పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

332

వాసిష్ట రామాయణము

జననాథుఁ డా మునీ-శ్వరుని వీక్షించి
మనమున నూహించి - మరల ని ట్లనియెఁ:900

'బొలుచు కారణ కార్య - భూతాళితోడ
బలసియున్నట్టి ప్ర-పంచ మంతయును

పరమైన నిర్గుణ - బ్రహ్మమం దైక్య
మెఱిఁగి కావించురీ - తెట్ల ?న్న మౌని

నరనాథు నీక్షించి - నగుమోము మెఱయ
నరమరలేక యి-ట్లని చెప్పుఁ దొడఁగె:

బ్రహ్మైక్యసంధానము



'ఇనవంశతిలక! నీ - వీ రహస్యంబు
పెనుము నేఁ - జెప్పెద విశదంబుగాను

పరఁగ జీవేశ్వరో - పాధుల కైక్య
మెఱుఁగకుండిన ధాత్రి - నెవ్వరికైన910

నరుదైన తత్త్వం ప-దార్దైక్యభావ
మరయ మనోరథ- ముగునంతె గానఁ

గరమొప్పు నీ కార్య - కారణైక్యంబు
నెఱుఁగంగవలె, నది - యెఱిఁగినయపుడె

తహపాంది పరమత - త్త్వంబు తా నొకటి
సహజంబుగా నిండి - శాంతమై యుండు,

జననాథ! యీశ్వరు - పర్వదేహాంబు
ననుపమ బ్రహ్మాండ - మగుచుండు, మఱియు