పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యౌవ నారంభమున నిను గన్నవారు
'తల్లి, కైకమ్మ - మహలక్ష్మి, తనయు డడుగో,
అందగాడు, రతీభర్త' అంచు పలుక
వినగ నానందమును, శీలభీతి గలిగె.

    ఎందరో పుణ్యజనుల దర్శించి నీవు
    జ్ఞానివైనావు శుద్ధసంకల్పగరిమ,
    బంధుమిత్రుల యనురాగ భద్రతలతో
    చేసితివి జనప్రీతికర జీవయాత్ర.

దీనజన రక్షణార్థమ్ము పూనుకొనెడు
దానధర్మాల యెడ బుద్ధి తరుగ దెపుడు
ఋణమొనర్చు చిచ్చెదవు సుశ్లోకులయిన
శాస్త్ర సాహిత్య విద్యా విశారదులకు

     ఏమి బోధించినను పరు, లేమి విన్న
     సోదరీసోదరుల ఎడ నీదు హృదిని
     ఎట్టి వైషమ్యమును సోక దించుకైన,
     చూచుకొంటివి గాఢవిస్ఫూర్తితోడ.

నీదు సోదర సోదరీ నిచయ గేహ
ములను బాల లతా వృక్షములు జనించె
అమరలోక నివాసీ వనవరతము
వచ్చి పోషించుకొనుము నీవాని, వాని.