ఆదిప్రకరణము
47
బడవైచి పద్మ భూ-పాలుఁడై పుట్టె
నడలుచు నతని భా-ర్యామణి మేనుఁ
బాసి లీలాఖ్యతోఁ - బ్రభవించి నీవు
భాసురాత్మకుఁడైన - పద్మభూపతికి
నిల్లాలవైతివి, యష్టభోగముల
నెల్లవా రెఱుఁగ భూ-మేలు చుండితిరి.
మొనసి బ్రాహ్మణ దేహ-ములు మీరు విడిచి
యెనిమిదినా ళ్లయ్యె, - నిచ్చట మీరు 1010
పొడమి డెబ్బది యేండ్లు - భోగేచ్ఛ మీఱఁ
బుడమి యేలతిరి యి-ప్పుడు రాజతనువు
వీడిన దిన మందె - విను పదాఱేండ్ల
వాఁ డయ్యె నని మఱి - వాణి యి ట్లనియె:
ఆ విప్రుభార్య నీ - యటువలె నన్ను
వా వీరి నర్పించి - వరయుగళంబు
నడుగ నిచ్చితి విప్రుఁ - డానాఁడు తనువు
విడిచియు నా యిల్లు - వెడలి పోకుండెఁ
గాన మీ యిరువురి - కాపురమెల్లఁ
బూని బ్రాహ్మణ గృహం-బున నున్న దిపుడు, 1020
అరయఁ బునార్జాతుఁ-డైన భూవిభుని
గురుతర సంసార - గోష్టి నీయింట
నిలిచియున్నది యని నిశ్చయంబుగను
పలుకఁగా విని లీల : భారతి కనియె:
అక్కట! జనని. బ్రాహ్మణవర్యు జీవ
మెక్కడ వచ్చి పూ - యింటిలో జొచ్చె?