పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

వాసిష్ఠరామాయణము

బుద్ధి నూహించి కుం-భుని మోముఁ జూచి,
'సిద్ధంబుగా మీరు-చెప్పిన రీతి

గానే భావించితిఁ-గాను దేహంబు
గాను గోచరములు-గా నింద్రియములు

గాను మనంబును-గాను బుద్ధియును,
గాను జిత్తంబును గా-నహంకృతియుఁ,

నని రాజు పల్కఁగా-నా బ్రహ్మచారి
మనుజేంద్రుఁ జూచి స-మ్మతి నిన్ని నేను

గాను, గా నంటివి-గద! మ ఱెవ్వఁడవు?
పూని దెల్పు మటన్న-భూపాలుఁ డనియె; 1700

'సక లేంద్రియాదులు-జడములై పోఁగ
నకలంక మజడమై.-యుమలమై, యెఱుక

యగుచుఁ జావును, బుట్టు-వను రెండులేని
యగణిత చిన్మాత్ర-మగుదును నేను,

ఇటువంటి నన్ను నే-నెఱుఁగంగనీక
పటుతరాహంకృతి-భ్రాంతిఁ బుట్టించి,

బెట్టుగాఁ దాఁ జిత్త-బీజమై నిలిచి
నట్టు పడంచేసి-న న్నేఁచి యేఁచి,

పూని నే నెంత త-పోనిష్ఠ నున్నఁ
గాని న న్నూరకే- గాసింపుచుండు, 1710

దీనితోఁ బోరుచు-దిక్కేమి దోఁచ
కే నశక్తుఁడ నైతి-నిఁక నెట్టు? లనుచుఁ

బలుకఁగాఁ గుంభుఁ డా-పార్థివేశ్వరుని
సులలిత కరుణతోఁ జాచి కారణము