పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాత్సల్యప్రియ

లీలామానుషవిగ్రహుడగు గోపాలుని లీలలను మాయామోహితమైన జగమంతా ఒక ఎత్తుగా చెప్పుకుంటే, అదృష్టవంతురాలయిన శ్రీకృష్ణుని తల్లి యశోద ఆ మాటలనే మళ్ళీ చెపుతూ 'వాత్సల్యప్రియ'గా పరిపూర్ణత పొందింది. లీలల వర్ణనలో, పలుకుల పొందికలో, మాటల తీరులో అనేక అందాలు పోయింది ఆ అమ్మ హృదయం. ఈ కవితావాహినిలో పాలనురగలై ప్రవహించిపోయింది.


ఉ .

గోపిక లొక్కటై పలుకు కొండెములన్ తలపట్టిపోయి నా
కోపము మిన్నుముట్టి, ఇక కొట్టక తిట్టక యున్న పట్టగా
నోప నటంచు నీ కయి గృహోపరిభాగ కవాట సీమలో
కాపల కాసి కాళులివె కండెలు కట్టెనురా కుమారకా!


మ .

నిను దండింపగ వేచియుంటినని మున్దే చెప్పినా రెవ్వరో,
అనుమానించిరి, రాధ కాదు గద! ఏరా! అల్లరే మాని, నీ
తిని ముత్తైదటు కూరుచుంటి విటు లేదీ ఒక్కమారెత్తరా
కనుగొందు న్మొగ మెంత దొంగవుర సాక్షాన్మౌని వైనావురా!


ఉ .

ఏ గతి వచ్చి చేరితివి యింటికి, వాకిట నిల్చియుంటి కా
దా గజదొంగ, మూసితివి అమ్మకు కన్నుల దొడ్డిగుమ్మమున్
నే గడి వేసి వచ్చితిని, నీకెటు వచ్చెనొ ఇట్టులైన నే
లాగున నిల్వగాగలమురా నిను పెట్టుకు ఊరిలోపలన్?


ఉ .

ఒక్కరు చెప్ప నమ్మకనె యుందును కావని గ్రామమధ్యమం
దక్కట మంచివాడ వని యాడరు ముద్దునకై నొక్క రే
దిక్కున నీవెయై ప్రజను త్రిప్పలు పెట్టుచు నుంటివంచు మా
మక్కువ యింత చేసెనని - మన్నన దక్కదటంచు పల్కెరా!


మ.

పలుకన్ వారల కేమి చెప్పుటకు నే పాల్పోక నో తండ్రినా
తల యాడించితి సత్య మన్నటుల నిత్యం బిట్టు లెన్నాళ్లు లో

________________________________________________________________________________________

శివాలోకనము

37