పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిప్రకరణము

47

బడవైచి పద్మ భూ-పాలుఁడై పుట్టె
నడలుచు నతని భా-ర్యామణి మేనుఁ

బాసి లీలాఖ్యతోఁ - బ్రభవించి నీవు
భాసురాత్మకుఁడైన - పద్మభూపతికి

నిల్లాలవైతివి, యష్టభోగముల
నెల్లవా రెఱుఁగ భూ-మేలు చుండితిరి.

మొనసి బ్రాహ్మణ దేహ-ములు మీరు విడిచి
యెనిమిదినా ళ్లయ్యె, - నిచ్చట మీరు 1010

పొడమి డెబ్బది యేండ్లు - భోగేచ్ఛ మీఱఁ
బుడమి యేలతిరి యి-ప్పుడు రాజతనువు

వీడిన దిన మందె - విను పదాఱేండ్ల
వాఁ డయ్యె నని మఱి - వాణి యి ట్లనియె:

ఆ విప్రుభార్య నీ - యటువలె నన్ను
వా వీరి నర్పించి - వరయుగళంబు

నడుగ నిచ్చితి విప్రుఁ - డానాఁడు తనువు
విడిచియు నా యిల్లు - వెడలి పోకుండెఁ

గాన మీ యిరువురి - కాపురమెల్లఁ
బూని బ్రాహ్మణ గృహం-బున నున్న దిపుడు, 1020

అరయఁ బునార్జాతుఁ-డైన భూవిభుని
గురుతర సంసార - గోష్టి నీయింట

నిలిచియున్నది యని నిశ్చయంబుగను
పలుకఁగా విని లీల : భారతి కనియె:

అక్కట! జనని. బ్రాహ్మణవర్యు జీవ
మెక్కడ వచ్చి పూ - యింటిలో జొచ్చె?