమీద రెండుమార్లు బోధించ బడినప్పుడు మనుషులే కాకుండా గ్రహరూపములో మరియు భూతముల రూపములోనున్న కొందరు విని, వాటిని భూమిమీద ముఖ్యమైన వ్యక్తులకు కొందరికి బోధించారు. అయితే వారు కొన్ని ధర్మములను చెప్పినప్పటికీ వాటి వివరము తమకు తెలియదనీ, వాటి వివరము దేవునికే తెలియునని చెప్పారు. దూత అని పిలువబడు భూతములు లేక గ్రహలచేత తెలుసుకొన్న వ్యక్తులు తాము విన్న బోధలను వక్తలుగా ఇతరులకు చెప్పినప్పుడు, వీటి అంతరార్థము భవిష్యత్తులో రాబోయేవారు తెలియగలరని చెప్పారు. దీనిని
ఈ పుట ఆమోదించబడ్డది


బట్టి దూతల ద్వారా విన్న వక్తలు కూడా కొన్ని వాక్యముల పరమార్థము తమకు తెలియదనియే చెప్పారని తెలియుచున్నది. ఈ విధముగా దేవుడే కాకుండా దేవుడు చెప్పినప్పుడు వినిన సూక్ష్మ (కనిపించని) గ్రహములు కూడా దూతల పేరుతో భూమిమీద అక్కడక్కడ కొందరికి తెలిపినట్లు అర్థమగుచున్నది.

ద్వాపర, కలియుగములలో దేవుడు కనిపించే మనిషినుండి రెండు మార్లు చెప్పినా, అదే జ్ఞానమునే కనిపించని గ్రహములు, దేవదూతలు అనుపేరుతో మనుషులకు చెప్పినా, చెప్పిన జ్ఞానమంతయు మతాలుగా మారిపోయినది. కానీ చెప్పబడిన జ్ఞానము యొక్క వివరము మాత్రము ఎవరికీ తెలియకుండాపోయినది. దేవుని జ్ఞానమును మాయ మతములుగా మార్చివేయడము వలన ఒకే దేవుని జ్ఞానము మతముల రూపములో వేరువేరుగా కనిపిస్తున్నది. అలా కనిపించుట వలన వేరువేరు మతములకు వేరువేరు దేవుడన్నట్లు ఆయా మతముల వారికి అర్థమైనది. ఈ విధముగా దేవుని జ్ఞానము మతములుగా చీలిపోయి ఒకే దేవుని జ్ఞానమే కొందరికి భగవద్గీతయనీ, కొందరికి బైబిల్‌ అనీ, మరికొందరికి ఖురాన్‌ అని తెలియ బడినది. అలాగైనప్పటికీ వారివారి గ్రంథములలోని వాక్యములకు అర్థము మాకు తెలియునని ఆయా మతములవారు అనుకొనినా, వాస్తవానికి వాటి పరమార్థము మాత్రము ఎవరికీ తెలియదు. భగవద్గీతలోగానీ, బైబిలులోగానీ, ఖురాన్‌లోగానీ గల వాక్యములకు దేవుడే వివరము చెప్పవలసివున్నది. దేవుడు చెప్పిన జ్ఞానమును దేవుడే వివరించి చెప్పువరకు ఏ మతము వారికైనా వారి గ్రంథములలోని అంతరార్థము తెలియదు. నేటికాలములో కొన్ని మతములలోని పండితులు, స్వామీజీలు తమ గ్రంథముల జ్ఞాన వివరము అంతా తెలియునని చెప్పుచుండినా, సూటిగా వేయు ప్రశ్నలకు
ఈ పుట ఆమోదించబడ్డది


జవాబులు చెప్పలేక తికమకపడుచుందురు. తమ లోపమును బయట పడకుండునట్లు తగిన ప్రయత్నములు చేయుచుందురు. కొందరు తమకు తెలిసినదే సత్యమని మొండిగా వాదించుచుందురు. అన్ని మతములలోను జ్ఞానులున్నా వారిది సరిjైున జ్ఞానముకాదని అర్థమైపోయినది. అంతే కాకుండా అన్ని మతములలోను అజ్ఞానము తారా స్థాయికి పెరిగిపోయి, మతద్వేషములు ఎక్కువయిపోయి, ఒక మతమువారు మరొక మతము వారిమీదికి భౌతిక దాడులకు దిగుచున్నారు. ఒకరికొకరు ప్రాణాంతకముగా తయారైనారు. ఇటువంటి పరిస్థితి కొంతకాలముగా కొనసాగుచున్నది.

ప్రపంచములో ఎన్ని మతములుండినా అన్నిటికంటే ముందునుండి ఉన్న మతము ఇందూ (హిందూ) మతము. ఇందూ మతము అనునది సృష్ఠి ఆదిలో దేవుడు జ్ఞానమును బోధించినప్పటినుండి ఏర్పడినది. ఇందూ మతము ఎప్పుడు పుట్టిందో స్పష్టముగా చెప్పలేము. ఐదువేల సంవత్సరముల పూర్వము ద్వాపరయుగం చివరిలో కృష్ణుడు దేవుడు ఆదిలో చెప్పిన జ్ఞానమే చెప్పాడు. కృష్ణుడు చెప్పిన గీతాజ్ఞానమే దేవుడు చెప్పిన జ్ఞానముగా ఉండినప్పటికీ, మాయ ప్రభావము చేత కొందరు మనుషులు వ్యాసుడు వ్రాసిన వేదములే గొప్పవని చెప్పడము జరిగినది. కొంతకాలమునకు కేరళ రాష్ట్రములో పుట్టిన ఆదిశంకరాచార్యులు దైవజ్ఞానమును అద్వైత సిద్ధాంత రూపముగా చెప్పడము జరిగినది. తర్వాత కొంత కాలమునకు తమిళనాడు రాష్ట్రములో పుట్టిన రామానుజాచార్యులు విశిష్ట అద్వైత (విశిష్టాద్వైత) సిద్ధాంతమును ప్రతిపాదించి చెప్పడము జరిగినది. ఆ కాలములో అద్వైతము వారూ, విశిష్టాద్వైతము వారూ ఒకరికొకరు మాది గొప్ప, మాది గొప్ప అని ఘర్షణపడినట్లు చరిత్ర కలదు. తర్వాత కొంత కాలమునకు కర్ణాటక రాష్ట్రములో పుట్టిన మధ్వాచార్యులు ద్వైతసిద్ధాంతమును
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రతిపాదించాడు. ఆదిశంకరాచార్యులు కేవలము 32 సంవత్సరములు మాత్రము జీవించగలిగి, చిన్నవయస్సులోనే అద్వైతమును ప్రచారము చేయగా తర్వాత 197 సంవత్సరములకు వచ్చిన రామానుజాచార్యులు 120 సంవత్సరములు బ్రతకగలిగి, విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశాడు. తర్వాత 100 సంవత్సరములకు వచ్చిన మధ్వాచార్యులు 79 సంవత్సరములు బ్రతకగలిగి తన ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశాడు. మధ్వాచార్యుల తర్వాత 633 సంవత్సరములకు (1950) ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు జన్మించి 27 సంవత్సరముల వయస్సునుండి త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించి ప్రచారము చేయగలిగాడు. ఈ విధముగా ఇందూ (హిందూ) మతములో నలుగురు ఆచార్యులు దైవజ్ఞానమును వారి వారి సిద్ధాంతములను ఆధారము చేసుకొని బోధించారు.

ముఖ్యవిషయమేమనగా! శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వా చార్యుల సిద్ధాంతములు తెలియును, కానీ వారి వ్యక్తిగత జీవితములు నాకు తెలియవు. అయితే చివరి సిద్ధాంతకర్త అయిన ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల యొక్క జీవితము పూర్తిగా నాకు తెలియును. ఎందుకనగా ప్రబోధానంద యోగీశ్వరులు అనబడు వ్యక్తి నాకు బాగా తెలుసు కనుక ఇంతవరకు ఏమి జరిగినది అన్నీ తెలియును. నాకు తెలిసి ప్రబోధానంద యోగీశ్వరులు సర్వసాధారణ మనిషి. బయట కనిపించే ఏ ప్రత్యేకతా ఆయనలో లేదు. అయితే ఆయన శరీరములో నివసించే ఆత్మ ఏదో ప్రత్యేకమైనదని చెప్పవచ్చును. ఒక ప్రక్క ఆయనకు తన ఆత్మ గొప్పదని అనిపించినా మరొక ప్రక్క అది నా భ్రమ అనుకొనేవాడిని. ఆయన ఆత్మ గొప్పదైతే ఆయన జీవితము సగటు మనిషికంటే హీనముగా ఎందుకు మొదలయింది? ఆయన ఎందుకు ఆర్థిక ఇబ్బందుల పాలైనాడు? ఎవరూ
ఈ పుట ఆమోదించబడ్డది


