ఈ పుట ఆమోదించబడ్డది
332
వాసిష్ట రామాయణము
జననాథుఁ డా మునీ-శ్వరుని వీక్షించి
మనమున నూహించి - మరల ని ట్లనియెఁ:900
'బొలుచు కారణ కార్య - భూతాళితోడ
బలసియున్నట్టి ప్ర-పంచ మంతయును
పరమైన నిర్గుణ - బ్రహ్మమం దైక్య
మెఱిఁగి కావించురీ - తెట్ల ?న్న మౌని
నరనాథు నీక్షించి - నగుమోము మెఱయ
నరమరలేక యి-ట్లని చెప్పుఁ దొడఁగె:
బ్రహ్మైక్యసంధానము
'ఇనవంశతిలక! నీ - వీ రహస్యంబు
పెనుము నేఁ - జెప్పెద విశదంబుగాను
పరఁగ జీవేశ్వరో - పాధుల కైక్య
మెఱుఁగకుండిన ధాత్రి - నెవ్వరికైన910
నరుదైన తత్త్వం ప-దార్దైక్యభావ
మరయ మనోరథ- ముగునంతె గానఁ
గరమొప్పు నీ కార్య - కారణైక్యంబు
నెఱుఁగంగవలె, నది - యెఱిఁగినయపుడె
తహపాంది పరమత - త్త్వంబు తా నొకటి
సహజంబుగా నిండి - శాంతమై యుండు,
జననాథ! యీశ్వరు - పర్వదేహాంబు
ననుపమ బ్రహ్మాండ - మగుచుండు, మఱియు