పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిప్రకరణము

21

నానందముగఁ జూచి,-యరమర విడిచి
'నా నిశ్చయిం బదే!-నాతండ్రి మొదటఁ
చెప్పిన యర్థమే-సిద్ధంబుగాను
[1]చెప్పితి వవనీశ!-చిత్తసంశయము
తీఱె'నంచు వచించి-దిగ్గున లేచి,
యారాజు సెలవంది-యరిగి యొక్కెడను
పరమైన నిర్విక-ల్ప సమాధి నుండి,
పరిపూర్ణుఁడై మోక్ష-పదమందె శుకుఁడు.
అని చెప్పి దయను-విశ్వామిత్రమౌని
మనుకులోత్తముఁ జూచి-మరల నిట్లనియె:420
'సకలజ్ఞ! శ్రీరామచంద్ర! తనంత
శుకుడు డెలిసినయట్ల-సూక్ష్మవిజ్ఞాన
సరణిఁ దెలిసితీవు,-సంశయార్థముల
మెరమెరఁ బొందనే-మిటి కింకమీఁద?
నలలేక యుపశాంతి-యనెడు తోయమున
మఱువక యిపు డాత్మ-మలినంబు గడిగి
భూరి విశ్రాంతినిఁ-బొంది సుఖింపు,
మూరకే పరితాప-మొంద నేమిటికి?
అమర జ్ఞాతృజ్ఞేయ-మైన చిత్తరతి
క్రమమొప్పఁగా సమ-గ్రంబుగా భోగ430


  1. చెప్పితి పరమేశ! - వా.