అతనికి విలువ నివ్వక హేళనగా ఎందుకు చూచేవారు? సమాజములో ఏ గుర్తింపూ లేని పూర్తి అజ్ఞానులైన తల్లితండ్రులకు ఎందుకు పుట్టాడు? ముఖ్యముగా ఆయన తల్లియే ఆయనను గురించి చెడుగా ఎందుకు చెప్పేది? ఆయన బంధువులు ఎవరితోను ఆయనకు ఎందుకు సంబంధములేదు? ఆయనను ఆయన బందువులు ఎగతాళిగ, చులకన భావముతో ఎందుకు మాట్లాడేవారు? యుక్తవయస్సులో ఆయనకు ఆమ్మాయినిచ్చే దానికి ఆయన కులస్థులు ఎందుకు వెనుకాడేవారు? చివరకు తెలివి తక్కువ అమ్మాయి మరియు మూర్చ రోగమున్న అమ్మాయిని ఎందుకు వివాహమాడవలసి వచ్చినది? అటువంటి భార్యకూడా ఆయనకు ఏమాత్రము విలువనివ్వకుండ మాట్లాడుచు ఆయనను వదలి ఎందుకు వెళ్ళిపోయింది? తన కులముకాని అమ్మాయిని అతను రెండవ భార్యగా చేసుకోవడమేమిటి? ఇప్పటికీ తల్లి ప్రక్క బంధువులుగానీ, తండ్రి వైపు బంధువులుగానీ, భార్యవైపు బంధువులు గానీ ఆయనతో ఎందుకు సంబంధము పెట్టుకోలేదు? ఆయనవద్దకు ఏ బంధువూ ఎందుకు రావడములేదు? ఇలా ప్రశ్నించుకొంటే ఎన్నో ప్రశ్నలు రాగలవు. ఇన్ని ప్రశ్నలను చూచిన తర్వాత ఆయనను ఎవరూ సమర్థించరు, శుద్ద పనికి మాలిన వానిక్రిందికి జమకట్టుదురు. ఇదంతయు ఒకవైపునుండి చూస్తే ఆయన సక్రమమైన మనిషి కాదు అని ఎవరైనా చెప్పగలరు.

మరొకవైపునుండి ఉన్న వాస్తవికతను చూస్తే ఆయనయందు ఏ లోపమూలేదు. ఆయన పుట్టినది ఏ గుర్తింపూలేని అజ్ఞానులకు, అంతేకాక తల్లిదొకదారి, తండ్రిదొకదారిగా బ్రతికేవారు. తల్లితండ్రులు తిండి కొరకే బ్రతికేదన్నట్లు ఏమాత్రము ముందు చూపులేకుండా తిండికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అటువంటి పరిస్థితిలో ఆయనకు యుక్తవయస్సు వచ్చేటప్పటికి ఏమాత్రము ఆస్తిలేనందువలన సమాజములో గౌరవము లేని
ఈ పుట ఆమోదించబడ్డది


స్థితి ఏర్పడినది. తల్లితండ్రులు పెద్దమ్మ అను గ్రామదేవతను ఇంటి దేవతగా పూజించేవారు. అందువలన అదే పేరునే పుట్టిన బిడ్డలకు పెట్టెడివారు. ఆ పద్ధతిలోనే నేడు ఆచార్య ప్రబోధానందయోగీశ్వరులుగా ఉన్న ఆయన అందరిచేత పెద్దన్నగా పిలువబడెడివాడు. పదహారు సంవత్సరముల వయస్సులోనే తల్లితండ్రులు విడిపోవడము వలన తల్లిని పోషించే బాధ్యత ఆయన మీదే పడిరది. తల్లిని పోషిస్తూ 1969 మే నెలకు ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి (పదకొండవ తరగతి) ని పూర్తి చేయగలిగి, అదే సంవత్సరము బ్రతుకు తెరువు నిమిత్తము మిలిటరీలో ఒక భాగమైన ఆర్మీలో చేరి దాదాపు మూడు సంవత్సరములు అందులో చేయగలిగాడు. బ్రతుకుతెరువు కొరకు ఆర్మీలో పని చేయుచున్నప్పటికీ అక్కడ ఆఫీసర్‌లతో సమానముగా ఆఫీస్‌లోనే పని ఉండేది. అక్కడి ఆఫీసర్‌లందరు ఎంతో పరిచయముగా ఉండేవారు. అటువంటి స్థితిలో పెద్దన్న అను ఆయన అప్పుడప్పుడు దైవజ్ఞానమును గురించి అక్కడి అధికారులకు సమయము దొరికినప్పుడంతా చెప్పెడివాడు. ఆ సందర్భములో ఈ ఉద్యోగము నాకు సరిపోదు, నేను బయటి మనుషులలో ఉండి వారికి ఎంతో జ్ఞానము చెప్పవలసివుంది అని చెప్పెడివాడు. ఆ రెజి మెంట్‌లో ఉన్న అధికారులు ఆ మాటకు స్పందించి ఆయనను ఆర్మీనుండి బయటకు పంపించడము జరిగినది.

ఉద్యోగము వదలి బయటికి పోతే ఎలా బ్రతుకుతావు అను ప్రశ్న ఒకటి వేధిస్తున్నా, దానికి సమాధానమును వెదకకుండానే ఉద్యోగము నుండి బయటికి వచ్చి ఎంతో శ్రమపడవలసివచ్చినది. కర్నాటకలో ఒక సంవత్సర కాలము వ్యవసాయము చేయవలసివచ్చినది. తర్వాత తప్పనిసరిగ ప్రవేట్‌ కంపెనీలో క్లర్క్‌ ఉద్యోగమును చేయవలసివచ్చినది. మనస్సుకు నచ్చని పని అయినందున దానిని కూడా ఆరునెలలకే వదలివేయడము జరిగినది.
ఈ పుట ఆమోదించబడ్డది


తర్వాత ఒకవైపు తల్లిని పోషిస్తూ, వైద్య వృత్తిని చేస్తూ ప్రజలతో సంబంధము ఏర్పరుచు కొని వచ్చిపోయేవారికి కొంత జ్ఞానమును చెప్పేవాడు. ఆయనవద్ద ఎంత పెద్ద రోగములైనా సులభముగా నయమైపోయేవి. వైద్యవృత్తితో అంతో ఇంతో డబ్బు వచ్చేది, ఆ సందర్భములో వచ్చినవారికి రోగములు కర్మలనుబట్టి వస్తాయని జ్ఞానమును చెప్పుటకు అవకాశము ఉండేది. తనకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా జీవితము మాత్రము సుఖముగా సాగి పోయేది. ఆయన ఎంత సుఖముగా బ్రతికినా, ఎంత తెలివిగలవాడైనా ఆయన కులమువారు ఆయనను ఆస్తిలేనివాడని హేళనగ చూచెడివారు. ఒక విధముగా సమాజములో ఆస్థిలేనివాడైనా ధైర్యముగా బ్రతికెడివాడు. ఎక్కడా నేర్వకనే ఆయనకు వైద్యము, జ్యోతిష్యము వచ్చెడివి. వాటితో ప్రజల సంబంధము ఏర్పరుచుకొని ఎన్నో వైద్యములను చేయడము జరిగినది. ఆయనకు నేను ఏమీ తెలియనివాడిని కదా! అని ఒక ప్రక్క అనిపిస్తున్నా, ఒకప్రక్క అన్నీ తెలిసినవాడిగా అప్పటికప్పుడు వచ్చిన యోచన ప్రకారము వైద్యము చేసెడి వాడు. దానితో ఎక్కడా నయముకాని రోగములు బాగైపోయేవి. అలాగే ఎవరైన జ్యోతిష్యమును గురించి అడిగితే తాను ఏమి చెప్పితే అదే జరిగేది. ఇట్లు తక్కువ కాలములోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇది బ్రతుకు తెరువే అయినా తనకు ఆ పని నచ్చక తాను ఆ వృత్తిని చేయకుండా ఇతరులచేత చేయించెడివాడు. ఆ సమయములోనే ప్రబోధ అను గ్రంథమును వ్రాసి తనకు పరిచయమున్న ఒక ఆశ్రమములోని స్వామీజీకి చూపడము జరిగింది. ఆ స్వామిజీ దానిని చూచి ఆశ్చర్యపోయి ఇంతటి జ్ఞానమున్న వానికి గురువు తప్పకుండా ఉండాలి, నేను ఉపదేశమిస్తాను తీసుకోమన్నాడు ఆ స్వామిగారు ఒక మంత్రమును చెప్పి అదే ఉపదేశమన్నాడు. అంతేకాక నీకొక పేరును
ఈ పుట ఆమోదించబడ్డది


పెట్టుతానని చెప్పి, ప్రబోధానందా అని చెప్పడము జరిగినది. తల్లితండ్రులు పెట్టినపేరు పెద్దన్న అయితే ఆధ్యాత్మికములో గురువు పెట్టిన పేరుగా ఈ పేరునుంచుకోమని చెప్పడము జరిగినది.

