భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/ప్రచురణకర్త మాట

వికీసోర్స్ నుండి

అబ్బాదుల్లా
డైరెక్టర్‌
తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌
సందేశభవనం, లక్కడ్‌కోట్
ఛత్తాబజార్‌, హైదారాబాద్‌-2

ప్రచురణకర్త మాట

ప్రముఖ రచయిత సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌ రచించిన భారత స్వాతంత్య్రో ద్యమం-ముస్లిం మహిళలు అను ఈ పుస్తకం ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నుండి ముస్లిం మహిళలు నిర్వహించిన పాత్రకు అద్దం పడుతుంది. చరిత్ర పరిశోధకుడు నశీర్‌ అహ్మద్‌ రాసిన ఈ పుస్తకం భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు పాత్రను అవగాహన చేసుకోవడనికి ఎంతగానో సహకరిస్తుంది.

ఈ పుస్తకం ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ ద్వారా 1999లో ప్రచురితమైంది. ఆ సందర్భంగా లభించిన పాఠకాదారణ వలన 2003లో మరింత సమాచారంతో పునర్ముద్రితమైంది. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల భాగస్వామ్యం గురించి ప్రత్యేకంగా మహిళలు నిర్వహించిన పాత్ర గురించి తెలుగులో పుస్తకాలు లేనిలోటును ఈ పుస్తకం తీర్చడంతో పాఠకుల, పండితుల విశేష ఆదరణ లభించింది. ఆ కారణంగా మరిన్ని మార్పులతో, ఎన్నో చేర్పులతో, పలు చిత్రాలు, ఫోటోలను సమకూర్చుకుని మూడవసారి ముచ్చటగా ప్రస్తుతం మీ ముందుకు వచ్చింది.

మన దేశంలో శతాబ్ధాలుగా కలసిమెలసి సహజీవం సాగిస్తున్న వివిధ సాంఫిుక జన సముదాయాలు తమ తమ పూర్వీకులు మాతృదేశ విముక్తి కోసం,ఆ తరువాత స్వంతగడ్డ ప్రగతి కోసం చేసిన త్యాగాలను, సాగించిన కృషిని పరస్పరం తెలుసుకుంటే ఒకరి పట్ల మరొకరికి గౌరవభావం ఏర్పడుతుంది. ఆ గౌరవభావం నుండి ఆయా ప్రజా సముదాయాల మధ్య సదావగాహన, సద్భావన పరిఢవిల్లుతాయి. ఆ సద్భావన నుండి సహిష్ణుత ఉద్భవిస్తుంది. ఆ కారణంగా మత సామరస్యం మరింత పిష్టం కాగలదని ఆశిస్తూ...

- అబ్బాదుల్లా 4