పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

328

వాసిష్ట రామాయణము

నలరి యా పుణ్యాత్ముఁ - డవనిపై వ్రాలి
తొలఁగక భాగ్యవం-తుల యింట నైన,

వరయోగి యగువాని - వంశమందైన
నరయఁ బ్రజ్ఞాశాలి -యై యుదయించి,

వరుసఁ బూర్వజ్ఞాన - వాసనచేత
మెఱయు తదూర్ధ్వభూ-మికలను దాటి,

తదనంతరంబునఁ - దా బ్రహ్మ మగును.
మొదటి భూమిక నుండి -మూఁడు భూమికలు810

వ్యవహార మాత్ర భే-దాస్పదంబులుగ
నవని పైఁ దోఁపించు - నది జాగరంబు;

ఇట్టి జాగ్రద్బూమి - కెక్కినఘనుఁడు
పట్టుగా నార్యుఁడన్ - ప్రస్తుతి (బొంది

వర్తింపుచుండి స-ర్వప్రయత్నములఁ
గర్తయై కావించుఁ, - గర్త గాకుండుఁ;

దత్త్వశాస్త్రవిచార - తత్పరుం డగుచు
సాత్వికబుద్ధి నా-చార్యుఁడై యుండు.

నట్టి యాచార్యత్వ - మాది భూమికను
దట్టమైయంకురి-తం బగుచుండుఁ,820

దెఱఁ గొప్ప నదియె ద్వి-తీయభూమికను
విరివి (జూపట్నఁగా - వికసితం బగును,

తెప్పున నదియె తృ-తీయ భూమికను
తప్పక సంభావి-తం బగుచుండు;

అగతి నార్యుఁడై - యట మృతుండైన
యోగసత్పుణ్య సం-యుతసంచితంబు