అప్పటినుండి పెద్దన్న అను పేరు పూర్తిగా లేకుండా పోయినది. ప్రపంచ వ్యవహారములలో గుత్తా ప్రబోధానంద చౌదరిగా వ్యవహరించగా ఆధ్యాత్మిక విద్యలో ప్రబోధానందగా ప్రారంభమై తర్వాత కొంత కాలమునకు ప్రబోధానంద యోగీశ్వరులుగా చెప్పబడినది. ఒక స్వామివద్ద మంత్రో పదేశమును తీసుకొనినా, ఆ మంత్రమును ఆయన ఎన్నడూ జపించలేదు. మంత్రములు ఉపదేశములుకావు అని ముందునుంచి చెప్పుచున్న ఆయన గురువు పెట్టిన పేరును తీసుకొన్నాడుగానీ, మంత్రమును తీసుకోలేదు. ఆయన వైద్య వృత్తి ద్వారా ప్రజలలో కొంత పేరును సంపాదించుకొనినా సాటి కులములోగానీ, సాటి బంధువులలోగానీ ఏమాత్రము గుర్తింపు లేకుండెడిది. తన 25 సంవత్సరము నుండి వైద్యవృత్తిని చేయడముగానీ, జ్యోతిష్యమును చెప్పడముగానీ చేయలేదు. ఒకే ఒక దైవజ్ఞానమును తప్ప దేనినీ చెప్పనని అనుకొన్నాడు. అప్పటినుండి ఎవరికైనా ప్రాణాపాయస్థితిలో వైద్య సలహాను చెప్పాడుగానీ, వైద్యమును చేయలేదు. అలాగే జ్యోతిష్యము తెలిసినా ఎవరికీ చెప్పలేదు. తనకు ఎన్నో విద్యలు తెలిసినా ఏ విద్యనూ వాడుకోక సర్వసాధారణముగా బ్రతుకుచూ ఎవరి నుండి డబ్బును ఆశించక, జ్ఞానమును గ్రంథరూపములో వ్రాస్తూ తనకు తెలిసిన వ్యాపారములను చేస్తూ చేయిస్తూ కాలమును సాగించెడి వాడు. మనుషులలో సామాన్య మనిషిగా, ఏ గుర్తింపూ లేకుండా బ్రతుకుచూ ఆయన వ్రాసిన గ్రంథములలో కొన్ని సందర్భములలో ప్రబోధానంద యోగీశ్వరులుగా తన పేరును వ్రాయడము జరిగినది. కొంత కాలమునకు భగవద్గీత గ్రంథమును
ఈ పుట ఆమోదించబడ్డది


అడిగితే, వ్రాసేదిగానీ, చెప్పేదిగానీ నేను కాదు నాకు తోడుగా ఉన్న ఆత్మ అని చెప్పేవాడు. అన్ని పనులు ఆత్మే చేయుచున్నదని అందరికీ చెప్పేవాడు.

త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు అను పేరుతో త్రైత సిద్ధాంత భగవద్గీతను వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక విద్యలో ఎన్నో రహస్యములను చాలా గ్రంథముల రూపముతో వ్రాయడము జరిగినది. గ్రంథములను చదివిన వారు అందరూ ఇవి చాలాగొప్ప గ్రంథములనీ, ఇంతవరకు మాకు తెలియని జ్ఞానము తెలిసినదనీ చెప్పెడివారు. చదవని వారు త్రైత సిద్ధాంతము అంటూనే ఇదేదో క్రైస్తవులకు సంబంధించినదని అసూయగా చూడడమేకాక, ప్రబోధానంద యోగీశ్వరులను క్రైస్తవ బోధ చేయుచున్నావా అని నిందించెవారు. ఇంకా కొందరు హిందువుల ముసుగులో క్రైస్తవమతమును ప్రచారము చేయుచున్నారని ఆరోపించేవారు. విశ్వహిందూ పరిషత్‌లాంటి హిందూమతసంస్థల మనుషులు చాలామార్లు ప్రబోధానంద శిష్యులమీద దాడి చేయడము కూడా జరిగింది. ఈ గ్రంథములు దేనికి సంబంధించినవని చూడకుండానే భగవద్గీత అని పేరున్న త్రైత సిద్ధాంత భగవద్గీతను కూడా అగ్గిపెట్టి కాల్చడము జరిగింది. ఇలాంటి చర్యలను చూచిన ప్రబోధానంద ‘‘నేను చెప్పితేనే హిందూధర్మములేవో తెలియ బడేది. అటువంటి హిందూధర్మములున్న గ్రంథములను కాల్చువారు హిందువులా? వీరికి పెద్ద పాపమే చేరింది. అది ఒక జన్మతో అయిపోదు’’ అన్నాడు. ప్రపంచములోని మనుషులు కొందరు మాత్రమే ఆయన జ్ఞానమును చూచి ప్రశంసించి అనుసరించుచుండగా, కొందరు మాత్రము మతములను అడ్డము పెట్టుకొని మాట్లాడడము ఆయనకు కొంత ఇబ్బంది కరముగా తోచినది.
ఈ పుట ఆమోదించబడ్డది


ఒక మనిషిగా ఆయనను ఆలోచింప చేసినది. ఇంత మూర్ఖులకు నేనెందుకు జ్ఞానము చెప్పాలి? నేను కూడా అందరివలె బ్రతుకవచ్చును కదా! నేను బయట వ్యాపారములలో సంపాదించిన సొమ్మునంతటిని ఖర్చుచేసి ఎవరి చేతినుండి డబ్బును ఆశించక కృష్ణమందిరమును కట్టించి నప్పటకీ, ఎన్నో గ్రంథములు వ్రాసి జ్ఞానమును తెలియజేసినప్పటికీ, అందరి స్వాములవలె డబ్బుకోసమే ఇదంతా చేస్తున్నాడను మనుషుల కొరకు ఎందుకు చేయాలి? నా మంచితనమును ఇటు బంధువులుగానీ, కులస్థులుగానీ, బయటవారుగానీ ఏమాత్రము గ్రహించక నీచముగా, హేళనముగా మాట్లాడునప్పుడు అందరికీ అవసరమైన దానిని నేనెందుకు చేయాలి? అనుకోవడము జరిగినది. ఒక సాధారణ మనిషికి వచ్చే ఆలోచనే ఆయనలో వచ్చినా కొన్ని సందర్భములలో అన్నిటిని మరచిపోయి జ్ఞానమును చెప్పెడివాడు. అప్పటినుండి హిందువులకే కాకుండా, ఇటు క్రైస్తవులకు అటు ముస్లీమ్‌లకు కూడా జ్ఞానమును చెప్పెడివాడు. ఇలా ప్రబోధానంద చెప్పే జ్ఞానము క్రైస్తవులకు, ముస్లీమ్‌లకు బాగా నచ్చేది. ముస్లీమ్‌లు వచ్చినపుడు ఖురాన్‌ గ్రంథములోని వాక్యములకు సరిపోయే జ్ఞానమూ, క్రైస్తవులు వచ్చినపుడు బైబిలులోని వాక్యములకు సరిపోవు జ్ఞానమును చెప్పెడివాడు. ఒకవైపు అలా జరుగుచున్నా ఒకవైపు నేనెందుకు ఇతర మతముల వారికి జ్ఞానమును చెప్పాలి? అను ప్రశ్న వచ్చేది. ఆయన గ్రంథములు చదివిన హిందువులు కొందరు ఈయన నిజముగా దేవుడే అని అనగా, ఆయన బోధలు వినిన క్రైస్తవులు, ముస్లీమ్‌లు గొప్పగా చెప్పుకొనెడివారు. అయితే ప్రబోధానంద అప్పుడప్పుడు ఇలా ఆలోచించేవాడు. ‘‘సంస్కృతము ఏమాత్రము రానినేను శంకరాచార్యులు వలె సిద్ధాంతకర్తనా? అని అనుకొనెడివాడు. ఒక సాధారణ మనిషి యోచించునట్లు అజ్ఞాన పొరలు క్రమ్ముకోగా ‘‘ ఏ జ్ఞానమూ తెలియని
ఈ పుట ఆమోదించబడ్డది


నేను జ్ఞానము చెప్పడమేమిటి? ఏమీ తెలియని వారు నన్ను మెచ్చు కోవడమేమిటి? ఇదంత తెలివి తక్కువ’’ అని అనుకొనెడివాడు. అంతలోనే జ్ఞానము తనకు మతికి వచ్చి ‘‘చెప్పేవాడిని నేను కాదు కదా’’ అని తలచే వాడు. ఇటువంటి ఘర్షణ అప్పుడప్పుడు జరుగుచుండేది.

