పుట:Womeninthesmrtis026349mbp.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

స్మృతికాలపుస్త్రీలు

(ఎద్దు గోవులకు నూరుదూడలను పుట్టించినను నాదూడలు గోవులు కలవానివే యగును. వృషభము వ్యర్థముగనే రేతస్సును విడచినది. అట్లే పరక్షేత్రములో బీజమువేయువాని కాఫలము రాదు. ఆ ఫలము క్షేత్రముగల వానికే పోవును.)

వ్యభిచారము వలన జనించిన వారు పైన వివరింపబడిన యర్థములోనే పుత్రులగుచున్నారు. కాని మఱొక యర్థమున కాదు. వ్యభిచారమువలన స్వచ్ఛమైన సంతానము గలుగదని స్పష్టమగుచున్నది. వ్యభిచారమువలన వర్ణసంకరము కూడ నగును.

తత్సముత్థో హి లోకస్య జాయతే వర్ణసంకరః

(మను. 8-353)

వ్యభిచారమువలన వ్యభిచరించిన వారికంటె నావ్యభిచారమువలన గల్గిన సంతానమే యెక్కుడు పాపభూయిష్ఠమని స్మృతుల యభిప్రాయము. కనుకనే వ్యభిచరించినంత మాత్రమున స్త్రీని వదలివేయనక్కరలేదనియు పరునివలన గర్భము గల్గుచో నామెను వదలివేయవలెననియు చెప్పబడినది.

వ్యభిచారాదృతౌశుద్ధిర్గర్భేత్యాగో విధీయతే

(యాజ్ఞ. 1-73)

(వ్యభిచారము చేసిన స్త్రీకి ఋతుస్రావముతో శుద్ధియగును. గర్భము గల్గుచో నామెను వదలివేయవలెను.)