228
వాసిష్ఠరామాయణము
నారాయణుఁడు జన-నంబగుఁ, దోడ
భూరి కౌరవ వంశ-మునఁ బుట్టునరుఁడు,
అలఘు మైత్రినిఁ గృష్ణుఁ - దర్శనుం డనఁగ
బొలుపొందుచుందు, ర-ప్పుడు కౌరవులకుఁ
బాండవులకు దొడ్డ - బవరంబు గలుగు,
నండయై శ్రీ కృష్ణుఁ - డప్పు డర్జునునకు 610
ననుగుణ సారథి యై యుండు, నిట్లు
మొనయు భారత యుద్ధమున నాదియందు
సదయుఁడై జ్ఞాతులఁ - జంప నొల్లకయ
విదితుఁడై పార్థుండు - వెఱచుచుండఁగను.
నాపార్థు నా కృష్ణుఁ - డాదరింపుచును
దీపితతత్త్వోప - దేశంబుఁ జేయు:
నది యెట్టు లనిన నీ వాలించి వినుము!
చెదరక యుండెడి - చిద్రూప మెపుడు 620
చెడదు. దృశ్యంబులే - చెడిపోవు చుండు,
నడర నే నెవ్వఁడ - నని యంటివేని
నిజము భావించిన - నీవు నిర్జరుఁడ
డజుఁడవు, నిత్యుండ, - వాత్మవు గానఁ
బుట్టువు. చావు నె-ప్పుడు నీకు లేదు;
నెట్టన నీరీతి నిఖిలజీవులకుఁ
జావు, పుట్టువు లేదు - చర్చించి చూడ,
నేవేళ నయ్యాత్మ - యిరవుగా నుండు.