ఇటువంటి సందర్భములో హిందువులమనీ, హిందూ ధర్మ రక్షకుల మనీ పేరుపెట్టుకొన్న వారు త్రైతసిద్ధాంతమును క్రైస్తవములోని త్రిత్వముగా భావించి ప్రబోధానంద యోగీశ్వరులను హిందూ ముసుగులో నున్న క్రైస్తవుడనీ, క్రైస్తవమతమును ప్రచారము చేయుచున్నాడని నిందించడ ము జరిగినది. దానికి స్పందించిన ప్రబోధానంద ఇకమీదట ఎవరికీ జ్ఞానమును చెప్పకూడదనుకొన్నాడు. నేను మనుషుల మంచిని కోరి ఎంతో వివరముగా ఇందుత్వము (హిందుత్వము) లోని ఆత్మజ్ఞానమును బోధించితే, పరాయి మతమని కొందరనుకోవడము వలన తాను జ్ఞానమే చెప్పకుండా అందరివలె సాధారణముగా ఉండవలెనని అనుకొన్నాడు. ఒకప్రక్క ఎవరో అజ్ఞానులు అనుకొను మాటలను ఎందుకు పట్టించుకోవాలి, నేను మతము అను పేరుతో ఏ బోధలు చెప్పలేదు కదా! నేను చెప్పునది స్వచ్ఛమైన దైవజ్ఞానము కదా! అని అనుకొనెడివాడు. ఈ విధమైన ఆలోచనలలో ఆయనయందు కొంత స్తబ్దత ఏర్పడినది. ఆయన మొదట ప్రబోధ గ్రంథమును వ్రాసిన తర్వాత, ఒక స్వామీజీవద్ద మంత్రోపదేశము పొంది ప్రబోధానంద అను పేరును పొందిన తర్వాత, 1980వ సంవత్సరము ప్రబోధాశ్రమమును స్థాపించియుండెను. హిందూపరిషత్‌లోని అజ్ఞానులు కొందరు ఆరోపణలు చేయడముతో ప్రబోధాశ్రమము అను పేరునే తీసి వేయాలనుకొన్నాడు. ఆ సమయమలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు వ్రాసిన కాలజ్ఞానములో ‘‘ప్రబోధాశ్రమము ఉన్నతమైన జ్ఞానము కలది’’ అను వాక్యమున్నట్లు
ఈ పుట ఆమోదించబడ్డది


వీరనారాయణరెడ్డి అను వ్యక్తి ద్వారా తెలిసింది. అప్పుడు అంతపెద్ద యోగీశ్వరులైన వీరబ్రహ్మముగారే, ఆయన వ్రాసిన కాలజ్ఞానములో ప్రబోధాశ్రమమును గురించి అంతగొప్పగ మూడు వందల సంవత్సరముల క్రితమే వ్రాసియుంటే ఏమాత్రము హిందుత్వ జ్ఞానము తెలియని వారు మేము హిందువులమని పేరు పెట్టుకొని అజ్ఞానముగా మాట్లాడితే వారి మాటలను ఎందుకు లెక్కించుకోవాలనుకొన్నాడు. తర్వాత ప్రబోధానంద యోగీశ్వరులే స్వయముగా బ్రహ్మముగారు వ్రాసిన ఏష్య కాలజ్ఞానమను గ్రంథమును చూడడము జరిగినది. అందులో ప్రబోధానంద యోగీశ్వరులు నమ్మలేని నిజమొకటి కనిపించింది. అది ఏమనగా! ప్రబోధాశ్రమాధిపతి శయనాధిపతి గుణములు కలిగియున్నాడనీ, శయనాధిపతియే ఆనంద గురువనీ, ఆనందగురువే మీకు నాకు గురువని వ్రాయబడి ఉన్నది. అంతేకాక ఇంకా చాలా విషయములు ఆనందగురువు అనే పేరుతో వ్రాయబడి ఉన్నాయి. బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో చెప్పిన గురువు తానేయని ప్రబోధానంద గారికి అర్థమైపోయినది.

శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు చెప్పిన విషయములన్ని తనను గురించేనా అని ఒకప్రక్క యోచనరాగా, తనను గురించేనని మరొక ప్రక్క యోచన వచ్చేది. అప్పటికీ ప్రబోధానంద యోగీశ్వరుల దగ్గర దేవతలు సహితము మాట విని పోవడమూ, ఆయన నోటిమాటతో కొన్ని భయంకర మైన రోగములు, కాన్సర్‌, ఎయిడ్స్‌లాంటి రోగములు నయమైపోవడమూ జరగడము వలన కొందరి దృష్ఠిలో ఆయన కొంత గుర్తింపుకు వచ్చాడు. ఆయన మాత్రము తనకు ఏ గుర్తింపు లేకుండా సాధారణముగ ఉండవలెనను కొనెడివాడు. ఆయనకు సాటిరాని సాధారణ మనుషులు ఆయనును గురించి ఆసూయతో దూషణగా మాట్లాడినా, ఆ సమయములో అక్కడ ఎవరైనా
ఈ పుట ఆమోదించబడ్డది


దేవతలుండివుంటే వారి మాటలను విని ఆయనను దూషించినందుకు ఆ దేవతలు మనుషులమీద కోపగించుకొని వారిని హింసించిన సంఘటనలు కొన్ని ఉండగా, ఏకంగా దేవతలు వారిని చంపివేసిన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. ఇటువంటి విషయములు తెలిసిన యోగీశ్వరులు తాను బ్రహ్మముగారు చెప్పిన వ్యక్తినేనని అనుకొనెడివాడు. అంతలోనే మరియొక విధమైన యోచనతో అంతటి గొప్ప వ్యక్తినయితే ఇలా ఎందుకుంటాను. నాకంటే అజ్ఞానులే అన్ని విధముల యోగ్యతగా, ధనికులుగా, పేరు ప్రఖ్యాతులుగాంచినవారుగా ఉన్నారు కదా! అటువంటి వారిముందర నేనెంతటివాడిని? నాకు కొన్ని సంవత్సరములనుండి సుగర్‌ వ్యాధి ఉన్నది. మందులు ఎన్నివాడినా తగ్గకుండా ఎప్పుడూ 300 లేక 350 పాయింట్స్‌కంటే ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా అందరికున్నట్లే నాకు కొన్ని సమస్యలుకలవు. అందరిలా సర్వ సాధారణముగానున్న నాకు బ్రహ్మముగారు చెప్పిన మాటకు పోలికలు లేవు. కావున బ్రహ్మముగారు చెప్పిన వ్యక్తి మరొకరుండవచ్చును. నేనుమాత్రము కాదు అని అనుకొనెడి వాడు. ఆయన చెప్పిన జ్ఞానము ఆయనకు జ్ఞప్తికి వచ్చినప్పుడు నేను ఒక జీవున్ని మాత్రమే, అన్నిటికీ కారణము ఆత్మేనని అనుకొనెడివాడు.

అప్పటికే ప్రబోధానంద యోగీశ్వరుల వారు ముప్పైఆరు (36) గ్రంథాలను వ్రాయడము జరిగినది. తర్వాత ఇస్లామ్‌ మరియు క్రైస్తవ గ్రంథములని పేరుగాంచిన ఖురాన్‌, బైబిలు గ్రంథములు, దైవవాక్కులున్న గ్రంథములని వాటిలోని పరమార్థమును ఆయా మతముల వారు గ్రహించ లేదనీ, ఇంతవరకు వారికి తెలిసినది సరిjైున భావముకాదనీ, వాటి వివరములను నా గ్రంథములైన ఖురాన్‌లోని పవిత్ర వాక్యములు మరియు బైబిలులోని పవిత్రవాక్యములు అను వాటిలో చెప్పబడుతాయని ఆయన
ఈ పుట ఆమోదించబడ్డది


చెప్పడము ఆయనకే ఆశ్చర్యమైనది. ఆయా మతములలో ఎంతోమంది మతపండితులు, వారి వారి జ్ఞానమందు ఆరితేరిన వారుండగా, వారిని ఆతిక్రమించి వారికి దేవుని వాక్యముల పరమార్థము తెలియదనీ, నేను తప్ప ఎవరూ చెప్పలేరని ప్రకటించడము ఆయనకే వింతగా త్రోయడముకాక ఇదెలా సాధ్యము అనిపించింది. ఎటువంటి పరిచయములేని ఇతర మత గ్రంథముల వివరము చెప్పుతానని అనుకోవడము తనలోని గర్వము తప్ప ఏమీకాదనీ, అలా చెప్పడము పూర్తి అసాధ్యమనీ, మాయ (సాతాన్‌ లేక సైతాన్‌, (ఇబ్లీస్‌) అనునది అలా అనిపించుచున్నదనీ ఆయన అనుకోవడము జరిగినది. ఎవరైనా తన మాటలను వింటే నవ్విపోతారని అనుకొన్నాడు. ఒకవైపు ప్రపంచములో ఎక్కడాలేని ఆత్మజ్ఞానమును శాస్త్రబద్దముగా చెప్పుచున్నప్పటికీ తన సిద్ధాంతము ప్రకారము అంతా ఆత్మే చేయుచున్నదని తనను తాను పూర్తి తగ్గించుకొనెడివాడు.

