పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

వాసిష్ఠరామాయణము

గుజనులతోఁ జెల్మి - కొఱగా దటంచు,
విజనస్థలమునందు - వేఱె తా నుండి,
'యారసి తన్ను మో-క్షార్హునిఁ జేయు
కారణగురుఁ డెందుఁ - గలుగునో?' యనెడి
చింతచే డస్సి యా-శ్రీరామచంద్రుఁ
డంతఃపురంబులో - నార్తుఁడై యున్న

విశ్వామిత్రుని రాక


వేళ గాధేయుండు - విమల సత్క్రతువుఁ
దాలిమితోఁ జేయఁ - దలచి వేడుకను
తా నయోధ్యకుఁ బోయి - దశరథుచేత
నానందముగ బూజ-లంది, యామీఁద150
గౌరవంబుగ మహీ-కాంతు నీక్షించి
ధీరత్వ మెసఁగ బ్రా-ర్థించి యిట్లనియె:
'నరనాథ! మత్సవ-నంబు రక్షింప
నఱ లేక శ్రీరాము - నంపవే!' యనిన
విని పంక్తిరథుఁడు నిర్-విణ్ణుఁడై పలికె:
'మునినాథ! యిపుడు రా-మునిఁ బంపలేను,
ఏ క్రమంబుననైన - నీక్షణమందె
నీ క్రతురక్షకై - నేనె వచ్చెదను:
అని పెక్కువిధముల - నమ్మహారాజు
వినిపింప, నమ్ముని-విభుఁడు కోపించి160