ఈ పుట ఆమోదించబడ్డది
230
వాసిష్ఠరామాయణము
విలయ వాయువు వీచ - వింధ్యపర్వతము
చలియించినను సుశా-స్త్రము లలంఘ్యములు,
అటుగాన మనుజుల - యప్రభోధమునఁ
బటు దేహవాసనల్ - ప్రబలంబు లగుచుఁ
బొలుచు, నాత్మజ్ఞాన - బుద్ధిచే వాన
నలు క్రమక్రమముగా , నాశంబు నొందు'
నని యనేకములుగా - నాకృష్ణుఁ డర్జు
నునకు బోధింప, న-నూన విజ్ఞాన
కలితుఁడై పార్థుఁడ-క్కడ ఘోరసమర
మలరి యనాసక్తుఁ-డై చేసి గెలుచు 660
నటుగాన నీవు ని రాసక్తిఁ బొంది,
ఘటికుఁడ వై సర్వ కార్యముల్ నడుపు!
మఱి జంతువులకు జన్మపరంపరలను
బొరిఁబొరి సంకల్ప - పూర్వకంబులుగఁ
బరఁగుచుండెడిది విభ్రాంతియే కాని,
నెరసి భావించిన - నిలుకడల్ గావు
అని యివ్విధంబుగా - నారాఘవునకుఁ
బనుపడ నర్జునోపాఖ్యాన సరణి
వినిపించి క్రమ్మఱ - విశ్వాస మొదవ
మునివర్యుఁ డవల రా-మున కిట్టు లనియె 670
నరుదగుచుండు నీయర్థంబునకును
సరియైన శతరుద్రచరితంబు వినుము