ఆత్మజ్ఞానము ప్రకారము ప్రబోధానంద తాను ఏమీ చేయలేదనీ, తాను ఏ గొప్పతనము లేనివాడిననీ, తనలో ఏ ప్రత్యేకతా లేదని చెప్పడము వాస్తవమే, అయినా ప్రపంచములో అందరికీ ఆ విషయము తెలియదు కదా! అందువలన పైకి కనిపించే ప్రబోధానంద యోగీశ్వరులే అన్నీ చేయుచున్నాడని అనుకోవడము జరుగుచున్నది. ఆయనే వ్రాయుచున్నాడనీ, ఆయనే బోధించుచున్నాడనీ అనుకోవడము వలన జ్ఞానము అర్థముకాని మనుషులు అన్నిటికీ ఆయననే బాధ్యున్ని చేసి తమకు వ్యతిరేఖమైన జ్ఞానమును చెప్పుచున్నాడని అనుకోవడము కూడా జరిగెడిది. అధర్మవరులకు ధర్మవరులు వ్యతిరేఖమే కదా! శరీరమే తాము అనుకొను మనుషులందరూ కనిపించే శరీరముతోనున్న ప్రబోధానందను తమవలెనున్న మనిషిగా లెక్కించుకోవడము జరిగినది. దానివలన చేసేది ఆత్మ, అనుకొనేది నన్ను
ఈ పుట ఆమోదించబడ్డది


అనే తపన ప్రబోధానందలో ఉండేది. ఇలా ఎందుకు జరగాలి అను ప్రశ్న ఆయన కుండేది. ఈ ప్రశ్న ఆయనదే కాదు ప్రజల తరపున అందరిది అనుకొందాము. దానికి అందరికి అర్థమయ్యేలాగున దేవుడే జవాబు చెప్పాలి. ఈ జవాబు తప్పనిసరిగా ప్రబోధానంద యోగీశ్వరులకు మరియు ప్రజలకు తెలియాలి. కావున దేవుడు తన విధానమును అనుసరించి ప్రబోధానంద యోగీశ్వరుల హృదయమునుండి తెలియజేయడము జరిగినది. ప్రబోధా నంద హృదయమునుండి ఏమి తెలియబడిరదో ప్రజలకు కూడా తెలియాలి, కావున వివరముగా తెలియజేస్తాను చూడండి. ఇప్పుడు కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును, అదేమనగా! ప్రబోధానంద హృదయములో తెలుప బడినది ఆయనకు మాత్రమే తెలుసుకదా! ఆయన తెలియజేస్తేనే కదా మిగతా ప్రజలకు తెలిసేది. ఆయన చెప్పకుండా మీరెలా ఆ విషయమును తెలియజేయుచున్నారని అడుగవచ్చును. దానికి నా సమాధానమును క్రింద చూడండి.

ప్రబోధానంద యోగీశ్వరులు అనుపేరుగల వ్యక్తి యొక్క శరీరములో ప్రకృతి (స్త్రీ) సంబంధమైన భాగములు కాకుండా, పరమాత్మ (పురుష) సంబంధమైన భాగములు మూడుకలవు. ఆ మూడులో ఒకటి జీవాత్మ, రెండు ఆత్మ, మూడు పరమాత్మ. ఆ శరీరములో జీవాత్మగయున్న ప్రబోధానంద అనబడు వానిని నేనే, కనుక ఆ శరీరములోని పరమాత్మ ఆత్మచేత ఏమి చెప్పించినది ముందు నాకే తెలిసింది. ఇప్పుడు నేను చెప్పితే మీకు తెలియగలదు అని మీరు అనుకోగలరు వివరముగా చెప్పాలంటే ప్రబోధానంద యోగీశ్వరులుగా బయట ప్రజలకు నేనే లెక్కించబడుచున్న నేను కేవలము జీవాత్మనే అయినా, ప్రబోధానంద యోగీశ్వరులుగా ఇంతవరకు మాట్లాడినది నేనే అనుకొనినా ఇప్పుడునుండి మాట్లాడునది
ఈ పుట ఆమోదించబడ్డది


పరమాత్మ అంశతో కూడుకొన్న లేక పరమాత్మ ఆజ్ఞతో కూడుకొన్న ఆత్మయని తెలియవలెను.

ప్రబోధానంద యోగీశ్వరులు పుట్టిన సంవత్సరము యొక్క పేరు వికృతి నామసంవత్సరము. ప్రకృతికి వికృతి విభిన్నమైనది. ఒక లెక్క ప్రకారము చెప్పితే ప్రకృతి అంటే మాయ, వికృతి అంటే మాయకంటే విభిన్నమైన దేవుడు అని అర్థము. దైవమునకు గుర్తుగా పిలువబడు వికృతి నామ సంవత్సరములో పుట్టడమే ప్రబోధానంద యోగీశ్వరులకు ఒక ప్రత్యేకత యని తెలియాలి. ఇప్పటికి వికృతి నామసంవత్సరము రెండవమారు వచ్చి దాని తర్వాత ఖర నామ సంవత్సరమూ, దాని తర్వాత నందన నామ సంవత్సరము వచ్చినది. రెండవమారు వచ్చిన వికృతి 61వ సంవత్సరమున కాగా, ఖర 62వ, సంవత్సరమైనది. ప్రస్తుతము జరుగుచున్న నందన సంవత్సరము 63వ సంవత్సరము. అందువలన ఇప్పుడు ప్రబోధానంద యోగీశ్వరుల యొక్క వయస్సు 62 అయిపోయి 63వ సంవత్సరము జరుగుచున్నది. ప్రబోధానంద యోగీశ్వరుల జ్ఞానము అను అర్థమునిచ్చు ఇందూమతములో (హిందూమతములో) పుట్టడము జరిగినది. ప్రత్యేకమైన పూర్వ చరిత్రయున్న కమ్మకులమున పుట్టడమైనది. కమ్మ కులములో ఎన్నో ఇంటిపేర్లు (వంశము పేర్లు) ఉన్నా ప్రత్యేకించి గుత్తా వంశములోనే పుట్టడము జరిగినది. ప్రబోధానంద పుట్టిన సంవత్సరమూ, పుట్టిన మతమూ, పుట్టిన వంశమూ, పుట్టిన కులమూ అన్నీ ఒక విధముగా ప్రత్యేకత కలిగినవేనని చెప్పవచ్చును. ఆయన పుట్టినప్పటికే సంవత్సరము పేరూ, వంశముపేరూ రెండూ మార్పు చెందకుండా ఉండగా, మతము, కులము యొక్క పేర్లలో కొంత మార్పు జరిగినది. జ్ఞానుల మతమను పేరుగలదీ, శివుడు ధరించిన చంద్రవంక పేరుగలదీ అయిన ఇందూమతము ఏ అర్థమూ లేని హిందూ
ఈ పుటను అచ్చుదిద్దలేదు


Barcode : 2020010005651
Title - kandukuri_veereshalingamkruta_grandhamulu
Author - kandukuri_veereshalingam
Language - telugu
Pages - 908
Publication Year - 1950
Barcode EAN.UCC-13

ఈ పుటను అచ్చుదిద్దలేదు


<ఈ పేజీ ఖాళీ>
ఈ పుట ఆమోదించబడ్డది


కందుకూరి వీరేశలింగకృత గ్రంథములు.

నాలుగవ సంపుటము

( వచన ప్రబంధము : పద్యకావ్యములు )


ప్రకాశకులు :

హితకారిణీ సమాజము,

రాజమండ్రి.

వెల రు. 6-0-0
ఈ పుటను అచ్చుదిద్దలేదు


ఈ సంపుటంలో ఉన్న పదెనిమిది పద్యమూర్తుల్లోనూ, నాలుగు పెద్దకావ్యాలు, ఒకటి ప్రబంధానుకరణం, మూడు ఆంగ్లకావ్యానువాదాలు, అయిదు హేళనలు, రెండు మతప్రమేయాలు,, రెండు మహ్జవ్యక్తి ప్రశంశలు, ఒకటి నీతి బోధ.
ఈ పుటను అచ్చుదిద్దలేదు


సరణం. ఇది రెండో అంక ప్రారంభం ఆగిపోయింది. ఆంగ్ల వచనానికి మిక్కిలి చేరువైనా బ్లాంక్ వర్సులో ఆ నాటకం పుట్టి ఉండడం వల్ల, తెలుగు వచనానికి మిక్కిలి చేరువగా ఉండే ద్విపదలోకి దాన్ని దింపడం కర్తవ్యం అని కర్త ఊహించి ఉండవచ్చును. ఈ నాటకమూ, మర్చెంట్ ఆఫ్ వెనీస్ అనే నాటకమూ, విక్టోరియా రాణి చరిత్రా - ఇవి కర్తకు చాలా ఇష్టం. ఈ విషయాల్ని ఆయన రెండు మూడు విధాలా రూపించడమే అందుకు నిదర్శనం.
తక్కిన పద్యరచనలలో అయిదు హేళనలు. 'సరస్వతీ నారద విలాసము'లో కవులంతా తనకి అలంకారాలు చేయించాం అంటూ మొదలెట్టి తనని సకల హింసా పెడుతున్నారని సరస్వతి అడివిలోకి వెళ్లి అరణ్యరోదనం చేస్తూంటే, నారదుడు గానం అంతా వేశ్యల పాలైందని విచారిస్తూ అక్కడికే వెళ్లి దైవాద్వా ఆవిణ్ణి కలుసుగుని తానెంత దుఃఖంలో ఉన్నా ఆవిడ తన తల్లి గనక ఆవిణ్ణి ఎత్తుగుని అడివి దాటిస్తానంటాడు. 'స్త్రీ పునర్వివాహ సభా నాటకము' లో వీరభద్రుడు గారు పెద్దల్ని సభకి రప్పించే నిమిత్తం స్నేహితుడితో ప్రసంగిస్తాడు. 'వీర' పదం పేరులో ఉన్న ఆ పాత్ర, కర్తే! చివరకు ఇద్దరూ కలిసి ఒక కీర్తనలో ఈశ్వర ప్రార్ధన చేస్తారు. 'స్త్రీ విద్య' అనే పద్య సంపుటి ఏమిటంటే, స్త్రీ విద్య కూడదనే వారు పద్యరూపంలో వాదన చేయగా, గర్భసీసాలలోనూ, బంధకందాలలోనూ వ్యవహరిస్తూ ప్రమాణం కూడా చూపించి స్త్రీ విద్య శాస్త్రసమ్మతం అని 'గద్య తిక్కన' తక్షణం పంపిన సమాధానం! వితంతు వివాహాలు జరిగిపోయి, సంఘంలో వితంతువులు దొరక్కుండా పోతే తమరికి చాలా విషయాల్లో తంతు నడవక బాధ కలుగుతుంది కదా అని వాపోయే వాళ్ల బేసబబులు 'కులాచార పూర్వ నాగరిక పంచరత్నములు' అనే పద్యసంపుటీలో ఉన్నాయి. 'హితబోధ' అనేది పద్యత్రయం. విమర్శకి ఆగలేక, కాఱులు ప్రయోగిస్తూ, చాలామంది చేత పొగిడించుకుంటే మాత్రం ఎవడేనా కవి కాగలడా? లక్ష మంది పొగిడినా శునకం సింహం కాగలదా! అని దానిలో బోధ. వీరేశలింగం రచనల్లో ఒకే ఒక విమర్శ ఉండడం నించి ఇది ఎవర్ని ఉద్దేశించి పుట్టిందో తెలుస్తూనే ఉంది.

'చెన్నపురి బ్రహ్మోపాసన మందిర ప్రతిష్ఠాపనము' అనేది బ్రహ్మసమాజ మత స్థాపక పోషక సంస్కర్తల ప్రశంస. తమరి పత్రికని వర్ధిల్లజెయ్యడానికి సర్వరక్షకుణ్ణి వేడుకుంటూ రచించుచున్న పద్యావళి 'దైవప్రార్థన' కర్తకి మిక్కిలి ఇష్టవిషయమైన 'విక్టోరియా రాణి' గురించిన మెప్పు - 'శ్రీ విక్టోరియా జూబిలీ నవ--AvinashVellampally (చర్చ) 15:51, 2 డిసెంబరు 2014 (UTC)
ఈ పుటను అచ్చుదిద్దలేదు


రత్నములు. అప్పట్లో హిందూదేశ బంధువైన రిపన్ ప్రభువు గురించిన పొగడ్త - 'శ్రీ రిపన్ ప్రభు స్వాగతము'. అందులో కర్త రిపన్ నీ, ఆయన్ని పంపినవారినీ కూడా కీర్తన చేశారు. దేవుడు-తనవారు-మంచి బాలుడు-విద్య-అడకువ-గర్వము-తృప్తి-ధైర్యము-సత్యము-జీవహింస-సర్వజన సమాదరము-పాటుపడుట-శరీరారోగ్యము-స్వతంత్ర జీవనము-ధనము-ముఖస్తుతి-పనిబనుచుట-చౌర్యము-పరోపకారము-వివిధ ధర్మములు - అనే ఉపశీర్షికల క్రింద నూఱు గీతాలలో ప్రకాశిస్తూ బాలకంఠాల్లో మెరసిపోవాలని వీక్షిస్తూండే రచన 'నీతి దీపిక'.


రాజమండ్రి.

25-6-1950. భమిడిపాటి కామేశ్వరరావు.
ఈ పుటను అచ్చుదిద్దలేదు


విషయసూచిక

1. రాజశేఖర చరిత్రము

2. సత్యరాజా పూర్వదేశయాత్రలు

3. సత్యరాజా పూర్వదేశయాత్రలు

4. శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచననైషధము

5. రసికజనమనోరంజనము

6. శుద్ధాంధ్రభారతసంగ్రహము

7. శుద్ధాంధ్రోత్తరరామాయణము

8. అభాగ్యోపాఖ్యానము

9. పథికవిలాసము

10. జాన్ గిల్పిన్

11. నీతిదీపిక

12. సరస్వతీ నారద విలాసము

13. స్త్రీ పునర్వివాహసభా నాటకము

14. కామెడీ ఆఫ్ ఎర్రర్సు

15. స్త్రీ విద్య

16. చెన్నపురి బ్రహ్మోపాసనామందిర ప్రతిష్ఠాపనము

17. శ్రీ విక్టోరియా జూబిలీ నవరత్నములు

18. కులాచారసంస్కారపూర్వనాగరిక పంచరత్నములు

19. దైవప్రార్థన

20. హితబోధ
ఈ పుటను అచ్చుదిద్దలేదు


శ్రీ

వివేకచంద్రిక

అను

రాజశేఖరచరిత్రము


మెదటి ప్రకరణము.

ధవళగిరి - దేవాలయవర్ణనము - గోదవరి యొడ్డున నున్న ధర్మశాల మీఁద ప్రాతఃకాలమున రాజశేఖరుడుగారు వచ్చి కూర్చుండుట - అప్పు డచ్చటికి వచ్చిన సిద్దాంతి మొదలగువారి స్తుతివచనములు - అందఱును గలిసి రామపాదములయొద్దకు బైరాగిని చూడఁబోవుట.

శ్రీ నాసికాత్య్రంబకముకడ కడుదూరమున నెక్కడనో పశ్చిమమున నొక్కయున్నతగోత్రమున జననమొంది ఊర్మికాకంకణాదుల మెఱుంగులు తుఱంగలింపఁ దనజననమునకు స్థానమైన భూభృద్వరపురోభాగముననే పల్లములంబడి జాఱుచూ లేచుచుఁ గొంతకాలముండి యక్కడినుండి మెల్లమెల్లగా ముందుముందుకు ప్రాఁకనేర్చి యెల్లవారల చూడ్కులకు వేడ్కలు నింపుచు, పిదప నవ్యక్తమధురస్వరంబులతో ముద్దులు గులుకు శరవేగమునఁ బరుగిడుచు, ఆపిమ్మట ఘనతరుల చెంతఁజేరి తల్లివేళ్ళనువిడిచి తక్కినవేళ్ళనంటుచుబాఱి జమ్ములోనడఁగి దాఁగుడుమూఁత లాడుచు, వెలువడి వచ్చి పుచ్చుకొనిన వారిచే.................... స్నానపానంబులకు వలయున్ంత నిర్మలజలంబొ.................. మందఱి నానంద మెందిం..........................

లకును ఫలవృక్షములకు.......................
ఈ పుటను అచ్చుదిద్దలేదు


చుచు తన చల్లదనము వ్యాపించినంతవఱకు నిరుపార్శ్వముల్ందు భూమిన్ంతను బచ్చని లేఁబచ్చికతో నలంకరించి పశుగణంబుల కాహారంబు కల్పించుచు, తనరాక విని దూరమునుండి బయలుదేఱి యడవిపండ్లును నెమలికన్నులు వహించి పొంగి నానాముఖములఁ దన్నుఁ గానవచ్చు వరద, మంజీర, పిన్నగంగ మొదలగువారి నాదరించి లోఁగొనుచు, అంతకంతకుఁ దనగంభీరత గానుపింప నాథుని వెదకికొనుచు వచ్చివచ్చి, యేగిరిని దూరమునుండి విలోకించి గోదావరి రసోత్తరంగముగా ఘోషించుచు పాదమునంబడి శిఖరంబున నధివసించు జనార్దనస్వామి దర్శనము చేసికొని తోడనే యచ్చటనుండి తనశాఖారూపములయిన రెండుచేతులనుజాచి సరసతమీఱ నాథునింగలియు భాగ్యము గాంచెనో యాధవళగిరి, యాంధ్రదేశమున కలంకారభూతమయి రాజమహేంద్రవరపుర సమీపమున మిక్కిలి వన్నె కెక్కి యుండెను.

ఆపర్వత మంతయున్నతమయినది కాకపోయినను, తెల్లనిపిండిరాళ్ళతో నిండి యుండుటచేఁ జూచుట కెంతయు వింతగా మాత్రముండును; ఆరాళ్ళనుబట్టియే గ్రిందినుండి పర్వతాగ్రమువఱకును నల్లరాళ్ళతోఁ జక్కనిసోపానములు కట్టబడియున్నవి. ఆసోపానముల కిరుప్రక్కలను కొండపొడుగున నర్చకులయుఁ దదితరులగు వైష్ణవస్వాములయు గృహములు చాలుగానుండి కన్నులపండువు చేయుచుండును. ఆసోపానముల వెంబడి బైకిఁ జనినచో గొండమీఁద నల్లరాళ్ళతోఁ గట్టబడిన సుందరమైన చిన్నదేవాలయమొక్కటి కానఁబడును. దానిచుట్టును.............. .............................వెత్తెడు ప్రాకారము మూఁడుప్రక్కలను బలిసి.................. ................................................బదులుగా పర్వతశృం............... ...............................................శయింప వానిని మించి
ఈ పుటను అచ్చుదిద్దలేదు


యాలయశిఖరమును నిక్కి చూచుచుండును. ప్రాకారములోపలనె యుత్తరమున నొక చిన్నగుహ కలదు. అందులోఁ గూర్చుండి పాండవులు పూర్వమరణ్యవాసము చేయునప్పుడు తపస్సు చేసిరని పెద్దలు చెప్పుచుందురు. అందులో నప్పుడు చిన్న రాతివిగ్రహ మొక్కటియుండెను. సంవత్సరము పొడుగునను పూజాపునస్కారములులేక బూజుపట్టియున్న యాదేవర నుత్సవదినములలొ నర్చకుండొకడు పైకిఁ పులికాపుచేసి, ఆస్వామి సన్నిధానమున దీపము నొకదానిని వెలిగించి గుహముఖంబునఁ దాను నిలుచుండి పల్లెలనుండి యాత్రార్థమువచ్చిన మూకలవలనం తలకొకడబ్బువంతునఁ బుచ్చుకొని లోనికిం గొనిపోయి దేవతాదర్శనము చేయించి వారిపెద్దలు ధన్యులయిరని జెప్పి పంపుచుండును. జనార్దనస్వామి కళ్యాణ దినములు నాలుగును వెళ్ళినతోడనే యెప్పటియట్ల స్వామిరథము యొక్కపగ్గములు నందుంచి వాని కాచిన్న దేవరను గావలియుంచి జీతబత్తెములు లేకపోయినను రాత్రిందినముల కాలుగదలపక స్థిరవృత్తితోఁ గాచుచుండు నాపిన్నదేవరయెడంగల విశ్వాసముచేత పూజారులు మఱుచటిసంవత్సర మాత్రాళ్ళపని మఱలవచ్చువఱకును ఆగుహత్రొక్కి చూడనక్కరలేక నిర్విచారముగా నుందురు. ఈ ప్రకారముగ మనుష్యులు భక్తివిహీనులయు దేవతాసందర్శనము చేసికోకపోయునను పర్వతమును కనిపెట్టుకొనియున్న చిన్న చతుష్పాద జంతువులుమాత్రము మిక్కిలి భక్తికలవై నిత్యము నాస్వామిని సందర్శించుకొనుచు ఉత్సవదినములలో మనుష్యులువచ్చి తమ్ముఁ రఱిమివేయునంతటిపాపముం గట్టుకొన్నదాఁక రాత్రులు దేవతాసన్నిధానమున్ గుహలో వట్టిభూతలముననే శయనించుచుండును. తూర్పువయిపునఁ బ్రాకారములోనే జనార్దనస్వామి కెదురుగా గొప్పధ్వజస్తంభమొకటి యున్నది. దాని శిఖరమున నున్న చిఱుగ్ంతలు గాలికిఁగదలుచు సదా శ్రావ్యమయిననాదముతోఁ జెవులను దనుపుచుండును. ఆస్తంభమునకు మెదట
ఈ పుట ఆమోదించబడ్డది


నాంజనేయ విగ్రహమొకటి చేతులు జోడించుకొని స్వామి కభిముఖమయి నిలిచి యుండును. ఈ శిలావిగ్రహమునకును ధ్వజస్తంభమునకును ఉత్తరముగా గళ్యాణమంటప మొకటి యుండెను. స్వామి కళ్యాణ దినములలో నుత్సవవిగ్రహములు నందు వేంచేయింపజేసి యథావిధిగా వివాహతంత్రమునంతయు మహావైభవముతో నడిపింతురు.

ప్రతి మాసమును, రెండు పక్షములయందును ముఖమంటపము మీద ఏకాదశి నాడు రాత్రి హరిభజనము జరుగుచుండును. హరిభక్తులు తులసి పూసల తావళములను ధరించుకొని ద్వాదశోర్ధ్వపుండ్రములను స్ఫుటముగా బెట్టుకొని కరతాళములును మృదంగములును మ్రోగుచుండగా దంబురలు మీటులు, బిగ్గఱగా దమ యావచ్ఛక్తిని "నవనీతచోరా", "గోపికాజారా", "రాధికాలోలా", "గోపాలబాలా" మొదలగు నామములచే నిష్టదేవతలను సంబోధించుచు మధ్యమధ్య గొంతుకలు బొంగుపోయినప్పుడు మిరియములను బెల్లపుముక్కలను నమలుచు కృష్ణలీలలను పాడుచుందురు. తలలు త్రిప్పుచు భక్తులు తమ సత్తువంతయు జూపి చేతికొలదిని వాయించుటచే నొకానొకప్పుడు మద్దెలలును తాళములును పగిలిపోవుటయు సంభవించుచుండును. దేవతావేశము చేత తఱచుగా భక్తులలో నొకరిద్దఱు దేహములు పరవశమయి రెండు మూడు నిముషముల వఱకు వెనుకకు స్తంభము మీది కొఱగుచుండుటయు గలదు. ఇట్టి భక్తి మార్గమును బొత్తిగా గుర్తెఱుగని యన్యదేశీయులకు మాత్రము వారి యప్పటి చేష్టలు పిచ్చిచేష్టల వలె గనపడును గాని, వేడుక చూడవచ్చిన జనులు వారెంత వికృతముగా కేకలు వేయుచు భజన చేయుదురో యంత పరమ భాగవతోత్తములని తలతురు.

కొంచెము శ్రమపడి యెవ్వరైన మధ్యాహ్నవేళ నొక్కసారి కొండ మీదికెక్కి నలుగడల జూడ్కి నిగిడించినచో, వన్నెవన్నెల
ఈ పుట ఆమోదించబడ్డది


పిల్లలు చెంగుచెంగున దమ ముందఱ దుముకులాడుచుండ గొండ పొడుగునను ముంగాళ్లు మీదికెత్తి పొదలపయి యాకులను మేయు మేకలును, పూర్వదక్షిణముల గుప్ప వోసినట్లున్న తాటాకుల యిండ్ల నడుమ వానిని వెక్కిరించున ట్లక్కడక్కడ నెత్తుగానొక్కొక్క పెంకుటిల్లును ఉత్తరమున మంచెలపై నుండి పొలముకాపులు కోయని కూతలిడుచు నొడిసెలలు ద్రిప్పుచు బెదరింప జేరువ తోపులలో నుండి వెలువడి మధురరుతములు చేయుచు ఆకాశమున కెగయుచు సందయినప్పుడు కంకులను విఱుచుకొని పఱచి పలువిధములయిన పక్షులు చెట్ల కొమ్మల మీద బెట్టుకొని తినుచుండ ముచ్చటగా నుండు పలువిధముల పచ్చని పయిరులును, ఆ పయిని వృక్షముల మీదను గూర్చుండి కర్ణరసాయనముగా బిల్లనగ్రోవిని మోవిని బూని పాడెడి గోపబాలకుల గానములకు హృదయములు కరగి మేపులు చాలించి క్రేపులతోడ గూడి జెవులు నిక్కించి యర్రులు చాచి యాలింపుచు నడుమ నడుమ గడ్డిపఱకలు కొఱుకుచు బయిళ్ల యందు నిలుచున్న పశుగణములును, పడమటను నీలము వలెనున్న తేటనీటిపై సూర్యకిరణములు పడి యెల్లెడలను వజ్రపుతళుకులను బుట్టింప బలుతెరంగుల జలవిహంగంబులు పుట్టచెండ్ల వలె మీల బట్టుకొనుటకయి నీటం బడుచు లేచుచు బ్రవాహంబుతోడం బఱచుచుండ నఖండ గౌతమియు నేత్రోత్సాహము చేయుచుండును.

ఆ పర్వత పాదమునకు సమీపమున గోదావరి యొడ్డున నల్లరాతి బండ మీద జక్కగా మలచిన రామపాదములు వెలసియున్నవి. శ్రీరాముల వారు పూర్వకాలమున సీతాలక్ష్మణులతోడగూడ బర్నశాలకు బోవుచు త్రోవలో ఈ పర్వతసమీపమున నడచిననాటి పాదముల చిహ్నములే యవి యని యెల్లవారును నమ్ముదురు. కాబట్టి
ఈ పుటను అచ్చుదిద్దలేదు


యా రామపాదములను సందర్శింపవలె ననునభిలాషతో దూరదేశముల నుండి సహితము యాత్రాపరులు వచ్చి రామపాద క్షేత్రమున నఖండ గౌతమీస్నానము చేసికొని, కొండ మీదికెక్కి శ్రీ జనార్ధన స్వామి వారి దర్శనము చేసికొని, స్వశక్త్యానుసారముగా దక్షిణతోడి ఫలములను సమర్పించి కలిగినవారైన స్వామికి భోగము సహితము చేయించి మఱి పోవుచుందురు. అది దివ్యక్షేత్ర మగుట చేత జాతిమతభేదము లేక యెల్లవారును పులిమాగిరము, దధ్యోదనము మొదలుగా గల స్వామిప్రసాదమును స్వీకరించి కన్నులకద్దుకొని ముచ్చటనారగించి చేతులనంటుకొన్నదానిని కడుగుకొన్న నపచారమగును గనుక గరతలములు పయికెత్తి చేతుల కందినంత వఱకు దేవాలయ స్తంభములకును, గోడలకును వర్ణము వేయుటయే గాక తచ్ఛేషముతో దమ మీజేతులకును బట్టలకును మెఱుగు బెట్టుకొనుచుందురు.

ఈ కొండకు దక్షిణమునను తూర్పునను కొంత దూరము వఱకు గ్రామము వ్యాపించియున్నది. పర్వతము పేరే పూర్వము గ్రామమునకుం గూడ గలిగియుండెను. కాని యిప్పుడిప్పుడు గ్రామమును ధవళేశ్వరమని వ్యవహరించుచున్నారు. కొండ మీది నుండి సోపానములు దిగివచ్చిన తోడనే రాజవీధి యొక్క యావలి ప్రక్కను శ్రీ అగస్త్యేశ్వరస్వామివారి యాలయమొక్కటి లోచనగోచరంబగును. తొల్లి వింధ్యపర్వతము యొక్క గర్వము నణచి దక్షిణాభిముఖుడయి చనుచు అగస్త్యు డాస్వామిని అచట ప్రతిష్ట చేసెనని స్థలపురాణము చెప్పుచున్నది. ఈ దేవాలయమునకును పర్వతమునకును మధ్యను తూర్పుననుండి పడమటకు గోదావరి వఱకును విశాలమయిన రాజవీధి యొకటి గలదు. ఆ వీధి చివరను నల్లరాళ్లతో నీటి వఱకును సోపానములు కట్టబడియున్నవి. సోపానములకు సమీపమున వీధికి
ఈ పుటను అచ్చుదిద్దలేదు


దూర్పు ప్రక్కను "ధర్మ చావిడి" అని యొకటి యుండెను. అది పరదేశ బ్రాహ్మణులును, మార్గస్థులును రాత్రులు పరుండుటకై మొట్టమొదట కట్టబడినది కాని, ఆ కాలమందది యుబుసుపోవుటకై గ్రామములోని పెద్దమనుష్యులు ప్రతిదినమును ఉదయాస్తమయములందు ప్రోగై యిష్టకథాగోష్టిం గొంత ప్రొద్దుపుచ్చి పోవుచుండుటకు మాత్రము వినియోగపడుచుండెను.

ఒకానొక దినమున సూర్యుడుదయించి ప్రాచీముఖంబున గుంకుమబొట్టు నందంబు వహించి వృక్షాగ్రములను బంగారునీరు పూసినట్టు ప్రకాశింపజేయుచుండెను; చెట్ల మీది గూళ్ల నుండి కలకల ధ్వనులతో వెలువడి పక్షులు నానాముఖముల ఎరకయి వెడలుచుండెను; పసులకాపరిబాలురు చలుదులు మూటగట్టుకొని పశువుల మందలను దోలుకొని పచ్చికపట్ల కరుగుచుండ, వెనుక "వెల్లావు కడి నాది" "దోర గేదె కడి నాది" యని గంపలు చేతబట్టుకొని, పడుచు లొండొరుల మీరి పరుగులిడుచుండిరి. కాపులు ములుకోలలు బుజముల మీద బెట్టుకొని, కోటేరులను దోలుకొని తమతమ పొలములకుం బోవుచుండిరి; అప్పుడు కాయశరీరము గల యొక పెద్దమనుష్యుడు జందెము పేరుగా వేసికొని యెడమచేతిలో నిత్తడి చెంబు నొకదానిం బట్టుకొని, గోదావరిలో గాళ్లును చేతులును గడుగుకొని, ఒడ్డునకు వచ్చి పుక్కిలించివైచి యజ్ఞోపవీతమును సవ్యముగా వేసికొని వచ్చి, ధర్మశాల మీద వొడ్డున గూర్చుండి, వచ్చునప్పుడు చెంబులో వేసి తెచ్చుకొన్న తుమ్మపుడకతో దంతధావనము చేసికొనుచుండెను. ఆయనకు వయస్సు నలువది సంవత్సరములుండును; మొగము మీద స్ఫోటకపు మచ్చలే లేకపోయెనేని, మొగము సుందరమయిన దనుటకు సందేహింప నక్కఱయుండదు; అట్టని, యా ముఖమాయనకు నిత్య
ఈ పుటను అచ్చుదిద్దలేదు


మును దర్శింపవచ్చు. ప్రవక్తల స్తోత్రములకు మాత్రమెప్పుడును బాత్రము కాకపోలేదు; శరీరచ్ఛాయ యెఱ్ఱనిది; విగ్రహము కొంచెము స్థూలముగాను పొట్టిగాను ఉండును; నుదురు విశాలమయి చూచువారి కతడు పండితుడని నోపజేయుచున్నది; అప్పుడు కట్టుకొన్నది గోరంచు నీరుకావి దోవతి; సరిగంచుల చలువ వస్త్రమొకటి శిరస్సునకు వదులుగా చుట్టబడి కొంగు కొంత వ్రేలాడ వేయబడియున్నది; చెవులనున్న రవలయంటుకోడును, కర్మిష్టుడనుటకు సాక్ష్యమిచ్చుచున్న కుడిచేతి యనామికనందలి బంగారపు దర్భముడి యుంగరమును, తర్జనియందలి వెండిబటువులు రెండును తప్ప శరీరమున నాభరణములేవియు లేవు; ఆయన పేరు రాజశేఖరుడు; ఆయన ముఖప్రక్షాళన మగునప్పటికి గ్రామములోని గృహస్థులు నలువురును అక్కడకు వచ్చి, ఆయన వారివారి తారతమ్యముల కర్హముగా దగిన మర్యాదలు చేసి కూర్చుండుడని చేయి చూప, 'చిత్తము' 'చిత్తము' 'మీరు దయ చేయండి' అనుచు జావడి నిండ గిటగిటలాడుచు గూరుచుండిరి.
అప్పుడు రాజశేఖరుడు గారు "సిద్ధాంతి గారూ! మీరు నాలుగు దినముల నుండి బొత్తిగా దర్శనమిచ్చుట మానివేసినారు! మీ యింట బిన్నపెద్ద లందఱును మరేమియు లేకుండా సుఖముగా నున్నారు గదా?"

సిద్ధాంతి - "చిత్తము, చిత్తము. తమ అనుగ్రహము వల్ల మేమందఱము సుఖముగానే యున్నాము. ఎన్ని కుటుంబములనైన నన్నవస్త్రాదులిచ్చి కాపాడగల ప్రభురత్నములు తమరు గ్రామములో నుండగా మావంటి వారికేమి కొదువ? మా గ్రామము చేసికొన్న భాగ్యము చేతను, మా పురాకృత పుణ్యము చేతను, తమ వంటి దాన